CM Revanthreddy: అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా: రేవంత్రెడ్డి
అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
‘‘ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్రమంగానో.. దౌర్జన్యంగానో.. 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణ బద్దులై ఉన్నారు. ఇందులో భాగంగానే దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థల్ని ఉపయోగించుకొని ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భాజపాపై .. కాంగ్రెస్ స్పష్టమైన ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రశ్నలకు ఇప్పటి వరకు నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సమాధానం చెప్పలేదు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ మనువాద విధానాన్ని అమలు చేయాలని వారిద్దరూ ప్రయత్నిస్తున్నారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకురారు అనేది భాజపా కుట్ర. రిజర్వేషన్లు రద్దు చేస్తే.. వేర్వేరు కులాలు, వర్గాల ప్రస్తావన లేకుండా పోతుందనేది ఆ పార్టీ ఆలోచన. వచ్చే ఏడాదికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుంది. 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదే పదే కోరుతున్నారు. భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు.
భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు
‘‘రిజర్వేషన్ల రద్దుపై భాజపా, భారాస ఒకే విధానంతో ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. మల్కాజిగిరిలో భాజపాను గెలిపిస్తామని నిన్న భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆయనపై కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఈటలను కేటీఆర్ ఎందుకు విమర్శించడం లేదు? ఐదు నియోజకవర్గాల్లో భాజపాకు భారాస మద్దతు ఇస్తోందని నేను చెబుతూనే ఉన్నా. అది నిజమని నిన్న మల్లారెడ్డి మాటలతో స్పష్టమైంది. పదేళ్లపాటు కేసీఆర్ భూములు అమ్ముతుంటే ఈటల రాజేందర్ ఎప్పుడైనా మాట్లాడారా? నేను రుణమాఫీ చేస్తాను అనగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడతున్నారు. దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్కు ఓటేయాలి’’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష డిపాజిట్ చేస్తాం: రాహుల్ గాంధీ
ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. -
‘ఇండియా కూటమి’ విజయం తథ్యం: ఉత్తమ్కుమార్ రెడ్డి
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. -
మోదీతో పోరాటం రాహుల్గాంధీ వల్ల కాదు: కేటీఆర్
భాజపా ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని యత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
అబద్ధాలతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం: అమిత్షా
‘రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. -
కాంగ్రెస్కు అదానీ, అంబానీ డబ్బు పంపుతుంటే ఈడీ ఏం చేస్తోంది?: కేటీఆర్
నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. -
కంటోన్మెంట్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా
ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారం స్టీల్ ఎక్కడ?: జైరాం రమేశ్
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. -
రిజర్వేషన్లపై ప్రజలు వాస్తవాలను గుర్తించారు
భాజపాపై కాంగ్రెస్, భారాస చేస్తున్న వ్యతిరేక ప్రచారంలో వాస్తవాలను గుర్తించి ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. -
భాజపాకు ఓటేస్తే గొంతు కోసుకున్నట్లే..
రిజర్వేషన్లను తొలగించేందుకే భాజపా 400 సీట్లు కోరుతోందని, ఆ పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్లవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. -
ఐదు నెలల్లో పరిస్థితులు తారుమారు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. -
దక్షిణాదిలోనూ భాజపా ప్రభంజనం
ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభంజనం సృష్టిస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. -
రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పిన మోదీ: మంత్రి పొన్నం
వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
కరీంనగర్ సభలో మోదీ కోడ్ ఉల్లంఘించారు
కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
క్రిశాంక్ తప్పు చేసినట్లు తేలితే నేనే జైలుకెళ్తా: కేటీఆర్
భారాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని, ఆయన తప్పు చేసినట్లు తేలితే తానే జైలుకెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
రాష్ట్రంలో 11 వరకు అల్కా లాంబ ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితురాలు అల్కా లాంబ ఈ నెల 11 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
నేడు, ఎల్లుండి అమిత్షా ప్రచారం
భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం భువనగిరి ఎన్నికల బహిరంగసభలో పాల్గొననున్నారు. -
కేసీఆర్కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు!
‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులట!
‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు. -
కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపం.. మోదీ
‘స్వాతంత్య్రం వచ్చాక చాలా మంది ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు. కానీ ఒక్కరు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న దాఖలాల్లేవు.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకున్నారు’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
‘‘బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న జనాభా లెక్కల విధానాన్ని మోదీ నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. -
12 సీట్లు భారాసకు ఇస్తే ప్రభుత్వాన్ని శాసిస్తాం
అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టి ప్రజలు ఆగమయ్యారని, మరోసారి మోసపోకుండా లోక్సభ ఎన్నికల్లో భారాసకు 10, 12 ఎంపీ సీట్లు గెలవడానికి ఓటర్లు అండగా నిలిస్తే, మళ్లీ ప్రభుత్వాన్ని శాసించే సత్తా కేసీఆర్కు వస్తుందని మాజీ మంత్రి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన