అంత్యక్రియలకు వెళ్లొస్తుండగా ప్రమాదం..
ట్రాక్టర్, ఆటోను ఢీకొని తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండల పరిధి జంగరాయి శివారులో సోమవారం జరిగింది.
తొమ్మిది మందికి గాయాలు
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: ట్రాక్టర్, ఆటోను ఢీకొని తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండల పరిధి జంగరాయి శివారులో సోమవారం జరిగింది. స్థానికులు, ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన ప్రకారం. చిన్నశంకరంపేట మండలం శాలిపేట పంచాయతీ పరిధి రామాయపల్లికి చెందిన కొందరు ఆటోలో బంధువుల అంత్యక్రియలకు ఉప్పులింగాపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా, గవ్వలపల్లి తండానుంచి వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై పోసిన ధాన్యం కుప్పను తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో చోదకుడు శ్యాములు, చంద్రయ్య, రామవ్వ, సావిత్రి, భూపాల్, మల్లవ్వ, సృజన, సజ్జీ, భరత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అక్కడికి చేరుకుని ఆటలో పడిపోయిన వారిని బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ట్రాక్టర్ చోదకుడు పరారీలో ఉన్నాడని, వివరాలు తెలియాల్సి ఉందని ఏఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్