కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి
ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది.
ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన
భర్త జగన్తో శాంతి, కవల పిల్లలు
బోరబండ, న్యూస్టుడే: ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ ఆమె బంధువులు మోతీనగర్ ప్రాంతంలోని పద్మప్రియ హాస్పిటల్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మృతురాలి భర్త పాత్లావత్ జగన్, బోరబండ పోలీసులు తెలిపిన ప్రకారం శంషాబాద్ సమీపంలోని ఏనుగుమడుగు తండాకు చెందిన పాత్లావత్ శాంతి (24) కాన్పు కోసం మోతీ నగర్లోని పద్మప్రియ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటోంది. కాన్పు కోసం దంపతులిద్దరు 27న ఆస్పత్రికి వచ్చారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఎదురుగా ఉన్న సౌమ్య ఆస్పత్రికి తరలించి 28న ఉదయం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పాప, బాబు జన్మించారు. తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అమీర్పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శాంతి భర్త జగన్, బంధుమిత్రులు ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బోరబండ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.వీరశేఖర్, ఎస్.ఐ. తుల్జారామ్ రాథోడ్ పరిస్థితిని చక్కదిద్దారు. ఫిర్యాదు మేరకు డాక్టర్ పద్మావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్తహీనత ఉన్న ఆమెకు మందులతో చికిత్స అందించాం. ప్రసవం అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందనలు తగ్గడంతో పరిస్థితి విషమించిందని డాక్టర్ పద్మావతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి రాజీనామా నిర్ణయం అభినందనీయం: కేటీఆర్
[ 31-05-2024]
రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. -
గొర్రెల పంపిణీ స్కామ్.. మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్
[ 31-05-2024]
గొర్రెల పంపిణీ స్కామ్లో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. -
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
[ 31-05-2024]
నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలి: ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్
[ 31-05-2024]
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని భారాస నేత ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
తెలంగాణలో రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు: వాతావరణ శాఖ
[ 31-05-2024]
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ ఎస్సై
[ 31-05-2024]
నగరంలోని కుషాయిగూడ ఎస్సై షఫీ ఏసీబీకి చిక్కారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్
[ 31-05-2024]
కాళేశ్వరం, ధరణిలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. -
అందరితో చర్చించే సీఎం రేవంత్ నిర్ణయాలు: ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్
[ 31-05-2024]
తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. -
ఏసీబీ వలలో మరో నీటిపారుదల శాఖ అధికారి.. 4 గంటలు శ్రమించి అదుపులోకి..
[ 31-05-2024]
నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. -
ఇద్దరి అవయవదానం.. పది మంది జీవితాల్లో వెలుగు
[ 31-05-2024]
జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఎల్బీనగర్ జీజేనగర్ కాలనీకి చెందిన జెట్టి గజానంద్(50) పోస్టుమ్యాన్గా విధులు నిర్వహించేవారు. -
ప్రయాణికురాలు, టీటీఈ మధ్య ఘర్షణ
[ 31-05-2024]
రైలు ప్రయాణికులు, టీటీఈ మధ్య ఘర్షణ జరిగింది. టీటీఈకి గాయాలు కావడంతో సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం... -
కళ్లముందే కన్నతండ్రిని కబళించిన మృత్యువు.. మృతదేహం పక్కన గుక్కపట్టి ఏడ్చిన బాలుడు
[ 31-05-2024]
ఉదయాన్నే కుమారుడిని ముద్దు చేస్తూ కూడలికి తీసుకెళ్లాడు.. అల్పాహారం తీసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటి బాటపట్టారు. -
అత్యధిక వేడిమిని.. మెట్రోతో అధిగమించొచ్చు!
[ 31-05-2024]
నగరాలు అంటేనే అర్బన్ హీట్ ఐలాండ్స్. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగర పరిసరాల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది నగరంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల వరకు వెళ్లాయి. ఇందుకు నగరంలో వాహనాలు పెరగడం కూడా ఓ కారణం. -
సకల జనుల గొంతుకై.. ఉద్యమానికి ఊపిరై
[ 31-05-2024]
అమరుల బలిదానాలు..ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అనేక మంది పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. -
ఈవెంట్ నిర్వాహకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 31-05-2024]
పనిచేసే చోట పరిచయమైన ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ దందాకు తెరతీశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు వారిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. -
ఆత్మార్పణతోనైనా ఆవిర్భవించాలని..
[ 31-05-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 21న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పడింది. సుమారు 26 విద్యార్థి సంఘాలు ఇందులో చేరాయి. -
అత్యవసర దందా
[ 31-05-2024]
వర్షాకాల అత్యవసర బృందాల ఏర్పాటు పనుల్లో కొందరు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు చేతివాటాన్ని ప్రదర్శించారు. బినామీ గుత్తేదారులకు కాంట్రాక్టులు అప్పగించాలన్న ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. -
విద్యుత్తు ‘మే’లుకొలుపు
[ 31-05-2024]
ప్రధాన నగరం మెట్రోజోన్ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, పాతబస్తీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ సెంట్రల్ సర్కిళ్లు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. -
వైద్య విద్యార్థిని బలవన్మరణం
[ 31-05-2024]
పరీక్ష తప్పడంతో నిండు ప్రాణం తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది షాద్నగర్ పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని కీర్తి. -
ఈ-సిగరెట్.. సరదాగా తాగినా చేటే!
[ 31-05-2024]
నగర యువతలో ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) వినియోగం భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ సిగరెట్తో పోల్చితే ఇది ప్రమాదకరం కాదనే ధీమాతో చాలామంది ఈ-సిగరెట్ను అలవాటుగా చేసుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. -
గోరక్షణకు రంగంలోకి దిగుతున్నా..
[ 31-05-2024]
‘‘గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సరికాదు.. ప్రస్తుతం నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా.. -
పెరుగుతున్న ఇంధన వినియోగం
[ 31-05-2024]
ఇంధన ధరలు భగ్గుమంటున్నా.. వినియోగంలో తగ్గేదేలేదంటున్నారు నగరవాసులు. గతేడాదితో పోల్చితే గ్రేటర్లో పెట్రోల్ 24శాతం, డీజిల్ వినియోగం 15శాతం పెరిగింది. -
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలి
[ 31-05-2024]
తెలుగు భాష, సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని పోషిస్త్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ‘తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి’ నామకరణం చేయాలని వక్తలు కోరారు. -
పల్లె ప్రగతి.. నింపాలి స్ఫూర్తి
[ 31-05-2024]
‘దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లేనని’ మహాత్మా గాంధీ అన్నారు. ఈ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని 2019 సెప్టెంబర్ 4న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
సాంకేతిక శిక్షణ.. భవితకు నిచ్చెన
[ 31-05-2024]
నేటి ఆధునిక సమాజంలో శాస్త్ర, సాంకేతిక కోర్సులకు, వృత్తి నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. -
కొడుకు చేతికి బండి.. ప్రాణాలొదిలిన తండ్రి
[ 31-05-2024]
వాహనాలు, ద్విచక్రవాహనాలు మైనర్ల చేతికి ఇవ్వొద్దని పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా కొందరు పెద్దల్లో మార్పు రావడం లేదు. పిల్లలకు బండ్లు ఇవ్వడంతో వారు ఇష్టారీతిన నడిపి.. -
గూగుల్ రివ్యూలు ఇవ్వాలని..
[ 31-05-2024]
హోటళ్లు, రెస్టారెంట్లకు గూగుల్ రివ్యూలు ఇస్తే.. రూ.లక్షలు సంపాదించొచ్చని నమ్మించి డబ్బులు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
ఉద్యోగాల కల్పన పేరిట రూ.45 లక్షలు దండుకున్న మహిళ
[ 31-05-2024]
నిరుద్యోగులకు టోకరా వేసి దాదాపు రూ.45 లక్షల వరకు దండుకుందో మహిళ. తమ డబ్బులు తమకివ్వాలని లేదా ఉద్యోగం కల్పించాలని కార్యాలయానికి వస్తున్న బాధితులను సిబ్బందితో బెదిరించింది. -
మీరు చెల్లించాల్సిన పన్ను ఎంతంటే
[ 31-05-2024]
ఆస్తిపన్ను ఎంత చెల్లించాల్సిఉందో తెలుపుతూ ఇంటింటికీ జీహెచ్ఎంసీ డిమాండ్ నోటీసులను పంపిణీ చేస్తోంది. మే 28న మొదలైన పంపిణీ ఈ నెలాఖరు వరకు జరగనుందని అధికారులు వెల్లడించారు. -
మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి
[ 31-05-2024]
మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాలాల మండలంలోని అక్కంపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్- రష్యా యుద్ధం.. 150 మంది ఖైదీల విడుదల
-
భారత ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ఏఐ సంచలన నివేదిక
-
తెలంగాణ నుంచి రిలీవ్.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన ఐఏఎస్ శ్రీనివాసరాజు
-
లక్షకు పైగా టెస్లా కార్ల రీకాల్.. కారణం ఇదే..
-
ఫేస్బుక్లో లింక్ క్లిక్ చేసి రూ.34 లక్షలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి
-
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్ సేన్