అభ్యర్థుల్లో అత్యధికులు సంపన్నులే
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. ఆయా అఫిడవిట్ల ప్రకారం వివరాలివి.
5 కిలోల బంగారం..
అభ్యర్థి: కొంపెల్ల మాధవీలత
నియోజకవర్గం: హైదరాబాద్
పార్టీ: భాజపా
కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40 కోట్లు. ఆమె పేరిట విరించి లిమిటెడ్, వివో బయోటెక్లలో రూ.8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్లలో రూ.16.27 కోట్ల షేర్లు ఉన్నాయి. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట విరించి లిమిటెడ్, వివో బయోటెక్లలో రూ.56.19 కోట్ల విలువైన షేర్లు, అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్, శ్రీశ్రీ రిసార్ట్స్లో రూ.29.56 కోట్ల షేర్లు ఉన్నాయి. ఆమె పేరిట 3.9 కిలోల బంగారం, భర్త పేరిట 1.11 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.165.47 కోట్లు. సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవు. షేక్పేట, కీసర, సికింద్రాబాద్; ఏపీలోని మొగల్తూరులలో వ్యవసాయేతర స్థలాలు, హిమాయత్నగర్లో వాణిజ్య స్థలం, మల్కాజిగిరి, ఈస్ట్ మారేడ్పల్లి, షేక్పేటల్లో నివాసగృహాలు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లు. రూ.27.03 కోట్ల అప్పులున్నాయి. ఆమెపై ఒక క్రిమినల్ కేసు ఉంది.
రూ.155.90 కోట్ల ఆస్తులు..
అభ్యర్థి: నామా నాగేశ్వరరావు
నియోజకవర్గం: ఖమ్మం
పార్టీ: భారాస
కుటుంబ ఆస్తుల విలువ రూ.155.90 కోట్లు. మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ గ్రానైట్స్, టీఎన్డీకే ఎక్స్ప్రెస్ వే, మధుకాన్ మెగామాల్, ఎన్ఎన్ఎఆర్ ఇన్ఫ్రా, మధుకాన్ ల్యాండ్ డెవలపర్స్, నామా ఇన్వెస్ట్మెంట్స్, నామా ప్రాపర్టీస్లలో షేర్లు ఉన్నాయి. మూడు కార్లు ఉన్నాయి. ఆయన సతీమణి పేరిట 2.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.72.03 కోట్లు. ఏపీ, తెలంగాణల్లో కలిపి ఆ కుటుంబానికి దాదాపు 108 ఎకరాల వ్యవసాయ భూములు; గోవా, ఖమ్మంలలో వ్యవసాయేతర స్థలాలు, హైదరాబాద్ జూబ్లీహిల్స్, దిల్లీల్లో వాణిజ్య భవనాలు; జూబ్లీహిల్స్, ఖమ్మంలలో పలు నివాసగృహాలతో కలిపి రూ.83.87 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఆయనపై రెండు క్రిమినల్ కేసులున్నాయి.
రూ.63.58 కోట్ల ఆస్తులు.. సొంతంగా కారు లేదు..
అభ్యర్థి: వెంకట్రామిరెడ్డి
నియోజకవర్గం: మెదక్
పార్టీ: భారాస
కుటుంబ ఆస్తుల విలువ రూ.63.58 కోట్లు. ఆయనకు 10 తులాల బంగారం, ఆయన సతీమణికి 3.3 కిలోల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. రాజపుష్ప ఫామ్స్లో రూ.4.48 కోట్ల పెట్టుబడి ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.9.97 కోట్లు. పెద్దపల్లి ఓదెలలో ఎకరన్నర వ్యవసాయ భూమి, గాజులరామారంలో 261 గజాల స్థలం, గుట్టల బేగంపేటలో 430 గజాలు, తెల్లాపూర్లో 17 గుంటలు, మహేశ్వరం మంఖాల్ గ్రామంలో రాజపుష్ప ఫామ్స్ పేరిట ఉన్న 1,84,355 చదరపు గజాల్లో నాలుగో వంతు వాటాగా వ్యవసాయేతర స్థలాలున్నాయి. సొంతగా కారు, నివాసగృహం లేవు. తెల్లాపూర్లోని 17 గుంటల భూమిని డెవలప్మెంట్కు ఇచ్చారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.53.60 కోట్లు. రూ.9.8 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్ కేసు ఉంది.
తెలంగాణ, ఏపీల్లో 52 ఎకరాల సాగుభూములు..
అభ్యర్థి: మల్లు రవి
నియోజకవర్గం: నాగర్కర్నూల్
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ రూ.52.32 కోట్లు. ఆయన సతీమణి రాజ భన్సీదేవికి రాహుల్ ఏజెన్సీస్, కార్డమామ్ ఎస్టేట్, అల్డోరా ఎస్టేట్, అవీషా ఎస్టేట్, ట్రేడ్వెల్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆయనకు 4.5 తులాల బంగారం, ఆయన సతీమణికి 87.5 తులాల బంగారు ఆభరణాలు, 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఆయనకు రూ.20.66 లక్షలు, ఆయన సతీమణికి రూ.25.61 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. తెలంగాణ, ఏపీలో మొత్తం 52.33 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. తమిళనాడులోని కూనూరు, హైదరాబాద్లో పలు వ్యవసాయేతర స్థలాలు.. షేక్పేటలక్ష అపర్ణక్రెస్ట్, సికింద్రాబాద్, అమీర్పేటల్లోని వాణిజ్య సముదాయాల్లో స్థలాలు, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్సిటీ; విజయవాడలోని గుణదల, గన్నవరంలలో నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.26.49 కోట్లు. రూ.4.42 కోట్ల అప్పులున్నాయి. 5 క్రిమినల్ కేసులున్నాయి.
35 ఎకరాల సాగు భూములు..
అభ్యర్థి: జీవన్రెడ్డి, కాంగ్రెస్
నియోజకవర్గం: నిజామాబాద్
కుటుంబ ఆస్తుల విలువ రూ.3.55 కోట్లు. ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆయనకు 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 50 తులాల బంగారం ఉన్నాయి. చరాస్తుల విలువ రూ.63.38 లక్షలు. 35.24 ఎకరాల భూములున్నాయి. జగిత్యాలలో ఇల్లు, బ్యాంకుల్లో రూ.58.14 లక్షల రుణాలున్నాయి. 4 క్రిమినల్ కేసులున్నాయి.
సొంత ఇల్లు లేదు..
అభ్యర్థి: జి.శ్రీనివాస్, భాజపా, పెద్దపల్లి
కుటుంబ ఆస్తుల విలువ రూ.23.22 కోట్లు. ఆయన పేరిట రెండు కార్లు, 10 తులాల బంగారం, ఆయన సతీమణి పేరిట 35 తులాల బంగారు ఆభరణాలతో కలిపి చరాస్తుల విలువ రూ.82.25 లక్షలు. భూపాలపల్లిలో 4.27 ఎకరాల వ్యవసాయ భూమి, మహారాష్ట్రలో 2,12,800 చదరపు మీటర్ల (52.58 ఎకరాలు) వ్యవసాయేతర భూములు, హైదరాబాద్లో ఫ్లాటు ఉన్నాయి. ఆయనకు సొంత ఇల్లు లేదు.
ఊటీలో 18 ఎకరాలు..
అభ్యర్థి: మహ్మద్ వలీవుల్లా సమీర్
నియోజకవర్గం: హైదరాబాద్
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ రూ.13.20 కోట్లు. బ్యాంకులో డిపాజిట్లు, ఒక ఇండికా కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ల్యాండ్రోవర్, బొలేరో, కియా సోనెట్, ఇసుజీ ఎస్క్యాబ్, మారుతీ ఎకో కార్లు ఉన్నాయి. ఆయన పేరిట తెలంగాణలోని రాజాపూర్, కండ్వాడలో 20 ఎకరాలు, తమిళనాడులోని ఊటీలో 18 ఎకరాలు, ఆయన సతీమణి ఆయేషా సిద్దిఖీ పేరిట 2.03 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. మాసాబ్ట్యాంక్లో వాణిజ్య భవనాలు; బంజారాహిల్స్, ఫస్ట్లాన్సర్, గోల్కొండల్లో నివాస భవనాలు ఉన్నాయి. రూ.1.65 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 4 క్రిమినల్ కేసులున్నాయి.
85 ఎకరాల భూములు..
అభ్యర్థి: అరూరి రమేష్
నియోజకవర్గం: వరంగల్
పార్టీ: భాజపా
కుటుంబ ఆస్తుల విలువ రూ.28.74 కోట్లు. ఆయన సతీమణికి సాయిదత్తా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో రూ.4.26 కోట్ల షేర్లు ఉన్నాయి. కుటుంబానికి సొంత కార్లు లేవు. ఆరూరి దంపతులకు మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలున్నాయి. చరాస్తుల విలువ రూ.5.53 కోట్లు. 44.38 ఎకరాల వ్యవసాయ భూములు; ఘట్కేసర్, శాయంపేట, కాజీపేట, ధర్మసాగర్, ఐనవోలు మహబూబ్నగర్ కొత్తూరు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలాల్లో 41.45 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వరంగల్లో మూడు నివాస గృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ రూ.23.21 కోట్లు. రూ.46.03 లక్షల అప్పులున్నాయి. ఆయనపై 6 క్రిమినల్ కేసులున్నాయి.
32 ఎకరాల సాగుభూమి..
అభ్యర్థి: గోడం నగేష్
నియోజకవర్గం: ఆదిలాబాద్
పార్టీ: భాజపా
కుటుంబ ఆస్తుల విలువ రూ.3.09 కోట్లు. ఆయన పేరిట స్విఫ్ట్ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి.. సికింద్రాబాద్, ఆదిలాబాద్, జతారాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లు. రూ.29.01 లక్షల అప్పులున్నాయి.
ఆస్తులు తక్కువ.. అప్పులు ఎక్కువ..
అభ్యర్థి: దానం నాగేందర్
నియోజకవర్గం: సికింద్రాబాద్
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ రూ.59.61 కోట్లు. అయితే రూ.64.59 కోట్ల అప్పులున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.68.78 కోట్లుగా ప్రకటించారు. భాగ్యనగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రూ.16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. నలుగురు వ్యక్తులకు రూ.6.35 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు సొంత కారు లేదు. ఆయనకు రూ.2.99 కోట్ల విలువైన 1297 క్యారెట్ల వజ్రాలు, 80 తులాల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు.. ఆయన సతీమణికి 1350 క్యారెట్ల వజ్రాలు, 225 తులాల ఆభరణాలున్నాయి. చరాస్తుల విలువ రూ.30.92 కోట్లు. ఆయన సతీమణికి 54.17 ఎకరాల వ్యవసాయ భూములు, బంజారాహిల్స్లో నివాస భవనంతో కలిసి స్థిరాస్తుల విలువ రూ.28.69 కోట్లు. ఆయనపై 7 క్రిమినల్ కేసులున్నాయి.
రూ.17.66 కోట్ల అప్పులు..
అభ్యర్థి: కుందూరు రఘువీర్
నియోజకవర్గం: నల్గొండ
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ రూ.35.57 కోట్లు. వివిధ అన్లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. ఆస్తా గ్రీన్ఎనర్జీ, ఆర్తీ ఎనర్జీ, హిమాచల్ ఇన్ఫ్రాకాన్, యాక్సిలరేట్ ఆటోమోటివ్స్, బీఎస్ అగ్రీక్రౌన్, మారెడ్డి వెంచర్స్లో షేర్లు ఉన్నాయి. పలువురు వ్యక్తులకు, సంస్థలకు రూ.14.33 కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. కుటుంబ సభ్యులందరికీ కలిపి 99.7 తులాల బంగారు ఆభరణాలు, రూ.40.50 లక్షల విలువైన వజ్రాలు, 2.79 కిలోల వెండి వస్తువులతో కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.32.15 కోట్లు. జూబ్లీహిల్స్లో 530 గజాల భూమి ఉంది. సొంతంగా ఇల్లు, కారు లేవు. మొత్తం రూ.17.66 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 2 క్రిమినల్ కేసులున్నాయి.
రూ.9.24 కోట్ల చరాస్తులు..
అభ్యర్థి: చామల కిరణ్కుమార్రెడ్డి
నియోజకవర్గం: భువనగిరి
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ రూ.28.72 కోట్లు. బ్యాంకులో డిపాజిట్లు, కేకేసీ రియల్టర్స్, ఎల్కే డెవలపర్స్, కోటి ఎడ్యుకేషన్లో పెట్టుబడులు, షేర్లు ఉన్నాయి. సొంతంగా ఆయనకు కారు లేదు. సతీమణి పేరిట కారు ఉంది. ఆయనకు 86.2 తులాలు, సతీమణికి 1.02 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు. మేడ్చల్, చేవెళ్ల, ఆదిలాబాద్లలో 6.28 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. నల్గొండలో 2 వాణిజ్య భవనాలు, వనస్థలిపురం, గచ్చిబౌలిల్లో నివాస గృహాలు ఉన్నాయి. రూ.73 లక్షల అప్పులున్నాయి. ఆయనపై 2 క్రిమినల్ కేసులున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతోంది: కేసీఆర్
పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. -
వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
ప్రపంచం ముందు పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టాం: కిషన్రెడ్డి
కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తు చేశారు. -
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా
‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. -
కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు
‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. -
భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు: మంత్రి ఉత్తమ్
భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు?
భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు. -
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
మాదిగలకు సీటివ్వని కాంగ్రెస్ను ఓడించాలి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మాదిగలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వ్యతిరేక మార్పు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్నారు
‘‘దేశ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితోనే భాజపా నేతలు 400 లోక్సభ స్థానాలు గెలిపించాలంటున్నారు. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్
రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
నేడు ఐదు బహిరంగ సభలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. అగ్రనేతల రాకతో మరింత పదునెక్కుతోంది. భాజపా, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో వరుసగా సభల్లో పాల్గొననున్నారు. -
శాసనసభా పక్ష నేత పదవి బీసీలకు ఎందుకివ్వలేదు?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే బలహీనవర్గాల(బీసీ)కు చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభాపక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని.. దీనికి కారణమేమిటని కిషన్రెడ్డి, బండి సంజయ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ లేఖలో ప్రశ్నించారు. -
వాస్తవాలపై చర్చిద్దాం రండి
యూపీఏ పాలనలో, ఎన్డీయే హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కోరారు. -
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు....
తాజా వార్తలు
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్