రేషన్ బియ్యంతో రక్తహీనతను అధిగమించొచ్చు: ఎన్ఐఎన్
రేషన్ బియాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారా...? అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్టే. కిలోకి రూ.10 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రేషన్ బియాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారా...? అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్టే. కిలోకి రూ.10 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారు. దీంతో ‘ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత’ కల్పించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. పౌరసరఫరాల శాఖ గతేడాది ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేపట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రతినెలా 17లక్షల కార్డుదారులకు 40వేల టన్నులపైగా పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో ప్రతినెలా 10 నుంచి 15శాతం పేదల బియ్యం పక్కదారి పడుతోంది. దీనిని నియంత్రించేందుకు సోషల్ ఆడిట్(సామాజిక తనిఖీ) చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
అపోహలు వద్దు
చిన్నారులు, యుక్తవయస్కులు, గర్భిణుల్లో వరుసగా 67శాతం, 57శాతం, 52శాతం రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలపగా.. ఫోర్టిఫైడ్ బియ్యంతో ఈ సమస్యను అధిగమించొచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఒక శ్వేతపత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా 13 మిల్లీగ్రాములు, 13.23 మిల్లీగ్రాములు, 14.35 మిల్లీగ్రాములు, 15.19 మిల్లీగ్రాములు గ్రహిస్తున్నట్టు తేల్చింది.
ఆహారం.. బలవర్థకం
పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్థకం చేయడాన్నే ఫోర్టిఫైడ్గా పరిగణిస్తారు. బియ్యాన్ని పిండిగా మార్చి.. దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి.. ఆ పిండిని బియ్యం రూపంలో కెర్నెల్స్గా మార్చుతారు. ప్రతి 99 కిలోల బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెన్నెల్స్ కలుపుతారు. సంచులో నింపి సనత్నగర్లోని ఎఫ్సీఐలో భద్రపరిచి.. రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారు.
పోషకాలు ఎంతమేర కలుపుతారంటే..
- 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్(ఫెర్రిక్ పైరోపాస్పేట్) కలుపుతారు. లేదా దీనికి బదులు సోడియం ఐరన్ 14 నుంచి 25.25 మి.గ్రాములుకలుపుతారు.
- 75 నుంచి 125 మి.గ్రా వరకు ఫోలిక్యాసిడ్ కలుపుతారు. దీంతోపాటు విటమిన్ బి12 కోసం హైడ్రాక్సైకోబాలమైన్ను ఇంతే మొత్తంలో కలుపుతారు. అదనంగా జింక్, విటమిన్ ఏ, థయమిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ బి6 పోషకాలు కలుపుతారు.
- ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్య ఉండదు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే వీటిని హాస్టళ్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
[ 18-06-2024]
తెలంగాణ ఎక్సైజ్శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు
[ 18-06-2024]
సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
[ 18-06-2024]
మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. -
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
[ 18-06-2024]
భవారియా గ్యాంగ్ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు -
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
[ 18-06-2024]
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. -
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్
[ 18-06-2024]
టీఎస్ న్యాబ్ ఆకస్మిక డ్రగ్స్ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్ శ్రీరామ్నగర్కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్కు చెందిన స్వరూప్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. -
చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?
[ 18-06-2024]
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. -
అత్యవసర బృందాలు ఎక్కడ?
[ 18-06-2024]
వానాకాలంలో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసర బృందాలు సిద్ధం చేశామని జలమండలి ఊదరగొడుతుంది. -
కోడ్ మాటున.. కట్టేశారు!
[ 18-06-2024]
కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?
[ 18-06-2024]
పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. -
నగరకంలొ కుండపోత వాన
[ 18-06-2024]
-
ఐటీ కారిడార్పై రెవెన్యూ నజర్
[ 18-06-2024]
ఐటీ కారిడార్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి
[ 18-06-2024]
రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం రేవంత్ అభినందన
[ 18-06-2024]
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు -
ప్రకృతిలో అడుగులు.. పక్షుల పాఠాలు
[ 18-06-2024]
సెలవొస్తే బద్ధకంగా నిద్రలేసే నగర ప్రజలకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. -
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి
[ 18-06-2024]
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. -
349 మంది పట్టుబడ్డారు
[ 18-06-2024]
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్లోని 14 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. -
మామూళ్ల కోసం అధికారుల పోట్లాట
[ 18-06-2024]
జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు ఆహార కల్తీని ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదు. -
ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. -
నీరు.. చేనుకు చేరేదెలా..?
[ 18-06-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్ సేన్
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
రైటర్గా అలియా భట్.. ఆమె ఏం రాశారంటే?