CM Revanthreddy: కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం పదేళ్లపాటు కేసీఆర్ కబంధహస్తాల్లో చిక్కుకుందని.. డిసెంబర్లో కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చిందని, ఆ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు.
‘‘మహిళలకు కట్టెల పొయ్యి కష్టాలు పోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వం దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చింది. వాటి ధరను మోదీ రూ.1,200కు పెంచడంతో మహిళలకు మళ్లీ కట్టెల పొయ్యి కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. పదేళ్లపాటు పేదల వాటి గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4.50 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నాం.
ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ యువత రాష్ట్రం కోసం పోరాటం చేశారు. పేదల ఉద్యోగాల గురించి కేసీఆర్ పదేళ్ల పాటు పట్టించుకోలేదు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాగానే 25 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ, అమిత్షా తలుచుకున్నారు. అదే భాజపా విధానం. ఆనాడు బ్రిటీషర్లు సూరత్ చేరుకొని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కూడా సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారు. భాజపా అంటే బ్రిటీష్ జనతా పార్టీ. బ్రిటీష్ వాళ్ల లాగే.. భాజపా వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా భావిస్తోంది. తద్వారా దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈసారి 400 సీట్లు గెలవాలి.. రాజ్యాంగం మార్చాలని మోదీ కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, డీఆర్డీవో వంటి ఎన్నో సంస్థల్ని ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన సంస్థల్ని మోదీ, అమిత్షా కలిసి అంబానీ, అదానీలకు అమ్ముతున్నారు. ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను అమ్మేశారు’’ అని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడి పార్టీ లోక్సభ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి నేనే వెళ్లమన్నా: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి వెళ్లమన్నది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. -
ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆయన కోడలు, ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత పేర్కొన్నారు. -
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. -
ఓటమి భయంతోనే మోదీ వ్యాఖ్యలు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా సగానికిపైగా సీట్లలో ఓడిపోతోందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
రిజర్వేషన్ల ఎత్తివేతకు భాజపా యత్నం.. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
‘‘భాజపా రిజర్వేషన్లు ఎత్తివేయాలని, మళ్లీ మనుస్మృతిని తేవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతలు మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. -
ఆరు గ్యారంటీలు అమలైన గ్రామాల్లో ఓట్లడగం: హరీశ్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. -
దక్షిణభారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది
దేశాన్ని అఖండ భారతావనిగా ఉంచాలని ప్రధాని మోదీ చూస్తోంటే.. పాకిస్థానీయుల తరహాలో కాంగ్రెస్ ఆలోచిస్తోందని, దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించేందుకు కుట్రలు పన్నుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. -
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణన్ తెలిపారు. -
భారాస చిరునామా గల్లంతే
ఈ లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో భారాస చిరునామా గల్లంతవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
మోదీ రాజ్యంలో అత్యాచారాలు పెరిగాయి
మోదీ రాజ్యంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లలో మోదీ చెప్పిన 150 నినాదాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు. -
మోదీ అడుగుజాడల్లో రేవంత్
ఆరెస్సెస్ మనిషి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
భాజపా నేతలకు దమ్ముంటే లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. -
మత విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందేందుకు భాజపా యత్నం
మత విద్వేషాలు రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ అద్నాన్ అర్జాఫ్ విమర్శించారు. -
ఎన్నికల స్వాధీనాల విలువ రూ.269 కోట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.269.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఎన్నికల రోజు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైడ్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు.. హక్కు మాత్రమే కాదు, బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ పేర్కొన్నారు. -
హామీలు అమలు చేయని భాజపాను ఓడించాలి
రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయని భాజపాను ఎన్నికల్లో ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు పిలుపునిచ్చారు. -
మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది
‘‘యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు... రైతులకు కనీస మద్దతు ధర అంటూ భాజపా ఊదరగొట్టేది. వాటికి మోదీ గ్యారంటీ అనేది. -
మిగిలింది 5 రోజులు.. కాంగ్రెస్ ప్రచారం ఉద్ధృతం
లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో కాంగ్రెస్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఈనెల 9న అగ్రనేత రాహుల్గాంధీ, 10న ప్రియాంకాగాంధీ ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. -
ఎంతో సానుకూలం.. అప్రమత్తత అవసరం
లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఉన్న ఎంతో సానుకూల వాతావరణం నేపథ్యంలో కీలక సమయంలో అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. -
మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం
‘‘కాంగ్రెస్, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్తో భారాస ప్రజలను దోచుకున్నాయి. -
నా అరెస్టుకూ మోదీ కుట్ర
ప్రధాని మోదీ వికృతరూపానికి దిల్లీ మద్యం కేసు నిదర్శనమని.. అసలు అది తప్పుడు కేసని, ఆయన సృష్టించిన భయంకరమైన కుట్ర అని భారాస అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు.
తాజా వార్తలు
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..