icon icon icon
icon icon icon

భాజపాపై నేడు కాంగ్రెస్‌ ఛార్జిషీట్‌ విడుదల

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం భాజపాపై కాంగ్రెస్‌ పార్టీ ఛార్జిషీట్‌ విడుదల చేయనుంది.

Published : 25 Apr 2024 02:52 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం భాజపాపై కాంగ్రెస్‌ పార్టీ ఛార్జిషీట్‌ విడుదల చేయనుంది. గాంధీభవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుతోపాటు కీలక నాయకులు పాల్గొంటారు. పదేళ్ల భాజపా పాలనలో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఛార్జిషీట్‌ రూపంలో ప్రజలకు వివరించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాసపై ఇదే విధంగా ఛార్జిషీట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img