logo

గొడ్డలితో భార్యను చంపిన భర్త

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఆగ్రహించిన భర్త గొడ్డలితో కొట్టడంతో భార్య మృతి చెందింది. ఆమనగల్లు సీఐ ఉపేందర్‌, కడ్తాల్‌ ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 25 Jan 2022 02:07 IST


సుశీల

కడ్తాల్‌ (ఆమనగల్లు), న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఆగ్రహించిన భర్త గొడ్డలితో కొట్టడంతో భార్య మృతి చెందింది. ఆమనగల్లు సీఐ ఉపేందర్‌, కడ్తాల్‌ ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండలం సాలార్‌పూర్‌కి చెందిన ముదెంటి ఎల్లయ్య, కడ్తాల్‌కి చెందిన సుశీల(32)కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఎల్లయ్య ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సుశీల కూలి పనులకు వెళ్తుంది. ఎల్లయ్య ఆదివారం రాత్రి ఆలస్యంగా రావడంతో భార్య సుశీల నిలదీసింది. తాగిన మత్తులో ఎల్లయ్య గొడ్డలితో భార్య సుశీల తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని విషయాన్ని కడ్తాల్‌లో ఉన్న సుశీల సోదరులకు తెలిపారు. వారు వెంటనే సాలార్‌పూర్‌కు చేరుకుని సుశీలను మహేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. నిందితుడు ఎల్లయ్యను సోమవారం సాయంత్రం తలకొండపల్లి మండల కేంద్రం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు. సాలార్‌పూర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి ఎసైలు ధర్మేశ్‌, హరిశంకర్‌గౌడ్‌, వరప్రసాద్‌లతో బందోబస్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని