జైళ్లకు కేసీఆర్ భయపడడు.. మళ్లీ మన రాజ్యమే.. ఎవరూ ఆపలేరు
‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
తెలంగాణకు శత్రువే కాంగ్రెస్ భారాస గెలిస్తేనే ప్రజలకు న్యాయం
ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి
బస్సుయాత్రలో కేసీఆర్ తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ప్రచారం
తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. స్వరాష్ట్రంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా? ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజలకు పంచాయితీ పడింది. ఇది పరిష్కారం కావాలంటే కేసీఆరే పంచాయితీ పెద్దగా ఉండాలి’’
భారాస అధినేత కేసీఆర్
ఈనాడు, నల్గొండ: ‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ మన రాజ్యమే వస్తుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. బంగారు తెలంగాణగా చేసేవరకు విశ్రమించేది లేదు’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అసమర్థత వల్ల సాగర్ ప్రాజెక్టుకు దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ‘పోరుబాట బస్సుయాత్ర’ను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసిన రోడ్షోలు, కూడలి సభల్లో మాట్లాడారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తానని, ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని.. కేసీఆర్ జైళ్లకు భయపడబోడని స్పష్టం చేశారు. అలా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ బతుకే నీళ్లమీద పోరాటం
‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం నీళ్లు, నిధులు, కరెంటు కోసం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశాను. తెలంగాణ వచ్చే వరకు సాగర్ కెనాల్ కింద నీళ్లు ఇవ్వలేదు. ఆనాటి నుంచి తెలంగాణ బతుకే నీళ్ల మీద పోరాటం. పదేళ్ల భారాస పాలనలో 18 పంటలకు నీళ్లిచ్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ప్రస్తుతం దిగాలు పడ్డాడు. నీటిపారుదల మంత్రి ఇక్కడే ఉన్నా.. చేతగాక నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతుల పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే ప్రథమం. కృష్ణాలో నీళ్లు లేకున్నా.. మూసీ నుంచి ఉదయసముద్రం మీదుగా పెద్ద దేవులపల్లి చెరువులో నీళ్లు నింపి తద్వారా ఎడమ కాల్వకు నీళ్లిచ్చే ప్రయత్నం మేం చేశాం. రెండు దఫాలుగా భారాస ప్రభుత్వం రైతులకు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేసింది. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారు. రైతుబంధును దగా చేశారు. కరెంటు మాయమైంది. మిగులు కరెంటు ఉన్నా ఎందుకు సరిగ్గా ఇవ్వడం లేదు? కాంగ్రెస్ ఎన్నికల హామీగా కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది.? మహాలక్ష్ములు, నిరుద్యోగులను మోసం చేశారు. కేసీఆర్ వైదొలిగాక నాలుగైదు నెలలకే మంచినీళ్లు మాయమయ్యాయి. ఇరవై రోజులైనా రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు? ప్రధాని మోదీ ధాన్యం కొనను అంటే నేను, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దిల్లీలో ధర్నా చేశాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపించాం.
కాళేశ్వరంతో 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చాం. సూర్యాపేటను జిల్లా కేంద్రం చేశాం. వైద్యకళాశాలతో పాటు సద్దుల చెరువును అందంగా మార్చాం. కోదాడ, సూర్యాపేటల్లో ఎడారుల్లా మారిన చెరువులను కాళేశ్వరం జలాలతో నింపాం. సూర్యాపేట ప్రజలకు 30 ఏళ్ల పాటు మూసీ మురికినీళ్లు తాగించింది కాంగ్రెస్. ప్రజలు స్వచ్ఛమైన కృష్ణా జలాలను తాగేలా భారాస మిషన్ భగీరథ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని కేసీఆర్ తెలిపారు.\
ఊరూరా ఘనస్వాగతం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బుధవారం మధ్యాహ్నం మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్కు ఊరూరా ఘనస్వాగతం లభించింది. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి క్రాస్రోడ్, నల్గొండ బైపాస్, తిప్పర్తి మీదుగా సాయంత్రానికి మిర్యాలగూడ చేరుకున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లి సమీపంలోని ఒక హోటల్లో కొద్దిసేపు ఆగి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో కేసీఆర్ కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మిర్యాలగూడ రోడ్షోలో ప్రసంగించాక.. కేసీఆర్ సూర్యాపేటకు బయల్దేరారు. దారిలో తిప్పర్తి మండలం సిలారుమియాగూడెం వద్ద ప్రజల అభ్యర్థన మేరకు కాసేపు ఆగి ప్రసంగించారు. నకిరేకల్, కేతేపల్లిలో ప్రజలు కేసీఆర్ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సూర్యాపేటకు చేరుకొని పట్టణంలో భారీ ర్యాలీతో రోడ్షోలో ప్రసంగించి ఇక్కడే బస చేశారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, నల్గొండ లోక్సభ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్రెడ్డి, భగత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో జేజేలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ యాత్ర చేపట్టిన బస్సు బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు జేజేలు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లికి కేసీఆర్ పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. తెలంగాణ భవన్ వెనుక గేటు (జగన్నాథస్వామి ఆలయం వైపు) నుంచి బస్సు మిర్యాలగూడకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, కంటోన్మెంట్ అసెంబ్లీ భారాస అభ్యర్థి నివేదిత, మాజీ ఎంపీ సంతోష్కుమార్ జోగినపల్లి తదితరులు పాల్గొన్నారు.
60, 70 టీఎంసీలు సముద్రంపాలు
-కేసీఆర్
‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే బ్రహ్మాండం బద్దలైనట్లు మాట్లాడుతున్నారు. దీన్ని భూతద్దంలో చూపి 60, 70 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. టెయిల్పాండ్ నుంచి ఏపీ 5 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే ఉత్తమ్కుమార్రెడ్డి ఎక్కడ పడుకున్నారు? ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా మోసం చేస్తోంది. 1100 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో తిండి సరిగా లేక 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చనిపోయారు. ఈ విషయంపై ప్రభుత్వానికి పట్టింపులేదు. భారాస బలంగా ఉంటేనే ప్రభుత్వం మెడలు వంచి.. హామీలను అమలు చేసేలా కొట్లాడగలం. లోక్సభ ఎన్నికల్లో భారాసను 10 నుంచి 12 స్థానాల్లో గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో భారాసకు 50 వేల మెజార్టీ రావాలి. ఇక్కడి ఓట్లతోనే కంచర్ల కృష్ణారెడ్డి ఎంపీగా గెలవాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి