నేడు రాజీనామా లేఖతో వస్తా.. మీరూ రండి
‘ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం నిజమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్తూపం వద్దకు నేను రాజీనామా లేఖతో వస్తా.. మీరు కూడా రాజీనామా పత్రాన్ని వెంట తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
సీఎం రేవంత్రెడ్డికి హరీశ్రావు సవాల్
దేవుళ్ల మీద కాదు మీ మీద ఒట్టు వేసుకున్నా ప్రజలు నమ్మరని వ్యాఖ్య
నా ఎత్తు గురించి కాదు.. కల్లాల్లో వడ్లపై ధ్యాస పెట్టాలని సూచన
మెదక్, న్యూస్టుడే: ‘ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం నిజమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్తూపం వద్దకు నేను రాజీనామా లేఖతో వస్తా.. మీరు కూడా రాజీనామా పత్రాన్ని వెంట తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామాలను మేధావుల చేతుల్లో పెడదాం.. ముఖ్యమంత్రి చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను వారే స్పీకర్కు ఇస్తారని.. ఒక వేళ చేయకుంటే ముఖ్యమంత్రి రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తారని ఇందుకు సిద్ధమేనా అని ఆయన సీఎంను ప్రశ్నించారు. మాట మీద నిలబడే వ్యక్తివైతే.. గన్పార్క్ వద్దకు రావాలన్నారు. 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తోకముడిచారని.. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని హరీశ్ పేర్కొన్నారు. భారాస మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రం మెదక్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాందాస్చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామశివారు పీఎస్ఆర్ పాఠశాల ఆవరణలో వరంగల్ లోక్సభ భారాస అభ్యర్థి సుధీర్కుమార్ విజయం కోసం గురువారం రాత్రి నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి హరీశ్రావు హాజరై మాట్లాడారు. మాజీ మంత్రి మాట్లాడారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి రేవంత్రెడ్డి బాండ్పేపర్ మీద రాసిచ్చి దాని విలువ తీసేశారని విమర్శించారు. బాండ్పేపర్తో రాజకీయాలు నడవవని తెలిసి దేవుళ్ల మీద ఒట్టు వేసి వారిని రాజకీయాలకు వాడుకుంటున్నారని.. మీ మీద ఒట్టుపెట్టుకున్నా.. దేవుడిపై ఒట్టు వేసినా ప్రజలు నమ్మరని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
లక్ష తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్
కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా రూ.15వేలు, మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ ఇళ్లు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేలకు పింఛన్ పెంపు ఏవీ అమలు చేయడం లేదని విమర్శించారు. వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు లక్ష వివాహాలు అయ్యాయని, లక్ష తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 280 మంది రైతులు, 30 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు, ఎస్సీ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నా వారిని పరామర్శించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. నిత్యం దిల్లీకి పర్యటనలు తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని రేవంత్రెడ్డిని విమర్శించారు. హరీశ్రావు ఎత్తు గురించి కాకుండా సీఎం కల్లాల్లోని వడ్లపై ధ్యాసపెట్టాలని సూచించారు. రైతు రుణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు కావాలన్నా.. నిరుద్యోగభృతి, రైతు భరోసా రావాలన్నా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. కాంగ్రెస్ నేతలకు అహంకారం నెత్తికెక్కి గాలిలో ఉన్నారని.. వారిని భూమి మీదకు తేవాలంటే మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డిని పార్లమెంట్కు పంపాలని కోరారు.
కొత్త జిల్లాలు తీసేస్తామంటున్నారు
గత ప్రభుత్వ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎక్కువయ్యాయని వాటిని తీసేస్తామని, ఎన్ని ఉండాలనే దానిపై కమిషన్ వేస్తామని సీఎం అంటున్నారు.. నలభై ఏళ్ల పోరాటం ఫలితంగా మెదక్ పట్టణ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమంటే మెదక్, సిద్దిపేట జిల్లాలను పొగొట్టుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎంపీ ఎన్నికల్లో 8 నుంచి 9 స్థానాల్లో భారాస విజయం సాధిస్తుందని ఓ సర్వేలో తేలిందని పేర్కొన్నారు. గులాబీ అధినేత బస్సు యాత్రతో కాంగ్రెస్ నేతలు గజగజలాడుతున్నారని చెప్పారు. భాజపా నాయకులు అన్ని అబద్ధాలే చెబుతున్నారని, వైద్య, నర్సింగ్ కళాశాలలు, నవోదయ పాఠశాలలను ఇవ్వలేదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్, నర్సాపూర్, దుబ్బాక, సంగారెడ్డి ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్తప్రభాకర్రెడ్డి, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరిసుభాష్రెడ్డి, యాదవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, భారాస నాయకులు ప్రతాప్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన