Revanth Reddy: మామా అల్లుళ్లు.. నా సవాల్కు సిద్ధమా?: రేవంత్రెడ్డి
భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు.
బిజినపల్లి: భారాస హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కిందన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. గతంలో కరీంనగర్లో ఓటమి భయంతోనే.. కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు.
‘‘పాలమూరు ప్రజలు కేసీఆర్ను పార్లమెంట్కు పంపిస్తే.. వారికి అన్యాయం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. దొంగలకు సద్ది మూటలు మోసే నేతలు మన జిల్లాలో కొందరు ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్త. డి.కె.అరుణ, ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్తో నాకు వివాదం ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల భాజపా అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్కు రాజీనామా చేస్తే.. మేం అండగా నిలబడ్డాం. దొరల పెత్తనాన్ని సహించలేక రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్లోకి రావొచ్చు కదా. టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా ఆర్.ఎస్ ప్రవీణ్ను నియమించాలనుకున్నాం. కానీ, ఆయన తిరస్కరించారు. ఆయన ఐపీఎస్గా ఉండి ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం డీజీపీగా నియమించేది.
భారాసను 4 కోట్ల తెలంగాణ ప్రజలు గోతిలో పూడ్చి పెట్టారు. మోదీ ఒకరకంగా మోసం చేస్తే.. కేసీఆర్ మరో రకంగా మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ వ్యతిరేకంగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుంది. పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. బంగారు నేలగా మారుస్తాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? అని హరీశ్రావు అంటున్నారు. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ పూర్తి చేస్తే... కేసీఆర్, హరీశ్రావు భారాసను రద్దు చేస్తారా?’’ అని రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: పోచారం
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని భారాస నేత, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. -
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: భాజపా ఎంపీ లక్ష్మణ్
గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. -
అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
ఆరు గ్యారంటీల్లో ఒకటే ఇచ్చి.. ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సీఎం రేవంత్రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. -
ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
ఏపీలో వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో వైకాపా ప్రచారం
వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. -
కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు. -
కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి
బ్యాలెట్లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. -
భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ
భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సంజయ్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధ్వజమెత్తారు. -
ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. -
పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ బస్సు యాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (3వ తేదీ) రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. -
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు.