icon icon icon
icon icon icon

పార్టీ నిర్మాణంపై గుత్తా సలహాలు తీసుకుంటాం

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆరంభ రోజుల్లో తాను పుట్టలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 21 Apr 2024 04:11 IST

ఆయన మాటలకు రాజకీయ ప్రాధాన్యం లేదు
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆరంభ రోజుల్లో తాను పుట్టలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరు నెలలు ప్రయత్నించినా కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆయన సీనియర్‌ అని, తలపండిన నాయకుడన్నారు. ఏ పార్టీ నిర్మాణం ఎలా ఉంది అనే విషయం గుత్తాకి బాగా తెలుసని.. అందుకే ఆయన సలహాలు తీసుకుంటామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి అంశంపై చర్చిస్తామని తెలిపారు. ఆయన మాటలకు రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. ఎంపీ అభ్యర్థి పోటీ అంశంపై ఇప్పుడు తానేమీ మాట్లాడనని.. దానిపై స్పష్టత రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img