ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు.
కలశంపై పుణ్యజలాలు పోస్తున్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
కాంచీపురం, న్యూస్టుడే: కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. పనులు ముగియడంతో శుక్రవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. మూడు రోజులుగా మఠం ప్రాంగణంలో యాగశాల పూజలు భరణీధరశాస్త్రి నేతృత్వంలో 20 మంది వేదపండితులు, రుత్వికులు నిర్వహించారు. శుక్రవారం యాగశాల పూజలు పూర్తి కావడంతో పూర్ణాహుతి నిర్వహించారు. దీపారాధన అనంతరం కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. యాగశాలలో ఉంచిన పుణ్యజలాలతో ఆదిశంకరుడు, శ్రీఅనుక్కై గణపతి, సరేశ్వరాచార్యుల సన్నిధుల గోపుర కలశాలకు దీపారాధన, మూలమూర్తులకు అభిషేకాలు చేశారు. కుంభాభిషేకంలో ముల్లై వాసల్ కృష్ణమూర్తి, చెన్నై ఐఐటీ డైరెక్టరు కామకోటి సహా పలువురు ప్రముఖులు, శంకరమఠం భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను మఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, మేనేజర్ సుందరేశ అయ్యర్, సిబ్బంది పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ముప్పెరుం విళా
[ 16-06-2024]
కోయంబత్తూరు కొడిషియా మైదానంలో డీఎంకే ముప్పెరుం విళా శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. లోక్సభ ఎన్నికల విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, కలైజ్ఞర్ శతాబ్ది వేడుక, ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపే తదితర మూడు వేడుకలు జరిగాయి. -
వరదలు ఎదుర్కోవడమెలా?
[ 16-06-2024]
2015, 2021, 2023 వరదలు నగర సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రశ్నించాయి. కాలనీలు మునగడంతో అధికారిక వ్యవస్థకు ఏం చేయాలో పాలుపోలేదు. లక్షలాది ప్రజలు బాధితులుగా మారారు. -
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త లోగో
[ 16-06-2024]
తిరుప్పూర్ జిలాల్లో కలైజ్ఞర్ క్రీడా ఉపకరణాలను అందించే కార్యక్రమం శనివారం జరిగింది. యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొని తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త లోగో విడుదల చేశారు. -
రంగుమారిన తాగునీరు
[ 16-06-2024]
షోలింగనల్లూరు ప్రాంతవాసులు గత పదిరోజులుగా పైపుల ద్వారా రంగు మారిన నీరందుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపుల ద్వారా వచ్చే నీరు వినియోగించుకోలేక పోతున్నామని తమిళనాడు హౌసింగ్ బోర్డు ఫేజ్-2లో ఉంటున్న వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఉప ఎన్నికలో పోటీ చేయం: ఈపీఎస్
[ 16-06-2024]
విక్రవాండి ఉప ఎన్నికలో పోటీ చేయమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ప్రకటించారు. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉప ఎన్నికపై శనివారం సమాలోచన జరిగింది. -
‘మళై పిడిక్కాడ మనిదన్’ తొలి పాట విడుదల
[ 16-06-2024]
దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘మళై పిడిక్కాడ మనిదన్’. ఇందులో శరత్కుమార్, సత్యరాజ్, మురళీ శర్మ, మేఘా ఆకాశ్, తలైవాసల్ విజయ్, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు నటించారు. -
విదేశాల్లో ఉపయోగకర పథకాలు గుర్తించండి: వైరముత్తు
[ 16-06-2024]
విదేశాలకు వెళ్లే అధికారులు, మంత్రులు అక్కడి ప్రయోజనకరమైన పథకాలను గుర్తించి వాటిని స్వదేశంలో అమలు చేయాలంటూ ప్రముఖ సినీ గేయరచయిత, కవి వైరముత్తు సూచించారు.