రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.
న్యూస్టుడే, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.
- సముచిత స్థానం దక్కటం లేదని ఆరోపిస్తూ సిద్దిపేట మున్సిపాలిటీలోని కొందరు కౌన్సిలర్లు మరో పార్టీలో చేరారు.
- పార్టీ పదవులతోపాటు పెద్ద ఎత్తున నగదు ఇస్తామన్న భరోసాతో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ మారినట్లు ప్రచారం సాగుతోంది.
- వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్పంచితోపాటు ఎంపీటీసీ, ఎంపీపీ పదవులపై కన్నేసిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు అధికార పార్టీలోకి చేరారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గజ్వేల్ మండలంలోని ఓ యువ నాయకుడు సర్పంచి పదవి ఆశించి.. గ్రామంలో పలువురు పార్టీ మారుతున్నట్లు గ్రహించి అతనే ముందుగా వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటు ఎన్నికల వేళ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో కండువాలు మార్చుతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న పార్టీ పెద్దలు వారిని అక్కున చేర్చుకుని పావులు కదుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించి విజయాన్నందుకోవాలన్న లక్ష్యంతో ప్రధానపార్టీల నేతలు చేరికలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజూ చేరికలు ఉండేలా ప్రధాన పార్టీల నేతలు చూసుకుంటున్నారు. ప్రత్యర్థి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే వ్యూహంగా ఉంటున్నారు.
అటూఇటూ అయితే అంచనా ఎటు!
అంది వచ్చే ప్రతి అంశాన్ని వినియోగించుకుంటూ భారాస చేరికలను ఆహ్వానిస్తుండగా ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్, భాజపాల నేతలు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీలు పార్టీలను వీడుతుండటం ప్రభావం ఎటువైపు ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. భారాసకు అన్నీ తానై ముందుకు సాగుతున్న మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారాలతో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు చేజారకుండా చూస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు ముఖ్యనేతలు చేరికలను పర్యవేక్షిస్తున్నారు. భాజపాలో అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావుతోపాటు ముఖ్యనేతలు పార్టీ ప్రచారం, చేరికలపై దృష్టిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చందాలకు.. ప్రత్యేక కార్యాచరణ
[ 13-06-2024]
పర్యావరణ పరిరక్షణలో వృక్షాలే కీలకం. వీటి వల్లే ఆహ్లాదకర వాతావరణంతోపాటు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ముఖ్యంగా అడవుల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే భారీ వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరిగి పంటలు బాగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. -
ధాన్యం మరాడించడంపై దృష్టి
[ 13-06-2024]
కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించడంపై అధికారులు దృష్టి సారించారు. నాలుగు సీజన్లకు సంబంధించి ఆయా మిల్లులకు ధాన్యం కేటాయించగా, -
చదువులమ్మ నెలవుల్లో.. చిన్నారుల చిరునవ్వులు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చిన్నారులతో సందడి నెలకొంది. సర్కారు బడులను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. -
5 నెలలు.. 175 మరణాలు
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి చిహ్నాలంటారు. అవే దారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లడం, మద్యం తాగి నడపడం, ఇష్టారీతిన వాహనాలు నిలపడం, -
ఉద్యాన సాగుకు ఊతమేదీ?
[ 13-06-2024]
విత్తు నాటగానే వరుణుడి కటాక్షం కోసం ఆకాశం వైపు చూడాలి.. మొలకెత్తింది మొదలు పంటకు చీడపీడల నివారణ.. చేను కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన
[ 13-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. -
లీకేజీలతో శుద్ధ జలం కలుషితం
[ 13-06-2024]
మిషన్భగీరథ పథకం నీటి సరఫరాలో నెలకొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
టోల్గేట్తో ఆదాయం.. ఏదీ సదుపాయం?
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి సూచిక. వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన రహదారులను నాలుగు నుంచి ఆరు వరుసలుగా నిర్మించాయి. -
పర్యావరణహితమే సంకల్పం
[ 13-06-2024]
పర్యావరణ శ్రేయస్సు.. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పలువురు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. స్వార్థం చూసుకోకుండా స్వచ్ఛతలో భాగస్వామ్యమవుతూ ఇతరులకు ప్రేరణ కల్పిస్తున్నారు. -
కృత్రిమ ఇసుకతో భూమాత నిస్సారం
[ 13-06-2024]
పంటల సాగు చేపట్టాలంటే మట్టి, ఇసుకరేణువులతో కూడిన సారవంతమైన భూమి అవసరం. కొందరు మట్టి నుంచి కృత్రిమంగా ఇసుక తయారుచేసి అక్రమ దందా సాగిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ పోస్టర్లో మా నాన్నను చూస్తే భయమేసింది: వరుణ్ తేజ్
-
షకీబ్ అల్ హసన్ హాఫ్ సెంచరీ.. నెదర్లాండ్స్ లక్ష్యం 160
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి