పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే.. భారాసను రద్దు చేస్తారా?
జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
కేసీఆర్, హరీశ్రావులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్
రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన
రాబోయే వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడి
ఈనాడు-మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మద్దూరు, కోస్గి-న్యూస్టుడే: జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తారా అని భారాస నేత హరీశ్రావు అడుగుతున్నారని, పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భారాసను రద్దు చేసుకుంటారా అని కేసీఆర్, హరీశ్రావులకు ఆయన సవాల్ చేశారు. రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులిస్తూ ఇబ్బందులకు గురిచేయవద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో, నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో సీఎం ప్రసంగించారు.
మేం వచ్చేనాటికి రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్
2014లో భారాస(అప్పటి తెరాస) ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయింది. 2018లో మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. నేను రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను. అయితే మేము అధికారం చేపట్టేనాటికి ఖజానా దివాలా తీసి.. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిసెంబరు 7న సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్న రోజున రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.26 వేల కోట్ల వడ్డీ చెల్లించాం. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు లెక్కలు చూపిస్తాను. ఎన్నికల కోడ్ అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యమైంది. సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన నన్ను ఎలా దించేయాలి, కాళ్లలో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలి అని ఆలోచించడం కేసీఆర్కు తగదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదు అమలు చేశాం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రీయింబర్స్మెంటు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి వంటి హామీలను అమలు చేయలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించారా? ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? ఇవేమీ చేయకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రేవంత్రెడ్డి దిగిపోవాలని అనడం ఎంతవరకు సమంజసం? ప్రజలను కలవకుండా, వారి కష్టాలు తెలుసుకోకుండా కేసీఆర్ పదేళ్లు ఎలా పాలించారో ప్రజలకు తెలుసు. నేను నాలుగు నెలల్లో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. పేదలకు ఇళ్లు నిర్మించలేదు. రైతులకు ఆదాయం రెట్టింపు చేయలేదు. చెప్పుకోవడానికి ఏమీలేక మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాలమూరుకు కేసీఆర్ అన్యాయం..
2014లో రాష్ట్రం ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంత్రి పదవులు, నిధులు, నియామకాలు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంలో కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్కే పరిమితమయ్యారు. పదేళ్లుగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తొక్కిపెట్టారు. 2009లో ఆయనను ఎంపీగా గెలిపిస్తే పాలమూరుకు చేసిందేమీ లేదు. 2009లో కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినప్పుడు తన ఇల్లు అమ్మి అయినా అలంపూర్లో ముంపు బాధితులకు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఎందుకు కట్టించలేదు?
నాకు ప్రత్యర్థులు, శత్రువులు లేరు..
పాలమూరు జిల్లాలో నాకు ప్రత్యర్థులు, శత్రువులు ఎవరూ లేరు. పాలమూరు బిడ్డనైన నాకు సీఎంగా అవకాశం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. భాజపా నేత డీకే అరుణతో నాకేమైనా ఆస్తి తగాదాలు.. గట్టు పంచాయతీలున్నాయా? పాలమూరు జిల్లాకు శత్రువులైన వారితో ఆమె జతకట్టారు. సీఎంగా రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలని ఆలోచించా. కానీ, కాళ్లలో కట్టెలు పెట్టి లాగడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? కృష్ణా-వికారాబాద్ రైల్వేలైన్ ఎందుకు పూర్తి చేయలేదు? గతంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ అప్పట్లో కోస్గిలో రెండు వరుసల రోడ్లు ఎందుకు వేయలేదు? మన్నెగూడ, గుల్బర్గా రోడ్డును ఎందుకు బాగుచేయలేదు? గత శాసనసభ ఎన్నికల్లో గద్వాలలో భాజపా అభ్యర్థికి 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటప్పుడు ఆమెతో నాకు పోటీ ఏంటి?
వర్గీకరణకు ప్రవీణ్కుమార్ వ్యతిరేకమా?
ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ఆయనకు అండగా ఉన్నా. ఆయన రాజీనామా చేస్తే కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. కేసీఆర్ను గద్దె దించుతానని ఆ రోజు ప్రవీణ్ అన్నారు. ఆరు నెలల్లోనే కేసీఆర్లో ఏం మారింది? ఆయన బీఎస్పీలో కొనసాగినా బాగుండేది. లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చి కేసీఆర్పై కొట్లాడాల్సింది. శాసనసభలో నాతోపాటు సంపత్కుమార్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెడితే అప్పటి భారాస ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని బయటకు పంపించింది. వర్గీకరణపై అఖిలపక్ష పార్టీలను దిల్లీకి తీసుకెళ్తానని చెప్పి పదేళ్లు సాగదీసింది. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మమ్మల్ని సభలో నుంచి బయటకు పడేసిన కేసీఆర్ పక్కన చేరిన ప్రవీణ్కుమార్ వర్గీకరణకు వ్యతిరేకమా? ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ పక్కన చేరి తెలంగాణ సమాజం ఎదుట దోషిగా నిలబడతారా? ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఈ రోజు డీజీపీ స్థాయిలో ఆయన ఉండేవారు. ఆయనను టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా నియమించాలని అనుకున్నాం.
పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తా
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా మహబూబ్నగర్ నుంచి వలసలు ఆగలేదు. కరవు పోలేదు. పొలాల్లో నీరు పారలేదు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. ఎన్ని వేల కోట్లయినా నిధులిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటా. మీ బిడ్డగా పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేస్తాను’’ అని రేవంత్రెడ్డి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు మల్లు రవి, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.రాజేశ్రెడ్డి, మనోహర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి, తెజస నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను సీఎంనయ్యాను. వారి రుణం తీర్చుకోకపోతే ఈ జీవితం దండగని తెలుసు. హరీశ్రావులా, కేసీఆర్లా అవాస్తవాలు చెప్పేవాడిని కాదు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారు. నేను మాత్రం పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాబోయే వరి పంటకు రూ.500 బోనస్ కూడా ఇస్తాను.
సీఎం రేవంత్రెడ్డి
బావాజీని దర్శించుకున్న రేవంత్రెడ్డి
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీగురులోకమసంద్ను(బావాజీని) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, ఆలయ కమిటీ ఛైర్మన్ గోపాల్, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్టుడే, మద్దూరు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్