మోరంచపల్లి.. గట్టెక్కే మార్గమిది!
వరద సృష్టించిన బీభత్సం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
విలయానికి ఈ ఇల్లే సాక్ష్యం
వరద సృష్టించిన బీభత్సం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. మోరంచ వాగుతో ఈ గ్రామానికి భవిష్యత్తులోనూ ముంపు పొంచి ఉంది. ఏటా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు..
ఆ రోజు లెక్క.. 1.44 లక్షల క్యూసెక్కులు
మోరంచపల్లి వద్ద నిర్మించిన రెండు వంతెనల ద్వారా 60 వేల క్యూసెక్కుల లోపు వరద మాత్రమే ప్రవహిస్తుంది. గత నెల 27వ తేదీన ఏకంగా 1.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిందని అంచనా. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో బయటకు వెళ్లలేక ప్రవాహం దిశ మార్చుకుని గ్రామంపైకి వచ్చింది.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
వంతెనలు చిన్నవి కావడంతోనే..
మోరంచపల్లి సమీపంలో వాగుపై నిర్మించిన వంతెన చిన్నగా ఉంటుంది. గతంలో ఉన్న రోడ్డుకంటే జాతీయ రహదారి 353సి ని ఆరడుగులపైగా ఎత్తు పెంచారు. దీంతో పైనుంచి వచ్చిన వరద.. వంతెన, రోడ్డు వైపు పోటెత్తి మోరంచపల్లి వైపు మరలుతుంది. వంతెన ఎత్తుగా, రోడ్డు కిందకు ఉన్నా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. గతంలో వంతెన కాకుండా రోడ్డ్యాం ఉండేది. ఎంత వరద వచ్చినా సాఫీగా వెళ్లేదని.. వంతెనను చిన్నగా నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్థులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే మరో చిన్న వంతెన కూడా ఉంది. గతంలోనే ఈ రెండింటిని కలిపి పెద్దగా నిర్మించి ఉంటే మోరంచపల్లికి వరద వచ్చేది కాదని వివరించారు.
ఇలా చేస్తే మేలు..
- ప్రస్తుతం ఉన్న రెండు వంతెనలు కలిపి ఒకటే పెద్దగా నిర్మించాలి. ప్రస్తుతం ఉన్నదాని కంటే ఎత్తుగా, పిల్లర్లు వేసి నిర్మాణం చేయాలి.
- వరద గ్రామంలోకి రాకుండా కరకట్టలు నిర్మించాలి.
- లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
- వరద అంచనా వేయడానికి గేజ్ లెవల్ను ఏర్పాటు చేయాలి.
వంతెన ఎత్తు పెంచాలి
మోరంచ వాగుపై ఉన్న వంతెన ఎత్తు తక్కువ ఉండటంతో గ్రామం వరద బారినపడింది. పైన ఉన్న గణపురం, రామప్ప చెరువులు మత్తళ్లు పోసినా.. అటువైపుగా ఉన్న చెరువులు ఎప్పుడు కట్టలు తెగినా మోరంచపల్లికి తీవ్ర నష్టం తప్పదు. ఈసారి 10 అడుగులకు పైగా ఎత్తులో వరద వచ్చింది. మోరంచవాగుపై నిర్మించిన వంతెన చిన్నగా ఉండటమే దీనికి కారణం. మోరంచవాగుపై ఉన్న వంతెనను ఎత్తు పెంచి, పెద్దగా నిర్మించడమో లేదా గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడమో సత్వరమే చేయాలి.
బండ లింగారెడ్డి
సురక్షిత ప్రాంతానికి తరలించాలి
మోరంచ వాగు ఉప్పొంగి మా ఊరు కొట్టుకుపోయింది. ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాగే జరిగింది. మోరంచపల్లిని సురక్షిత, ఎత్తైన ప్రాంతానికి తరలించాలి.
ములకనూరి రాజు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
మోరంచపల్లి వాసుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఆరోజు అధిక వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో ప్రమాదం సంభవించింది. ఆనాడు తెల్లవారుజామున 3:30 గంటలకు పోలీసులు పెట్రోలింగ్కు వెళ్లినప్పుడు ఎలాంటి వరద లేదు. 4 గంటలకు వరద ఆకస్మాత్తుగా గ్రామాన్ని ముంచెత్తింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోని చెంచు కాలనీ వాసులు రెండు పడక గదుల ఇళ్లు కావాలని అడిగారు. వారికి కేటాయిస్తాం. ఇంకా ఎవరైనా అక్కడి నుంచి వెళ్లాలనుకునే వారు మా దృష్టికి తీసుకురావొచ్చు. ఊరిని ఖాళీ చేయించడం అంటే ఇళ్లు ఒకటే ఇస్తే సరిపోదు. వారికి ఉపాధి, జీవించడానికి కావాల్సిన ఇతర అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల కేంద్ర బృందం గ్రామాన్ని, అక్కడి వాగుపై నిర్మించిన వంతెనను సందర్శించింది. బాధితులు వారి సమస్యలను బృందం దృష్టికి తీసుకెళ్లారు.
భవేశ్ మిశ్రా, కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మోరంచ వాగుపై నిర్మించిన వంతెన..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యను చూశారు.. పరిష్కారం చూపారు!
[ 14-06-2024]
గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. -
బతికించు..స్ఫూర్తిని పంచు!
[ 14-06-2024]
నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు -
ఇద్దరిని బలిగొన్న ఇసుక ట్రాక్టర్
[ 14-06-2024]
విలాసాగర్- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్ ఇద్దరిని బలిగొంది. -
బాలుర పరిశీలన గృహంలో అధికారుల మద్యం విందు!
[ 14-06-2024]
వరంగల్ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది -
టౌన్ ప్లానింగ్లో వసూళ్లపై కమిషనర్ ఆరా
[ 14-06-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల తీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులకు కొర్రీలు పెడుతూ.. డబ్బులు వసూళ్లు చేపట్టడాన్ని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తీవ్రంగా పరిగణించారు. -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
[ 14-06-2024]
నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు. -
ఓరుగల్లు రైల్వేస్టేషన్కు కొత్తందాలు
[ 14-06-2024]
వరంగల్ రైల్వేస్టేషన్లో ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. -
లక్నవరంలో పర్యాటకులకు భద్రత కరవు
[ 14-06-2024]
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది. -
అంగన్వాడీ.. పిల్లల భవిష్యత్తుకు వారధి
[ 14-06-2024]
బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది -
కొత్త రేషన్కార్డులపై చిగురిస్తున్న ఆశలు..!
[ 14-06-2024]
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్కార్డులు) జారీ చేస్తోంది. రేషన్కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు. -
వామ్మో గుడుంబా..!
[ 14-06-2024]
అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు -
బస్సుల కొరత.. ప్రయాణికుల వెత
[ 14-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
-
మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు: చంద్రబాబు
-
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు: వైరల్గా అధ్యక్షుడి వ్యవహారశైలి
-
వయనాడ్ను వదులుకోనున్న రాహుల్.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?
-
ఇక పాక్కు ఛాన్స్ లేనట్లే.. ‘ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్ట్స్ ఎడిషన్’: భారత మాజీ స్టార్ పేసర్