దేశాభివృద్ధే భాజపా లక్ష్యం
70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను.. గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు, పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు
మ్యానిఫెస్టోలో మరెన్నో: కిషన్రెడ్డి
సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల
ఈనాడు, హైదరాబాద్: 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను.. గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే భాజపా లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మోదీ గ్యారంటీతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరించడంతో పాటు దేశ రక్షణ, అంతర్గత భద్రతకు భాజపా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు, దేశమంతటా శాసనసభలు, పార్లమెంటుకు ఒకేసారి (జమిలి) ఎన్నికలను సాకారం చేయనున్నామన్నారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టో (సంకల్పపత్రం) తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ప్రకాశ్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలను కిషన్రెడ్డి వివరిస్తూ.. దేశంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, సొంత ఇల్లు.. మోదీ ఇచ్చే గ్యారంటీలని చెప్పారు. పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, తాగునీరు, ఇళ్లకు సౌర విద్యుత్ పథకం అమలు సహా అనేక కార్యక్రమాలను భాజపా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేపర్ లీక్లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పశుగణాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల ఆత్మగౌరవంతో పాటు ఉపాధికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్ ఆసుపత్రులు, 315 వైద్య కళాశాలలు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. రైళ్ల ఆధునికీకరణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రపంచంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని వివరించారు.
కాంగ్రెస్ది విభజిత భారత్
-లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్రం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా సంకల్ప పత్రాన్ని నరేంద్ర మోదీ గ్యారంటీగా ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతూ విభజిత భారత్గా మార్చాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ముడిపెట్టిన పత్రం మాత్రమే అని అన్నారు. యూపీఏ పాలన అంతా కుంభకోణాలమయమన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా భాజపా సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ