జైళ్లకు కేసీఆర్ భయపడడు.. మళ్లీ మన రాజ్యమే.. ఎవరూ ఆపలేరు
‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
తెలంగాణకు శత్రువే కాంగ్రెస్ భారాస గెలిస్తేనే ప్రజలకు న్యాయం
ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి
బస్సుయాత్రలో కేసీఆర్ తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ప్రచారం
తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. స్వరాష్ట్రంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా? ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజలకు పంచాయితీ పడింది. ఇది పరిష్కారం కావాలంటే కేసీఆరే పంచాయితీ పెద్దగా ఉండాలి’’
భారాస అధినేత కేసీఆర్
ఈనాడు, నల్గొండ: ‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ మన రాజ్యమే వస్తుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. బంగారు తెలంగాణగా చేసేవరకు విశ్రమించేది లేదు’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అసమర్థత వల్ల సాగర్ ప్రాజెక్టుకు దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ‘పోరుబాట బస్సుయాత్ర’ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసిన రోడ్షోలు, కూడలి సభల్లో మాట్లాడారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తానని, ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని.. కేసీఆర్ జైళ్లకు భయపడబోడని స్పష్టం చేశారు. అలా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ బతుకే నీళ్లమీద పోరాటం
‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం నీళ్లు, నిధులు, కరెంటు కోసం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశాను. తెలంగాణ వచ్చే వరకు సాగర్ కెనాల్ కింద నీళ్లు ఇవ్వలేదు. ఆనాటి నుంచి తెలంగాణ బతుకే నీళ్ల మీద పోరాటం. పదేళ్ల భారాస పాలనలో 18 పంటలకు నీళ్లిచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ప్రస్తుతం దిగాలు పడ్డాడు. నీటిపారుదల మంత్రి ఇక్కడే ఉన్నా.. చేతగాక నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతుల పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే ప్రథమం. కృష్ణాలో నీళ్లు లేకున్నా.. మూసీ నుంచి ఉదయసముద్రం మీదుగా పెద్ద దేవులపల్లి చెరువులో నీళ్లు నింపి తద్వారా ఎడమ కాల్వకు నీళ్లిచ్చే ప్రయత్నం మేం చేశాం. రెండు దఫాలుగా భారాస ప్రభుత్వం రైతులకు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేసింది. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారు. రైతుబంధును దగా చేశారు. కరెంటు మాయమైంది. మిగులు కరెంటు ఉన్నా ఎందుకు సరిగ్గా ఇవ్వడం లేదు? కాంగ్రెస్ ఎన్నికల హామీగా కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది.? మహాలక్ష్ములు, నిరుద్యోగులను మోసం చేశారు. కేసీఆర్ వైదొలిగాక నాలుగైదు నెలలకే మంచినీళ్లు మాయమయ్యాయి. ఇరవై రోజులైనా రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు? ప్రధాని మోదీ ధాన్యం కొనను అంటే నేను, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దిల్లీలో ధర్నా చేశాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపించాం.
కాళేశ్వరంతో 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చాం. సూర్యాపేటను జిల్లా కేంద్రం చేశాం. వైద్యకళాశాలతో పాటు సద్దుల చెరువును అందంగా మార్చాం. కోదాడ, సూర్యాపేటల్లో ఎడారుల్లా మారిన చెరువులను కాళేశ్వరం జలాలతో నింపాం. సూర్యాపేట ప్రజలకు 30 ఏళ్ల పాటు మూసీ మురికినీళ్లు తాగించింది కాంగ్రెస్. ప్రజలు స్వచ్ఛమైన కృష్ణా జలాలను తాగేలా భారాస మిషన్ భగీరథ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని కేసీఆర్ తెలిపారు.\
ఊరూరా ఘనస్వాగతం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బుధవారం మధ్యాహ్నం మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్కు ఊరూరా ఘనస్వాగతం లభించింది. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి క్రాస్రోడ్, నల్గొండ బైపాస్, తిప్పర్తి మీదుగా సాయంత్రానికి మిర్యాలగూడ చేరుకున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లి సమీపంలోని ఒక హోటల్లో కొద్దిసేపు ఆగి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో కేసీఆర్ కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మిర్యాలగూడ రోడ్షోలో ప్రసంగించాక.. కేసీఆర్ సూర్యాపేటకు బయల్దేరారు. దారిలో తిప్పర్తి మండలం సిలారుమియాగూడెం వద్ద ప్రజల అభ్యర్థన మేరకు కాసేపు ఆగి ప్రసంగించారు. నకిరేకల్, కేతేపల్లిలో ప్రజలు కేసీఆర్ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సూర్యాపేటకు చేరుకొని పట్టణంలో భారీ ర్యాలీతో రోడ్షోలో ప్రసంగించి ఇక్కడే బస చేశారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, నల్గొండ లోక్సభ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్రెడ్డి, భగత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో జేజేలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ యాత్ర చేపట్టిన బస్సు బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు జేజేలు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లికి కేసీఆర్ పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. తెలంగాణ భవన్ వెనుక గేటు (జగన్నాథస్వామి ఆలయం వైపు) నుంచి బస్సు మిర్యాలగూడకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, కంటోన్మెంట్ అసెంబ్లీ భారాస అభ్యర్థి నివేదిత, మాజీ ఎంపీ సంతోష్కుమార్ జోగినపల్లి తదితరులు పాల్గొన్నారు.
60, 70 టీఎంసీలు సముద్రంపాలు
-కేసీఆర్
‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే బ్రహ్మాండం బద్దలైనట్లు మాట్లాడుతున్నారు. దీన్ని భూతద్దంలో చూపి 60, 70 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. టెయిల్పాండ్ నుంచి ఏపీ 5 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే ఉత్తమ్కుమార్రెడ్డి ఎక్కడ పడుకున్నారు? ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా మోసం చేస్తోంది. 1100 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో తిండి సరిగా లేక 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చనిపోయారు. ఈ విషయంపై ప్రభుత్వానికి పట్టింపులేదు. భారాస బలంగా ఉంటేనే ప్రభుత్వం మెడలు వంచి.. హామీలను అమలు చేసేలా కొట్లాడగలం. లోక్సభ ఎన్నికల్లో భారాసను 10 నుంచి 12 స్థానాల్లో గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో భారాసకు 50 వేల మెజార్టీ రావాలి. ఇక్కడి ఓట్లతోనే కంచర్ల కృష్ణారెడ్డి ఎంపీగా గెలవాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. -
ప్రధానిపై తప్పుడు ఆరోపణలు
ప్రధాని మోదీపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
మోదీని గెలిపించాలి: తమిళిసై
దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. -
రాహుల్ నామినేషన్లో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం రాయ్బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. -
దిల్లీ పోలీసులతో అరెస్ట్కు యత్నం
దిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో ఉంటారని, వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అరెస్ట్ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. -
అమిత్షాపై కేసు నమోదు
ఎన్నికల నిబంధనలను అతిక్రమించి పిల్లలను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు మరో నలుగురు భాజపా నేతలపై మొఘల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు. -
10 నుంచి 12 సీట్లిస్తే మళ్లీ కేసీఆర్ శకం
రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు మాకిస్తే మళ్లీ కేసీఆర్ శకం మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?