నాలుగో రోజు 121 నామినేషన్లు
లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో నాలుగో రోజైన సోమవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి.
కాంగ్రెస్, భారాస, భాజపా నుంచి 9 మంది దాఖలు
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో నాలుగో రోజైన సోమవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి. పలుచోట్ల కాంగ్రెస్, భారాస, భాజపాల నుంచి 9మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గ ఎన్నికల అధికారులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత(మల్కాజిగిరి), డాక్టర్ కడియం కావ్య(వరంగల్), వెలిచాల రాజేందర్రావు(కరీంనగర్) నామినేషన్లు వేశారు. భారాస నుంచి డాక్టర్ ఎం.సుధీర్కుమార్(వరంగల్), క్యామ మల్లేశ్(భువనగరి), గడ్డం శ్రీనివాస్యాదవ్(హైదరాబాద్) నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. భాజపా నుంచి అజ్మీరా సీతారాంనాయక్(మహబూబాబాద్), బీబీ పాటిల్(జహీరాబాద్), కొండా విశ్వేశ్వర్రెడ్డి(చేవెళ్ల) దాఖలు చేశారు.
అధికంగా కరీంనగర్లో..
అత్యధికంగా సోమవారం ఒక్క రోజు కరీంనగర్ నియోజకవర్గంలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లిలో 12, మల్కాజిగిరి, భువనగిరిలో 11 చొప్పున, వరంగల్ 10, సికింద్రాబాద్ తొమ్మిది, జహీరాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండలలో ఏడు చొప్పున, చేవెళ్ల, హైదరాబాద్ ఆరు వంతున, నిజామాబాద్లో అయిదు, మహబూబాబాద్లో నాలుగు, నాగర్కర్నూల్లో మూడు, మహబూబ్నగర్లో రెండు, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు గతంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వారు సోమవారం రెండో, మూడో సెట్లను అందజేశారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. చిత్రంలో వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య
భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ కె.జెండగేకు నామినేషన్ పత్రాన్ని అందజేస్తున్న భారాస అభ్యర్థి క్యామ మల్లేశ్. చిత్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
సంగారెడ్డిలో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న జహీరాబాద్ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్. పక్కన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, భాజపా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ సంగారెడ్డి జిల్లా నాయకుడు బస్వరాజు పాటిల్
మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కరీంనగర్లో ఆర్వో పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు. చిత్రంలో చొప్పదండి, వేములవాడ, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ
వరంగల్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలిస్తున్న భారాస ఎంపీ అభ్యర్థి మరపల్లి సుధీర్కుమార్. చిత్రంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్
మహబూబాబాద్లో ఆర్వో అద్వైత్కుమార్సింగ్కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్. చిత్రంలో పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రంగాకిరణ్, రవికుమార్, పార్టీ నేత బాలరాజు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.