నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ
స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన వైఖరి మన విదేశాంగ విధానంపై ప్రభావం చూపి.. దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు.
పటేల్ మాటలను పట్టించుకోని నాటి ప్రధాని
ఈసారి వేసే ఓటు విశ్వాసానికి, గ్యారంటీకి..
విదేశాంగశాఖ మంత్రి జై శంకర్
ఈనాడు, హైదరాబాద్: స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన వైఖరి మన విదేశాంగ విధానంపై ప్రభావం చూపి.. దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. దూరదృష్టి లేకపోవడం, ఉదాసీనంగా వ్యవహరించడంతో చైనాతో స్నేహపూర్వక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపిందన్నారు. పాకిస్థాన్తోనూ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే సరిహద్దుల వెంట సుదీర్ఘకాలం ఉద్రిక్తతలు కొనసాగాయన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘భారతదేశ విదేశాంగ విధానం- విభేదాల నుంచి విశ్వాసం’ అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు సహా పలువురు పాల్గొన్నారు. చైనాతో సంబంధాలపై 1950లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ సూచనను నెహ్రూ పట్టించుకోని ఫలితంగానే 1962లో భారత్పై ఆ దేశం దురాక్రమణకు పాల్పడిందని జైశంకర్ అన్నారు. పాకిస్థాన్తో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ఆక్రమిత కశ్మీర్ను ఎందుకు విస్మరించాయని ప్రశ్నించారు. గత పదేళ్లలో భాజపా ప్రభుత్వం నాటి తప్పులను చాలావరకు సరిదిద్దిందని తెలిపారు.
యూపీఏ హయాంలో ఎందుకు వెనుకడుగు?
‘‘2008లో ముంబయిపై ఉగ్రదాడుల అనంతరం.. నాటి యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన చర్యలకు వెనుకాడింది. ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు దీని గురించి రాస్తూ.. ‘మేం దీనిపై కూలంకషంగా చర్చించాం. పాకిస్థాన్పై దాడి చేయకపోవడం కంటే.. దాడి చేయడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఏమీ చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాం’ అని పేర్కొన్నారు. ఇక దీని భావం ఏమిటో మీరే అర్థం చేసుకోండి’’ అని జైశంకర్ వివరించారు. అప్పట్లో ఇలాంటి రక్షణాత్మక ధోరణి వల్ల ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఆమోదించినట్లయ్యిందని అన్నారు. అలాంటి సంశయాత్మక వైఖరి నేడు లేదని.. ఇప్పుడున్నదంతా ఆత్మవిశ్వాసమేనని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, సరిహద్దులు దాటి పాకిస్థాన్లోని బాలాకోట్లో దాడులు చేయడం ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమనే హెచ్చరికలు పంపామని జైశంకర్ ఉదహరించారు.
పాతికేళ్ల భవిష్యత్తు కోసం ఓటేయాలి
స్వదేశీ అవసరాల కోసం కొవిడ్ వ్యాక్సిన్ను సొంతంగా తయారు చేసుకోవడమే కాకుండా.. ఇతర దేశాల అవసరాలనూ తీర్చిన దౌత్యనీతి మనదని జైశంకర్ తెలిపారు. ఆయుధాల తయారీలో స్వయంసమృద్ధి సాధించి.. బ్రహ్మోస్ క్షిపణులు సహా అనేక ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించే స్థితికి భారత్ చేరుకోవడంలో పదేళ్ల భాజపా ప్రభుత్వ కృషి ఉందన్నారు. 2014కు ముందు కూడా ఇవే వనరులు, సదుపాయాలు, శాస్త్రవేత్తలు ఉన్నా.. ప్రభుత్వ ఆలోచన ధోరణిలో మార్పులే దేశ గమనాన్ని మార్చాయన్నారు. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటి అనేక విధానాలతో సాధిస్తున్న ఫలితాలు ప్రపంచ దేశాల్లో మన ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు. మాల్దీవులు చైనాకు చేరువై, భారత్కు దూరం కావడంపై స్పందిస్తూ.. దేశాల మధ్య సంబంధాలను ఒకటి రెండు అంశాలే కాకుండా అవసరాలు, వైద్యం, ఆహార పదార్థాలు సహా అనేక విషయాలు ప్రభావితం చేస్తాయన్నారు. విశ్వాసం, గ్యారంటీతో పదేళ్లలో వేసుకున్న బలమైన పునాదులపై ఆధారపడి.. సాధికారతతో 25 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణానికి ఈసారి ఓటు వేస్తున్నామని గుర్తించాలన్నారు. మే 13 పోలింగ్ రోజున అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కిషన్రెడ్డి కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.