తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు.
ప్రదీప్రెడ్డిని నిలదీస్తున్న జాలవాడి మహిళలు
పెద్దకడబూరు, న్యూస్టుడే: మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి రావడంతో తాగునీటి ఎద్దడిపై మహిళలు ప్రశ్నించారు. దళితవాడపై ఎందుకు చిన్నచూపు చూపారని అడిగారు. తాగడానికి గుక్కెడు నీరందించని పాలకులు ఓటెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓటర్లు గుర్తుకొస్తారు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోరని నిలదీశారు. వారానికోసారి అర్ధరాత్రి కేవలం ఒకటి, రెండు బిందెల నీళ్లు వదిలితే ఎలా అని వాపోయారు. దీంతో ప్రదీప్రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీరందిస్తామని చెప్పడంతో శాంతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు పాలన స్వర్ణయుగమే
[ 17-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బక్రీద్కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ
[ 17-06-2024]
బక్రీద్ పండగను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన కర్నూలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్తోపాటు జొహరాపురం, పూలబజారు, గుత్తి పెట్రోలు బంకు, సంతోష్నగర్ ఈద్గా, పంచలింగాల చెక్పోస్టు సందర్శించి తనిఖీ చేశారు. -
త్యాగాలకు ప్రతీక బక్రీద్
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదుల్ అజ్హా (బక్రీద్) పర్వదినం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలు, మసీదులను ప్రార్థనలకు సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఉమ్మడి జిల్లా కర్నూలు. ఇక్కడ 6.70 లక్షల మంది ఉన్నారు. -
మంత్రులను కలిసేందుకు అధికారుల ఆసక్తి
[ 17-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాకు నియమితులైన ముగ్గురు మంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి అభినందనలు తెలియజేసేందుకు జిల్లా అధికారులు వరుస కడుతున్నారు. -
వైకాపాకు వంతపాడారు
[ 17-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కొందరు అధికారులు వైకాపాకు లాభం చేకూర్చేలా వ్యవహరించారు.. అలాంటి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్