కాళేశ్వరంపై చర్చిద్దాం.. రండి
‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం.
ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్
పంద్రాగస్టులోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి
హరీశ్రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి
మతచిచ్చు రేపడమే భాజపా లక్ష్యం
వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్షోల్లో సీఎం
కేసీఆర్, హరీశ్రావులకు అధికార మత్తు ఇంకా దిగిందో లేదో తెలియదు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. ప్రభుత్వం మారాక అసెంబ్లీకి రాలేదు. సమస్యలపై మాట్లాడలేదు. ప్రభుత్వానికి సలహాలూ ఇవ్వలేదు. తన మెదడును రంగరించి, రక్తాన్ని ధారపోసి కాళేశ్వరం కట్టారట. అలా కట్టారో లేదో.. ఇలా కూలిపోయింది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ కట్టించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, శ్రీరామసాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల, దేవాదుల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. మీరు కట్టినవి, మేం కట్టినవి.. ఒక్కసారి చూసొద్దాం రండి.
సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు-వరంగల్, హైదరాబాద్, మడికొండ, రెజిమెంటల్ బజార్ - న్యూస్టుడే: ‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం. మీరు కట్టిన అద్భుతమేందో, అది తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో వివరించండి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారాస అధినేత కేసీఆర్కు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర సభలో, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ‘‘రామప్ప శివుడు, సమ్మక్క సారలమ్మ, భద్రకాళీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. పంద్రాగస్టులోపు నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తా. అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తానని హరీశ్ సవాల్ విసిరారు. ఆయన తన జేబులో రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి.
మోదీ, కేసీఆర్లు.. నాణేనికి బొమ్మాబొరుసులు
మోదీ, కేసీఆర్ నాణేనికి బొమ్మాబొరుసు లాంటివారు. ఇద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు. రాష్ట్రానికి సోనియా గాంధీ ఇచ్చిన విభజన హామీలేవీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించక ఈ ప్రాంతానికి మోదీ ద్రోహం చేశారు. కాజీపేటలో పెట్టాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్కు తరలించుకుపోయారు. ట్రిపుల్ఐటీ, ఐటీఐఆర్ ఇవ్వలేదు. నాడు మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలివ్వాలి. పార్లమెంటులో నేనడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని సమాధానం చెప్పారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు బుద్ధిచెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మోదీకి బుద్ధిచెప్పాలి. ఈ ఎన్నికల్లో భారాసకు ఎక్కడా డిపాజిట్ కూడా రాదు.
మతం పేరుతో భాజపా విద్వేషాలు
భాజపాకు మతపిచ్చి పట్టుకుంది. దేశంలో అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవిస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ల ఆస్తులు వీళ్లకిస్తుందని, ఒకరి రిజర్వేషన్లు తగ్గించి ఇంకొకరికి ఇస్తుందని దుష్ప్రచారం చేస్తూ మతచిచ్చు రేపడమే భాజపా నాయకుల లక్ష్యం. అందరూ కలిసిఉండటం మోదీకి ఇష్టం లేదు. గ్రామాల్లో పీర్ల పండగను ముస్లిం సోదరులతో కలిసి జరుపుకొంటాం. క్రిస్మస్ నాడు చర్చిలకు వెళ్తాం. ఇందుకు విరుద్ధంగా భాజపా నాయకులు ఓట్ల కోసం గోడలపైకి శ్రీరాముడిని తెచ్చారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వాళ్లే చేశారా? మనం చేయలేదా? మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాను ఓడించాలి.
కిషన్రెడ్డి ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా?
తెలంగాణ ఏర్పడకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్కు ఐటీ, ఫార్మా పరిశ్రమలు, అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఓఆర్ఆర్, మెట్రోరైలు తీసుకొచ్చారు. రాజధానికి కృష్ణా, గోదావరి జలాలను తెచ్చారు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యం. మూడేళ్ల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్లలో వరదలొచ్చినప్పుడు అప్పట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్నవారిని గుజరాత్లో ఏర్పాటు చేయండంటూ కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తే అడ్డుకోలేదు. రైల్వేలను ప్రైవేటుపరం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? రైతుల భూములు ఆక్రమించిన అరూరి రమేశ్కి భాజపా వరంగల్ టికెటిచ్చింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ టికెట్ అడగలేదు. నిజాయతీ ఉన్నవారు ప్రభుత్వం వెంట ఉండాలని.. ఆయన వద్దకు నేనే పార్టీ పెద్దలను పంపించి టికెట్ ఇస్తామని ప్రతిపాదించా. వరంగల్ను అన్నిరకాలుగా అభివృధ్ధి చేస్తా. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తా.
సికింద్రాబాద్లో ఏ పార్టీ వారు గెలిస్తే వారిదే కేంద్రంలో అధికారం
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీవారు గెలిస్తే.. ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్ల విషయంలో ఇదే జరిగింది. దానం నాగేందర్ను గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. దానంను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే పార్టీ అగ్రనేతలను ఒప్పించి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించేందుకు కృషి చేస్తాను. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం భాజపాతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే పద్మారావుగౌడ్కు టికెట్ కేటాయించారు. పీజీఆర్, దానం నాగేందర్లా పద్మారావు మంచివారు. కానీ, కేసీఆర్ను నమ్ముకుంటే నట్టేట మునుగుతారు. పద్మారావు నామినేషన్ వేసేందుకు వెళ్తే.. కేసీఆర్ ఫామ్హౌస్లో, కేటీఆర్ జూబ్లీహిల్స్ అతిథిగృహంలో సేదతీరారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న భారాస చేసిందేమీ లేదు. పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. నగరంలో నీటి కొరత ఏర్పడకుండా ఏవైనా కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చారా?’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
ఓరుగల్లు జనజాతర సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నేడు మోదీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వరంగల్ భారాస నేతలపై విచారణ జరిపి.. కటకటాల్లోకి పంపాలన్నారు. మంత్రి శ్రీధర్బాబు ప్రసంగిస్తూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లోని హామీలు అమలు చేయడంతో కేసీఆర్కు భయమేస్తోందన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య(వరంగల్), దానం నాగేందర్(సికింద్రాబాద్), వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌధరి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, యశస్విని, నాగరాజు, నేతలు అంజన్కుమార్ యాదవ్, అజారుద్దీన్, రోహిణ్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, దానం నాగేందర్లు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ సమర్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. -
ప్రధానిపై తప్పుడు ఆరోపణలు
ప్రధాని మోదీపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
మోదీని గెలిపించాలి: తమిళిసై
దేశ ప్రజల మెప్పు పొందిన నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించాలని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. -
రాహుల్ నామినేషన్లో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం రాయ్బరేలీ వెళ్లారు. అగ్రనేత రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు.
తాజా వార్తలు
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM