Revanth Reddy: రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: సీఎం రేవంత్రెడ్డి
అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
హైదరాబాద్: అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల కూడా దానికి అతీతం కాదని చాటిచెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్ల ఎన్డీయే పాలనపై గాంధీభవన్లో నిర్వహించిన ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘కార్పొరేట్ కంపెనీలకు ఎన్డీయే ప్రభుత్వం లొంగిపోయింది. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. కానీ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్ల అప్పులు చేసింది. పోర్టులు, ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. రూ.60 లక్షల కోట్ల ఆస్తులను రూ.6 లక్షల కోట్లకు తెగనమ్మారు. డబుల్ ఇంజిన్ పేరిట దేశాన్ని భాజపా దోచుకుంది.
స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు తదితర హామీలతో ప్రధాని మోదీ మోసగించారు. మూడు నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను బానిసలుగా మార్చేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని భాజపా అనుకుంటోంది. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోంది. దీని కోసం ఆ పార్టీకి 400 సీట్లు కావాలి. ఆర్ఎస్ఎస్ అజెండాను భాజపా అమలు చేసింది. అందుకే రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించింది’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: పోచారం
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని భారాస నేత, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. -
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: భాజపా ఎంపీ లక్ష్మణ్
గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. -
అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
ఆరు గ్యారంటీల్లో ఒకటే ఇచ్చి.. ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సీఎం రేవంత్రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. -
ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
ఏపీలో వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో వైకాపా ప్రచారం
వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. -
కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు. -
కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి
బ్యాలెట్లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. -
భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ
భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సంజయ్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధ్వజమెత్తారు. -
ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. -
పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ బస్సు యాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (3వ తేదీ) రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. -
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు.