సీనియర్ నేత శ్రీనివాసప్రసాద్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు.
శ్రీనివాస ప్రసాద్
మైసూరు, న్యూస్టుడే : కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు. మూత్రపిండాల వైఫల్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆయనను ఏప్రిల్ 22న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మైసూరు జయలక్ష్మిపురంలోని ఆయన నివాసం వద్దకు సోమవారం ఉదయం తరలించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన భార్య భాగ్యలక్ష్మి, కుమార్తెలు ప్రతిమ, పూర్ణిమ, పూనం తెలిపారు. మైసూరు సిల్కు ఫ్యాక్టరీ కూడలిలోని డాక్టర్ అంబేడ్కర్ ట్రస్టు ఆవరణలో బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాసప్రసాద్కు సంతాప సూచకంగా మంగళవారం మైసూరు, చామరాజనగర జిల్లాల్లో అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర తదితరులు సంతాపం తెలిపారు.
ఆరుసార్లు చామరాజనగర లోక్సభ నియోజకవర్గం నుంచి, రెండుసార్లు నంజనగూడు నుంచి అసెంబ్లీ బాట పట్టిన శ్రీనివాస ప్రసాద్ విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రారంభంలో జనసంఘ్ నిర్వహించే సభలు, సమావేశాల్లో పాల్గొంటూ, 1972 నుంచి క్రియాశీల కార్యకర్తగా మారారు. ఏబీవీపీలోనూ చురుకుగా ఉండేవారు. బూసా ఉద్యమానికి 1973లో నేతృత్వం వహించారు. మైసూరు కృష్ణరాజ నియోజకవర్గంలో 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సంస్థా కాంగ్రెస్ విజయం సాధించింది. దాని నాయకుడు రామకృష్ణ హెగ్డే పిలుపుతో ఆ పార్టీలో చేరారు. అక్కడ యువ విభాగం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. అత్యయిక పరిస్థితిలో భారతీయ జనసంఘ్, సంస్థా కాంగ్రెస్, సమాజవాది పార్టీ, భారతీయ లోకదళ్, స్వతంత్ర పార్టీ 1977లో విలీనమై జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీలో కార్యవర్గ సభ్యునిగా నియమితులై 1977లో చామరాజనగర లోక్సభ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. టీ నరసీపుర అసెంబ్లీ నుంచి 1978లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం చామరాజనగర లోక్సభ స్థానం నుంచి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా 1980లో మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2013-2017 వరకు పని చేశారు. సిద్ధరామయ్య తనను మంత్రి పదవి నుంచి తప్పించడంతో భాజపాలో చేరారు. భాజపా అభ్యర్థిగా చామరాజనగర నుంచి 2019లో విజయం సాధించారు. తనకు ఆరోగ్య క్షీణించిందని, ఇకపై ఏ ఎన్నికలలోనూ పోటీ చేయనని గత ఏడాదే ప్రకటించారు.
శ్రీనివాసప్రసాద్కు అంతిమ నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
శ్రీనివాసప్రసాద్కు అంతిమ నివాళులర్పిస్తున్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ్వాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
నీట్ అక్రమాలపై వెల్లువెత్తిన నిరసన
[ 13-06-2024]
నీట్ ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై కొప్పళలో ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు చేయించాలని కోరారు. -
గ్యారంటీలపై పునరాలోచన?
[ 13-06-2024]
మొన్నటికిమొన్న లోక్సభ ఎన్నికలకన్నా ముందు.. విధానసభ పోరులో కాంగ్రెస్ సాధించిన ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో ఐదు గ్యారంటీలే కీలకం. ఇక్కడ కాంగ్రెస్ రూపొందించిన గ్యారంటీల పథకాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. -
హైకోర్టు మెట్లెక్కిన అప్ప
[ 13-06-2024]
పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్పకు సదాశినగర ఠాణా పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. -
దర్శన్పై రౌడీషీట్?
[ 13-06-2024]
తనతో సహజీవనం చేస్తున్న పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపించాడని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28)ని హత్య చేసిన కేసులో కథానాయకుడు దర్శన్పై రౌడీషీటు తెరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. -
అది.. అత్యాచారం కాదు
[ 13-06-2024]
వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధాన్ని పెట్టుకుని కొన్నేళ్ల అనంతరం మాట తప్పితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేయడం కుదరదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. -
ప్రియుడిని కడతేర్చిన ప్రేయసి
[ 13-06-2024]
సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రాజేశ్ (32) అనే వ్యక్తిని ప్రేమ (34) అనే మహిళ తన సోదరుడు శివు (32)తో కలిసి హత్య చేసింది. -
పాక్కు మద్దతుగా నిందితుడి నినాదాలు
[ 13-06-2024]
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏడీజీపీ అలోక్ కుమార్లను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడి అరెస్టయిన శాకిర్ మహ్మద్ అలియాస్ జయేశ్కాంత్ పూజారి పాకిస్తాన్కు మద్దతుగా కోర్టు ఆవరణలో నినాదాలు చేశాడు. -
దేశభక్తికీ పెను ముప్పు
[ 13-06-2024]
కర్ణాటకలో భారత్ మాతా కీ జై అన్నా తప్పేనని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. గూండాల చేతికి ప్రభుత్వం అధికారాన్ని అప్పగించిందని దుయ్యబట్టారు. -
మహిళలపై ఎన్నాళ్లీ దాడులు?
[ 13-06-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయని వివిధ మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు స్థానిక స్వాతంత్య్ర ఉద్యానవనంలో బుధవారం ధర్నాకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్
-
ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన