కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తండ్రి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్
జవహర్నగర్, న్యూస్టుడే: కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తండ్రి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ సాయి వివరాల ప్రకారం.. అంబేడ్కర్నగర్లో నివాసం ఉంటున్న మెండె లక్ష్మణ్ (35)కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. లక్ష్మణ్ స్థానికంగా కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. ఇతని పెద్ద కుమారుడు పునీత్ (07) కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పునీత్ బుధవారం మృతిచెందాడు. కొడుకు మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్.. గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలో అగ్నిమాపక శాఖ తనిఖీలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో వాణిజ్య భవనాలు, నివాస సముదాయాలు, మల్టీప్లెక్సులు సహా వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ తనిఖీలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల అగ్నిమాపక అధికారులు ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్రావు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్