కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది
కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కరెంటు, సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజంటేషన్
కేసీఆర్ అసమర్థత, అవగాహనలేమి, కమీషన్ల కక్కుర్తి, మితిమీరిన జోక్యం వల్లనే తెలంగాణకు మేడిగడ్డ గుదిబండలా మారింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీరు నిల్వ ఉంటే ప్రమాదకరం అని చెప్పగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నీరు కిందకు వదిలేశారు.
-మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను కాపాడలేని అసమర్థుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం ఇక్కడ సెంట్రల్కోర్టు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాగునీటి రంగం, ధాన్యం కొనుగోళ్లపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ‘‘కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోయింది. దానిని ఆయనే ఇప్పుడు రిపేర్ చేస్తానని చెప్పడం జోక్లా ఉంది. మేడిగడ్డ పూర్తికావాలంటే రూ.లక్షా 50 వేల కోట్లు అవుతుంది. కనీస జ్ఞానం లేకుండా ఎంత ఖర్చయినా నీరు తెస్తున్నామని ఆయన అంటున్నారు. 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీరిచ్చామని కేసీఆర్ దిగజారిపోయి పచ్చి అబద్ధాలు చెపుతున్నారు. కేవలం లక్షా 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలే అని అబద్ధాలు చెపుతున్నారు. పైసల కక్కుర్తి వల్లనే దానిని రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. రీడిజైన్తో కేసీఆర్ కుటుంబ సభ్యులు సాగించిన దోపిడీ వల్ల ఆ రుణభారం తెలంగాణ ప్రజలపై పడబోతోంది. వారి అవినీతి సామ్రాజ్యంలో కాంట్రాక్టర్లతో కలిసి ఏం చేశారో ఇప్పుడు ప్రజల ముందుంది.
డిపాజిట్లు కోల్పోనున్న భారాస
విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై భారాస నేతలు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాల్లో భారాస డిపాజిట్లు కోల్పోతుంది. ఈ ఎన్నికల తరవాత భారాస మనుగడ ప్రశ్నార్థకమే. 29 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ప్రతి గింజా మద్దతు ధరకు కొంటామని రైతుకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం. వారం రోజుల్లో మేడిగడ్డపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుంది. అందులో ఏం చేయమని ఉంటే అదే చేస్తాం. కేసీఆర్ మైండ్ ఆగమాగమై కరెంటు కోతలున్నట్లు ఊహించుకుంటున్నారు’’ అని ఉత్తమ్ అన్నారు.
ప్రగతిభవన్ ప్యాలెస్ చూసి ఆశ్చర్యపోయా
-కోమటిరెడ్డి
‘‘ఇటీవల నేను వెళ్లి ప్రగతిభవన్ను చూశా. అంత ప్యాలెస్ చూసి ఆశ్చర్యపోయా. అందుకే.. అంత పెద్ద భవంతిలో ఉండి.. చిన్న ఇంట్లోకి వెళ్లడంతో కేసీఆర్ మతిపోయినట్లు మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. సుశీ అనే పేరుతో ఉన్న కంపెనీ తన సోదరుడు రాజగోపాల్రెడ్డిదని, దానితో తనకు సంబంధం లేదని, తాను ఏ వ్యాపారంలో లేనని చెప్పారు. ఈ కంపెనీ పేరుతో తాను పనులు చేశానని కేసీఆర్ అనడం సరికాదన్నారు. మద్యం కుంభకోణంతో మాజీ సీఎం బిడ్డ కవిత.. దేశ ప్రజల ముందు తెలంగాణ పరువు తీసేశారని అన్నారు. ఏపీలో జగన్ గెలుస్తారని కేసీఆర్ అంటున్నారని, అక్కడ ఆయన గెలిస్తే మళ్లీ ఏమైనా పైసలు ఇస్తారని చూస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా అది ఇల్లీగల్. పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. భారాస పాలనలో పోలీస్ అధికారులైన ప్రభాకర్రావు, ప్రణీత్రావులాంటి వారికి చాటుగా మా (రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి) ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంటుంది? ట్యాపింగ్తో నాకేం సంబంధం అని కేసీఆర్ అంటున్నారు... ఆయన చెప్పకపోతే ప్రభాకర్రావు ఎందుకు ఆ పని చేస్తారు?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. -
ప్రధానిపై తప్పుడు ఆరోపణలు
ప్రధాని మోదీపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
మోదీని గెలిపించాలి: తమిళిసై
దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. -
రాహుల్ నామినేషన్లో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం రాయ్బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు.
తాజా వార్తలు
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?