పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్
కాంగ్రెస్ అధిష్ఠానం పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది.
రఘురాంరెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు
కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు
హైదరాబాద్కు మహ్మద్ వలీవుల్లా సమీర్
ఈనాడు- హైదరాబాద్, ఈటీవీ- ఖమ్మం
కాంగ్రెస్ అధిష్ఠానం పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది. కరీంనగర్ టికెట్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్రావుకు దక్కింది. హైదరాబాద్ సీటుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలీవుల్లా సమీర్ పేరును ఖరారు చేశారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఎంపికపై ముఖ్యనాయకుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. నామినేషన్ల దాఖలుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఉండగా.. బుధవారం రాత్రి వారి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయమై గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరిగాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీలను బెంగళూరుకు పిలిపించి మాట్లాడారు. మొదట భట్టి, పొంగులేటితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. సోమవారం రాత్రికే అభ్యర్థుల జాబితా వెలువడవచ్చని భావించినా.. తేల్చుకోలేక మళ్లీ పెండింగ్లో పెట్టారు. అధికారికంగా ప్రకటించక ముందే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్రావు నామినేషన్ దాఖలు చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంగళవారం రఘురాంరెడ్డి తరఫున స్థానిక నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించినందున గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
ఖమ్మం సీటుకు తీవ్ర పోటీ
ఖమ్మం లోక్సభ స్థానానికి మొదటి నుంచీ ముఖ్యనాయకుల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి జటిలమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లనూ కాంగ్రెస్ గెల్చుకున్నా.. లోక్సభ అభ్యర్థి ఎంపికలో తీవ్ర జాప్యం తప్పలేదు. భట్టి విక్రమార్క తన భార్య నందినికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్కు టికెట్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీల్లో పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత.. మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరించలేదు. కానీ తాను కాంగ్రెస్లో చేరినప్పుడు ఎంపీ టికెట్ గురించి హామీ ఇచ్చారని పొంగులేటి పట్టుబట్టడంతో.. ఆయన సోదరుడికి బదులు రఘురాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి రావడం.. దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగింది. భట్టి విక్రమార్క మరో అభ్యర్థి పేరును కూడా సూచించారు. వీటన్నిటిపై దీపా దాస్మున్షీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరుల వద్ద కూడా పంచాయితీ జరిగింది. చివరకు రఘురాంరెడ్డి పేరును ప్రకటించారు.
ఖమ్మంతో కరీంనగర్కు ముడి..
అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీకి టికెట్ ఇవ్వలేకపోవడంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి అవకాశం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎంపీ టికెట్ కోసం ఈయనతోపాటు వెలిచాల రాజేందర్రావు తదితరులు పోటీపడ్డారు. ఖమ్మం స్థానాన్ని మండవ వెంకటేశ్వరరావుకు ఇచ్చి.. కరీంనగర్ నుంచి ప్రవీణ్రెడ్డికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. కానీ ఖమ్మం అభ్యర్థి మారడంతో కరీంనగర్ నుంచి రాజేందర్రావుకు అవకాశం దక్కింది.
తండ్రి వారసుడిగా కాంగ్రెస్లో రఘురాంరెడ్డి
కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గంలోని కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం. సురేందర్రెడ్డి గతంలో మహబూబాబాద్, వరంగల్ లోక్సభ స్థానాల నుంచి ఎంపీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రఘురాంరెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వరంగల్ లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్గా, హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకులు. రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో వివాహమైంది.
మూడు తరాలుగా రాజకీయాల్లో వెలిచాల కుటుంబం
వెలిచాల రాజేందర్రావు తండ్రి, తాత రాజకీయాల్లో పనిచేశారు. ఈయన తాత వెలిచాల కేశవరావు స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్లో కీలక నేతగా ఉండేవారు. రాజేందర్రావు తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్రావు సింగిల్ విండో ఛైర్మన్గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2004 వరకు తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో చొప్పదండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి.. 30 వేల ఓట్లు పొందారు. 2007 నుంచి 2009 వరకు ప్రజారాజ్యం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఆ పార్టీ తరఫున కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. పోచంపాడు కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమెటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న రాజేందర్రావు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్లో చేరారు.
ఆరేళ్లుగా కాంగ్రెస్కు సమీర్ సేవలు
హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టోలీచౌకీలో నివసిస్తున్న సమీర్ స్థిరాస్తి వ్యాపారిగా, ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. మీడియా రంగంపై ఆసక్తితో ఇండియన్ న్యూస్ నెట్వర్క్ (ఐఎన్ఎన్)ను స్థాపించారు. అనంతరం ఐఎన్ఎన్ ఛానెల్ను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఛైర్మన్గా నియమితులయ్యారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. -
ప్రధానిపై తప్పుడు ఆరోపణలు
ప్రధాని మోదీపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
మోదీని గెలిపించాలి: తమిళిసై
దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. -
రాహుల్ నామినేషన్లో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం రాయ్బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. -
దిల్లీ పోలీసులతో అరెస్ట్కు యత్నం
దిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో ఉంటారని, వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అరెస్ట్ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
తాజా వార్తలు
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం