కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది
కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కరెంటు, సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజంటేషన్
కేసీఆర్ అసమర్థత, అవగాహనలేమి, కమీషన్ల కక్కుర్తి, మితిమీరిన జోక్యం వల్లనే తెలంగాణకు మేడిగడ్డ గుదిబండలా మారింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీరు నిల్వ ఉంటే ప్రమాదకరం అని చెప్పగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నీరు కిందకు వదిలేశారు.
-మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను కాపాడలేని అసమర్థుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం ఇక్కడ సెంట్రల్కోర్టు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాగునీటి రంగం, ధాన్యం కొనుగోళ్లపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ‘‘కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోయింది. దానిని ఆయనే ఇప్పుడు రిపేర్ చేస్తానని చెప్పడం జోక్లా ఉంది. మేడిగడ్డ పూర్తికావాలంటే రూ.లక్షా 50 వేల కోట్లు అవుతుంది. కనీస జ్ఞానం లేకుండా ఎంత ఖర్చయినా నీరు తెస్తున్నామని ఆయన అంటున్నారు. 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీరిచ్చామని కేసీఆర్ దిగజారిపోయి పచ్చి అబద్ధాలు చెపుతున్నారు. కేవలం లక్షా 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలే అని అబద్ధాలు చెపుతున్నారు. పైసల కక్కుర్తి వల్లనే దానిని రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. రీడిజైన్తో కేసీఆర్ కుటుంబ సభ్యులు సాగించిన దోపిడీ వల్ల ఆ రుణభారం తెలంగాణ ప్రజలపై పడబోతోంది. వారి అవినీతి సామ్రాజ్యంలో కాంట్రాక్టర్లతో కలిసి ఏం చేశారో ఇప్పుడు ప్రజల ముందుంది.
డిపాజిట్లు కోల్పోనున్న భారాస
విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై భారాస నేతలు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాల్లో భారాస డిపాజిట్లు కోల్పోతుంది. ఈ ఎన్నికల తరవాత భారాస మనుగడ ప్రశ్నార్థకమే. 29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ప్రతి గింజా మద్దతు ధరకు కొంటామని రైతుకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. వారం రోజుల్లో మేడిగడ్డపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుంది. అందులో ఏం చేయమని ఉంటే అదే చేస్తాం. కేసీఆర్ మైండ్ ఆగమాగమై కరెంటు కోతలున్నట్లు ఊహించుకుంటున్నారు’’ అని ఉత్తమ్ అన్నారు.
ప్రగతిభవన్ ప్యాలెస్ చూసి ఆశ్చర్యపోయా
-కోమటిరెడ్డి
‘‘ఇటీవల నేను వెళ్లి ప్రగతిభవన్ను చూశా. అంత ప్యాలెస్ చూసి ఆశ్చర్యపోయా. అందుకే.. అంత పెద్ద భవంతిలో ఉండి.. చిన్న ఇంట్లోకి వెళ్లడంతో కేసీఆర్ మతిపోయినట్లు మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. సుశీ అనే పేరుతో ఉన్న కంపెనీ తన సోదరుడు రాజగోపాల్రెడ్డిదని, దానితో తనకు సంబంధం లేదని, తాను ఏ వ్యాపారంలో లేనని చెప్పారు. ఈ కంపెనీ పేరుతో తాను పనులు చేశానని కేసీఆర్ అనడం సరికాదన్నారు. మద్యం కుంభకోణంతో మాజీ సీఎం బిడ్డ కవిత.. దేశ ప్రజల ముందు తెలంగాణ పరువు తీసేశారని అన్నారు. ఏపీలో జగన్ గెలుస్తారని కేసీఆర్ అంటున్నారని, అక్కడ ఆయన గెలిస్తే మళ్లీ ఏమైనా పైసలు ఇస్తారని చూస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా అది ఇల్లీగల్. పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. భారాస పాలనలో పోలీస్ అధికారులైన ప్రభాకర్రావు, ప్రణీత్రావులాంటి వారికి చాటుగా మా (రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి) ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంటుంది? ట్యాపింగ్తో నాకేం సంబంధం అని కేసీఆర్ అంటున్నారు... ఆయన చెప్పకపోతే ప్రభాకర్రావు ఎందుకు ఆ పని చేస్తారు?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి