Revanth Reddy: 5 ఎంపీ స్థానాల్లో గెలిపించేందుకు మోదీతో కేసీఆర్ ఒప్పందం: రేవంత్
రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్తో పోరాడేంత బలం ఇచ్చింది.. మాల్కాజిగిరి ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి: రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్తో పోరాడేంత బలం ఇచ్చింది.. మాల్కాజిగిరి ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇక్కడ ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదువులు వచ్చాయన్నారు. మాల్కాజిగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ ‘జనజాతర’సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘మల్కాజిగిరి నియోజకవర్గాన్ని నేనెప్పుడూ మర్చిపోను. కొడంగల్లో ఓడిపోతే ఇక్కడ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారు. భారాస ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ అభివృద్ధి లేనందునే కోకాపేటలో పెరిగినట్లుగా ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగలేదు. ఇక్కడి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఏదైనా అడిగేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇప్పుడు లేరు. ఈ ఎన్నికల్లో అయినా మాల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి.
భాజపాతో కేసీఆర్ ఒప్పందం
భారాస అధినేత కేసీఆర్ భాజపాతో చీకటి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో భాజపాను గెలిపిస్తానని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట భాజపాకి భారాస మద్దతిస్తోంది. ఇన్నాళ్లు తనను గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఓడించారో మాల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై విచారణ జరపాలని అమిత్షాను ఈటల ఎందుకు కోరలేదు? కేటీఆర్ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మోదీ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు ఈటల సిద్ధమేనా?
తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు
పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ఆయన రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. అవి రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేసింది. సాగు చట్టాలు రద్దు చేసి.. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా చేసింది రైతులు, కాంగ్రెస్ నేతలే. ఓట్ల కోసం ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని భాజపా చూస్తోంది. దేవుడి పేరు మీద రాజకీయం చేసే వారిని పొలిమేర వరకు తరిమికొట్టాలి’’అని రేవంత్రెడ్డి అన్నారు.
సీఎం హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కలకలం
సీఎం రేవంత్రెడ్డి హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కలకలం రేపింది. శామీర్పేట వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద ఓ వ్యక్తి డ్రోన్ను ఎగరవేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రామంతాపూర్కు చెందిన గణేశ్రెడ్డిగా గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: పోచారం
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని భారాస నేత, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. -
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: భాజపా ఎంపీ లక్ష్మణ్
గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. -
అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
ఆరు గ్యారంటీల్లో ఒకటే ఇచ్చి.. ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సీఎం రేవంత్రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. -
ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
ఏపీలో వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో వైకాపా ప్రచారం
వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. -
కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు. -
కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి
బ్యాలెట్లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. -
భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ
భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సంజయ్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధ్వజమెత్తారు. -
ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. -
పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ బస్సు యాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (3వ తేదీ) రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. -
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్