మళ్లీ మోసపోవద్దు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వాటిని నమ్మి మళ్లీ మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.
రేవంత్రెడ్డి కపట హామీలను నమ్మొద్దు
మతం పేరుతో ఓట్లడిగే భాజపాను విశ్వసించొద్దు
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఈనాడు, వరంగల్ - రాజేంద్రనగర్, అలంపూర్, ఉండవల్లి, శివనగర్, బాలసముద్రం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వాటిని నమ్మి మళ్లీ మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెబుదామని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నాయకులు చెప్పుకోవడానికి ఏమీలేక మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, అలాంటి పార్టీని నమ్మొద్దన్నారు. మంగళవారం చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా రాజేంద్రనగర్ అంబేడ్కర్ చౌరస్తాలో సభ ఏర్పాటు చేశారు. బుద్వేల్ చౌరస్తా నుంచి అక్కడి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వరంగల్లో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల భారాస విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్హాల్లో భారాస అలంపూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు. రైతుల రుణమాఫీకి రూ.45 వేల కోట్ల నిధులు ఆగస్టు 15లోగా ఏవిధంగా తెస్తారు? ఆయన హామీలకు ప్రజలు రెండోసారి మోసపోవద్దు. నాడు కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో రూ.లక్ష ఇస్తే ఆ డబ్బుకు మరో తులం బంగారం కలిపి రేవంత్రెడ్డి ఇస్తామని చెప్పారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? రెండోసారి మోసం చేసిన వ్యక్తిని నమ్మితే తప్పు ప్రజలదే అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భాజపాతో లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే కేంద్రంలో రాహుల్ గాంధీ అసలు లిక్కర్ స్కాం జరగలేదంటే ఇక్కడ రేవంత్రెడ్డి జరిగిందని, కవితను జైల్లో వేయడం సరైన పని అని అంటారు.
పదేళ్లలో మోదీ ఏంచేశారు?
ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఏంచేశారని ఓటేయాలి?పదేళ్లలో ప్రజల ముక్కుపిండి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసి అంబానీ, అదానీలకు పంచారు. రాష్ట్రంలో భాజపాను ఓడించే సత్తా భారాసకే ఉంది. తెలంగాణలో భారాస 12 లోక్సభ సీట్లు గెలిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించగలరు.
అమ్మ లాంటి పార్టీని మోసం చేశారు
భారాసలో పదవులు అనుభవించిన మహేందర్రెడ్డి, రంజిత్రెడ్డి మనపై పోటీకి దిగుతున్నారు. అమ్మలాంటి పార్టీని మోసం చేశారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత భారాస కార్యకర్తలపై ఉంది. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని పదవులు ఇచ్చారు. ఆయన కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చాక నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్లో చేరడం దారుణం’’ అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్, చేవెళ్ల, నాగర్కర్నూల్ భారాస అభ్యర్థులు సుధీర్కుమార్, కాసాని జ్ఞానేశ్వర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్లను గెలిపించాలని ఆయన కోరారు. రాజేంద్రనగర్ ర్యాలీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్రెడ్డి పాల్గొన్నారు. అలంపూర్ సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా భారాస నేతలు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్ హనుమకొండ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ క్రికెట్ ట్రోఫీని విజేతలకు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్లు రద్దు కావు
కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. -
పాతవి లేవు.. కొత్త పథకాలు రావు
‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. -
భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు
ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. -
ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం
‘‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా 32,331 మంది ఓటు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్బ్యాలెట్ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రిజర్వేషన్లు విస్తరించిందే భాజపా: లక్ష్మణ్
‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
26 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ భాజపాలోకి..
లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పాత, కొత్త నాయకుల సమన్వయంపై దృష్టి పెట్టాలి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సూచించింది. -
దిల్లీ పోలీసుల పేరుతో వేధింపులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?
తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే
‘కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి. -
రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు కోల్పోతాం
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్
భారాస అధినేత కేసీఆర్ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
జిల్లాల రద్దు కాదు.. కమిషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఇండియా’ కూటమికే బీసీల మద్దతు: జాజుల
కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
సీఎం పదవికి రేవంత్ అనర్హుడు: డీకే అరుణ
సీఎం పదవికి రేవంత్రెడ్డి అనర్హుడని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను వెంటనే అరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. -
తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతోంది: కేసీఆర్
పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ