Amit Shah: నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదు: అమిత్ షా
నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న కేసీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
పటాన్చెరు: నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ఆయన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తే.. ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని, కానీ తెలంగాణలో మాత్రం పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని విమర్శించారు. పటాన్చెరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే.. భారాసకు వేసినట్లేనని అమిత్షా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో 12 మంది భారాసలో చేరిపోయారన్నారు. భారాస ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఓట్లు అడిగే హక్కు భారాస పార్టీకి లేదని అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే.. బీసీని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు. భారాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లకు అమిత్షా పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు