పేదల కష్టార్జితంపై కాంగ్రెస్ కన్ను
‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు.
దాన్ని ఆ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది
హైదరాబాద్లో ‘పతంగ్’ దారం తెంచాలని నిర్ణయించుకున్న ప్రజలు
కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్
ఈనాడు, హైదరాబాద్; చార్మినార్, న్యూస్టుడే: ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్గాంధీ దేశంలో మొహబత్ దుకాణాలు తెరిచామని చెబుతూ.. ఆ దుకాణాల్లో విద్వేష సామాన్లు(నఫ్రత్) పంచుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుల్జార్హౌజ్ వద్ద ర్యాలీలోనూ మాట్లాడారు. ‘‘దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే దేశంలో అణు వ్యవస్థను తీసేయాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆలోచన. రాహుల్గాంధీ, ఒవైసీ ఇద్దరు కూడా ఔరంగజేబు స్కూలు నుంచి వచ్చారు. రాహుల్గాంధీ ఒవైసీకి బీ టీమ్. హైదరాబాద్లో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఒవైసీ ప్రభావం ఎక్కడా లేదు. భాజపా అభ్యర్థి మాధవీలత పేరే అంతటా వినిపిస్తోంది. పతంగ్(ఎంఐఎం ఎన్నికల గుర్తు దారం తెంచాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అమేఠీలో రాహుల్గాంధీని ఓ మహిళ ఓడించారు. హైదరాబాద్లో ఒవైసీని మాధవీలత ఓడించబోతున్నారు. వయనాడ్లో పీఎఫ్ఐ సహకారం తీసుకుని ఎన్నికల్లో గెలవాలని రాహుల్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్.. కార్పొరేటర్ కూతురుకే న్యాయం చేయకపోతే దేశంలో ఎవరికి న్యాయం చేస్తుంది’’ అని ఠాకూర్ నిలదీశారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత నిర్దోషి అయితే ఆమెకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకోవడంతో పాటు దిల్లీలో దోచుకోవడానికి వెళ్లి స్కామ్లో చిక్కుకున్నారని అన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మాధవీలత అన్నారు. చార్మినార్ నుంచి ర్యాలీగా వెళ్లి హైదరాబాద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కాంగ్రెస్వే మతతత్వ రాజకీయాలు
-లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీనే మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్.. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని అది ఓటు బ్యాంకు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే వారిని ఓడించాలని ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలను రాజకీయం చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎస్సీ జాబితాలో రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోందన్నారు. భారాస పని అయిపోయిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైంది: కేసీఆర్
రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు