ప్రముఖుల పుస్తకంలో రాచర్ల వాసికి చోటు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్కీబాత్లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్రెడ్డికి చోటు దక్కింది.
పైనుంచి ముడో వరుసలో ఎడమ నుంచి మొదటి వ్యక్తి రాంభూపాల్రెడ్డి
రాచర్ల, న్యూస్టుడే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్కీబాత్లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్రెడ్డికి చోటు దక్కింది. గత రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన మొత్తం పోస్టాఫీసు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒక సారి పంచాయతీ లోని 100 మంది పేద బాలికల విద్య కోసం సుకన్య యోజన పథకంలో బాలికల అకౌంట్లలో జమ చేస్తున్నారు. గత 9సంవత్సరాలుగా మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడిన వారితో ప్రముఖంగా 100మందిని గుర్తించి ఒక వారి చేసిన కార్యక్రమాలపై ఒక ఆల్బమ్ తయారు చేసి ముద్రించారు. ఇందులో ఈయన చిత్రం, ఈయన చేసిన సేవలను ప్రచురించారు. ఈ పుస్తకం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసి ప్రముఖ వ్యక్తులకు పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతం
[ 14-06-2024]
సమష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఏఆర్వోలు, ఇతర శాఖల అధికారులతో కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చంద్రన్న సంతకం.. మొదలైంది నవశకం
[ 14-06-2024]
నిరుద్యోగుల నిరీక్షణ ఫలించింది. భూములు ఎక్కడ లాక్కుంటారోనన్న అభద్రతా భావం సామాన్యుల్లో తొలగిపోయింది. పెరిగిన పింఛనుతో అవ్వాతాతల ఆశ నెరవేరింది. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. -
ప్రైవేటు బడంటే దడ
[ 14-06-2024]
మద్దిపాడుకు చెందిన సురేష్ అనే వ్యక్తి వారి పాపను తొమ్మిదో తరగతిలో చేర్పించేందుకు ఒంగోలులోని ఓ ప్రైవేటు పాఠశాలకు వచ్చారు. ఫీజు, పుస్తకాలు, బస్సు, యూనిఫాం ఇతరత్రాలు కలిపి రూ.60 వేలకు లెక్క చెప్పారు. -
నల్లమల... ఇక ప్లాస్టిక్ రహితం!
[ 14-06-2024]
ప్రకృతి వరప్రదాయని నల్లమలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై అటవీశాఖ నిషేధం విధించింది. -
మూసీలా.. సప్లయ్ ఛానల్
[ 14-06-2024]
పశ్చిమంలో అత్యంత ప్రాధాన్యమున్న మార్కాపురం సప్లయ్ ఛానల్ కళ తప్పి దయనీయంగా మారింది. కనీస నిర్వహణ లేక మూసీ నదిని తలపిస్తోంది. 583 ఎకరాల్లో విస్తరించి, 1006 ఎకరాలకు నీరందిస్తున్న మార్కాపురం చెరువుకు నీరందించడంలోఇదే కీలకం. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
[ 14-06-2024]
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో స్థానిక పాత మార్కెట్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. -
మంత్రి స్వామిని కలిసిన తెదేపా నాయకులు
[ 14-06-2024]
రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని టంగుటూరు మండల తెదేపా నాయకులు గురువారం విజయవాడలో కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. -
కొండంత ఆశ.. చదువులే శ్వాస
[ 14-06-2024]
వేసవి సెలవులు ముగియడంతో గురువారం విద్యార్థులు బడుల బాట పట్టారు..సైకిళ్లపై కొందరు..కిక్కిరిసిన ఆటోల్లో మరికొందరు ఆదరాబాదరాగా చేరారు. సరస్వతీ దేవికి నమస్సులు..పాత స్నేహితులతో కబుర్లు.. స్కూలు టైంటేబుళ్లు.. ఆపై క్లాసులు. -
తొలి సంతకంతో చిగురించిన ఆశలు
[ 14-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు చేయడంతో బీఈడీ, టీటీసీ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి.