ఆఖరి ఆదివారం.. నేతల సపరివారం
ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు.
కాలనీలు, బస్తీల బాటపట్టిన అభ్యర్థులు, నాయకులు
సమావేశాలు, సహపంక్తి భోజనాలతో కిక్కిరిసిన ఫంక్షన్హాళ్లు
ఈనాడు - హైదరాబాద్
ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. దీంతో ఈ ఆదివారం నగరమంతా కోలాహలంగా మారింది. అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు కాలనీలు, బస్తీలను ఉదయం నుంచే చుట్టేశారు. సమావేశాలు, సమాలోచనలతో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. ఉదయం అల్పాహారం నుంచే సందడి మొదలైంది. ప్రచారం ముగిసిన తర్వాత ప్రచార శిబిరాలతో పాటు కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లు ఇలా అన్నీ భోజన సమావేశాలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి పార్కులు, కాలనీలు, బస్తీల్లో ప్రచారం చేస్తూ 11 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కమ్యూనిటీ హాళ్లలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ సంఘాలతో సమావేశమై ప్రచారాన్ని హోరెత్తించారు.
అపార్టుమెంట్ వాసులతో..
మిగతా రోజుల్లో అందరూ ఒకేచోట దొరకని పరిస్థితి ఉండడంతో.. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు అపార్టుమెంట్లలో ఆదివారం ప్రచారం జోరుగా సాగింది. అంతటా పార్టీ అభ్యర్థులతోనే కాకుండా.. నాయకులు, ముఖ్య అనుచరులు స్వయంగా అపార్టుమెంట్లలో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగట్టారు. కాలనీ సంఘాలతో సమావేశమై సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిచ్చారు. లోక్సభ ఎన్నికలు కావడంతో నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారాన్ని హోరెత్తించారు. అందుకే విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగి ఉదయం నుంచే జనం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పార్టీ గుర్తులు, కరపత్రాలను పంపిణీ చేశారు.
ఏసీ హాళ్లకు గిరాకీ..
ప్రస్తుతం శుభకార్యాలకు అనువైన తేదీలు లేవు. శుభముహూర్తాలు లేవు. అయినా సరే ఎన్నికల నేపథ్యంలో ఫంక్షన్ హాళ్లు ఏవీ ఖాళీగా ఉండడం లేదు. స్థానిక నాయకులు ముందుగానే బుక్ చేసి.. అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఒక పార్టీకి, తర్వాత మరో పార్టీకి అద్దెలకు ఇచ్చి ఫంక్షన్ హాళ్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం కాలనీలు, బస్తీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎండ ముదరగానే ఏసీ హాళ్లకు చేరుకుంటున్నారు. వాటిలో సమావేశాలు నిర్వహించి అందరితో కలిసి ఫంక్తి భోజనాలు చేసి సేదతీరుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రచార వ్యయం పెరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
[ 18-06-2024]
తెలంగాణ ఎక్సైజ్శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు
[ 18-06-2024]
సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
[ 18-06-2024]
మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. -
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
[ 18-06-2024]
భవారియా గ్యాంగ్ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు -
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
[ 18-06-2024]
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. -
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్
[ 18-06-2024]
టీఎస్ న్యాబ్ ఆకస్మిక డ్రగ్స్ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్ శ్రీరామ్నగర్కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్కు చెందిన స్వరూప్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. -
చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?
[ 18-06-2024]
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. -
అత్యవసర బృందాలు ఎక్కడ?
[ 18-06-2024]
వానాకాలంలో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసర బృందాలు సిద్ధం చేశామని జలమండలి ఊదరగొడుతుంది. -
కోడ్ మాటున.. కట్టేశారు!
[ 18-06-2024]
కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?
[ 18-06-2024]
పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. -
నగరకంలొ కుండపోత వాన
[ 18-06-2024]
-
ఐటీ కారిడార్పై రెవెన్యూ నజర్
[ 18-06-2024]
ఐటీ కారిడార్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి
[ 18-06-2024]
రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం రేవంత్ అభినందన
[ 18-06-2024]
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు -
ప్రకృతిలో అడుగులు.. పక్షుల పాఠాలు
[ 18-06-2024]
సెలవొస్తే బద్ధకంగా నిద్రలేసే నగర ప్రజలకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. -
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి
[ 18-06-2024]
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. -
349 మంది పట్టుబడ్డారు
[ 18-06-2024]
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్లోని 14 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. -
మామూళ్ల కోసం అధికారుల పోట్లాట
[ 18-06-2024]
జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు ఆహార కల్తీని ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదు. -
ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. -
నీరు.. చేనుకు చేరేదెలా..?
[ 18-06-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
రైటర్గా అలియా భట్.. ఆమె ఏం రాశారంటే?
-
ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు