నాడు హామీ ఇచ్చినా దక్కని ఎంపీ టికెట్లు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేక లోక్సభ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్లు పోటీ పడ్డారు.
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేక లోక్సభ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్లు పోటీ పడ్డారు. గతంలో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే పొన్నంకు కాంగ్రెస్ ఈ స్థానాన్ని కేటాయించింది. ఆ సమయంలో కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రవీణ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మరికొందరు పట్టుబట్టినట్లు తెలిసింది. ఆయనతో పాటు వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న తదితరులు ఈ సీటు కోసం పోటీపడ్డారు. చివరకు ప్రవీణ్రెడ్డి, రాజేందర్రావు పోటీలో నిలవగా, ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేయడంతో కరీంనగర్కు వెలిచాల వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ కోసం నాడు ఆర్.దామోదర్రెడ్డి, పటోళ్ల రమేశ్రెడ్డి పోటీ పడ్డారు. అధిష్ఠానం దామోదర్రెడ్డికి ఇచ్చింది. ఆ సమయంలో రమేశ్రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఎంపీ టికెట్ గురించి చర్చేలేదు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డికి కేటాయించారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారికి లోక్సభ అభ్యర్థిత్వాలు దక్కలేదు. ఇలా హామీ ఇచ్చిన వారిలో సురేష్షెట్కార్కు జహీరాబాద్ లోక్సభ స్థానం దక్కింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. -
వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
ప్రపంచం ముందు పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టాం: కిషన్రెడ్డి
కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తు చేశారు. -
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా
‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. -
కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు
‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. -
భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు: మంత్రి ఉత్తమ్
భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు?
భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు. -
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
మాదిగలకు సీటివ్వని కాంగ్రెస్ను ఓడించాలి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వ్యతిరేక మార్పు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్నారు
‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్సభ స్థానాలు గెలిపించాలంటున్నారు. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్
రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
నేడు ఐదు బహిరంగ సభలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు. -
శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్రెడ్డి, బండి సంజయ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ లేఖలో ప్రశ్నించారు. -
వాస్తవాలపై చర్చిద్దాం రండి
యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కోరారు. -
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ