మోదీతోనే దేశాభివృద్ధి
దేశభవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
భువనగిరి, న్యూస్టుడే: దేశభవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ను పురస్కరించుకుని పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వినాయకచౌరస్తాలో జరిగిన రోడ్షోలో జైశంకర్ ప్రసగించారు. మంచి ఎంపీ వస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందంటూ బూర నర్సయ్యగౌడ్ను గెలిపించాలని కోరారు. పదేళ్లకు పూర్వం దేశం పరిస్థితి ఏంటి.. మోదీ అధికార పగ్గాలు చేపట్టాక ఎలా ఉందనే విషయం ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తూ.. పేదల ఆకలిని తీర్చడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటోందన్నారు. ప్రధాని మోదీ జి-20 దేశాల సదస్సులో ఆయా దేశాల ప్రతినిధులకు పోచంపల్లి పట్టుచీరలు, వస్త్రాలను బహుమతులుగా ఇచ్చి.. వాటికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేదన్నారు. ప్రజలు తమ ఓట్లతో కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించారు. శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతో సీఎం రేవంత్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. భువనగిరి కోటపై కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వీరంతా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే జెండగేకు డాక్టర్ నర్సయ్యగౌడ్ నామినేషన్ పత్రాలను అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: భాజపా ఎంపీ లక్ష్మణ్
గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. -
అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
ఆరు గ్యారంటీల్లో ఒకటే ఇచ్చి.. ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సీఎం రేవంత్రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. -
ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
ఏపీలో వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో వైకాపా ప్రచారం
వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. -
కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు. -
కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి
బ్యాలెట్లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. -
భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ
భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సంజయ్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధ్వజమెత్తారు. -
ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. -
పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ బస్సు యాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (3వ తేదీ) రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. -
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు. -
దిల్లీ పోలీసులు X హైదరాబాద్ పోలీసులు
ఉదయాన్నే గాంధీభవన్కు దిల్లీ పోలీసులు.. మరోవైపు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసుల అదుపులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి గురువారం హైడ్రామా నడిచింది.
తాజా వార్తలు
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?