అంతా కోటీశ్వరులే..!
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అంతా కోటీశ్వరులే ఉన్నారు. చాలామందికి పదులు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి.
అత్యంత ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి
ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 35 మందికి రూ.10 కోట్లకు పైనే ఆస్తులు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అంతా కోటీశ్వరులే ఉన్నారు. చాలామందికి పదులు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. చేవెళ్ల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు అత్యంత ధనికులుగా నిలిచారు. అత్యధికంగా భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి రూ.4,560 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులను పరిశీలిస్తే ఒక్కరు మినహా అందరు అభ్యర్థుల ఆస్తులూ రూ.కోటికి పైగానే ఉన్నాయి. కాంగ్రెస్కు చెందిన 17 మంది అభ్యర్థుల్లో 12 మంది ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉన్నాయి. భాజపాలో 13 మంది, భారాసలో 10 మంది ఆస్తుల విలువ రూ.పది కోట్లు దాటాయి. స్థిరాస్తులకు సంబంధించి బహిరంగ మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ విలువ ప్రకారం లెక్కించారు. అన్లిస్టెడ్ కంపెనీల్లో ముఖ విలువను పరిగణనలోకి తీసుకున్నారు. వాటి వ్యాపారం, లాభాలు తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవ విలువలు లెక్కిస్తే చాలామేర అభ్యర్థుల ఆస్తుల విలువ భారీగా పెరుగుతుంది.
- చేవెళ్ల నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో అత్యంత ధనికులు ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు తక్కువగా ఉన్నాయి.
- ప్రధాన పార్టీల్లో అత్యంత తక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా నాగర్కర్నూల్కు చెందిన భరత్ప్రసాద్ ఉన్నారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ.33.85 లక్షలుగా పేర్కొన్నారు. అయితే ఆయన తండ్రి రాములు సిటింగ్ ఎంపీగా ఉన్నారు.
- వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్య (రూ.1.55 కోట్లు), నాగర్కర్నూల్ భారాస అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ (రూ.1.41కోట్లు) ఆయా పార్టీల్లో తక్కువ ఆస్తులున్న అభ్యర్థులుగా నిలిచారు.
ఐదేళ్లలో పెరిగిన సిటింగ్ ఎంపీల ఆస్తులు..
లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది మంది సిటింగ్ ఎంపీలు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుంటే.. మరికొందరు ఇప్పటికే ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. గత ఐదేళ్లలో వీరందరి ఆస్తులూ పెరిగాయి. కొందరి ఆస్తులు మూడు రెట్లు పెరిగితే.. మరికొందరి ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. సిటింగ్ ఎంపీల్లో బండి సంజయ్ ఆస్తుల విలువ తక్కువగా ఉంది.
రఘురాంరెడ్డికి రూ.58.27 కోట్లు.. మన్నె శ్రీనివాస్రెడ్డికి రూ.16.18 కోట్లు
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల వివరాలివి..
మన్నె శ్రీనివాస్రెడ్డికి 99 ఎకరాల సాగు భూమి
నియోజకవర్గం: మహబూబ్నగర్
పార్టీ: భారాస
కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు డిపాజిట్లు, ఆయన పేరిట ఫార్చునర్, ఇన్నోవా క్రిస్టా, డిఫెండర్, బెంజ్, ఇన్నోవా కార్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరి పేరిట 1.79 కిలోల బంగారు ఆభరణాలు, ఎంఎస్ఆర్ ప్రాజెక్ట్స్, శ్రీకృష్ణ ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.10.23 కోట్లు. మహబూబ్నగర్ నవాబుపేట మండలం గురుకుంట, కరూర్, ఎన్మన్గాండ్ల, వికారాబాద్ జీవన్గిరి గ్రామాల్లో మొత్తం 99.07 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. మహబూబ్నగర్ తిరుమల హిల్స్, ఎనుగొండ, రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో వ్యవసాయేతర స్థలాలు; హైదరాబాద్, మహబూబ్నగర్లలో నివాసగృహాలతో కలిపి మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు రూ.6 కోట్లు. రూ.2.73 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై కేసులేమీ లేవు.
రఘురాంరెడ్డికి తమిళనాడులో భూములు
నియోజకవర్గం: ఖమ్మం
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ: రూ.58.27 కోట్లు
బ్యాంకుల్లో డిపాజిట్లు; వివిధ లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లో రూ.13.45 కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టబడులు ఉన్నాయి. వివిధ వ్యక్తులు, సంస్థలకు రూ.6.47 కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. కవాసకీ బైక్, మహీంద్రా థార్, ఇన్నోవా కార్లు, 19.90 కిలోల వెండి వస్తువులు, 4 తులాల బంగారంతో కలిపి మొత్తం చరాస్తుల విలువ దాదాపు రూ.31 కోట్లు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, తమిళనాడు, మహబూబాబాద్లలో విలువైన వ్యవసాయ భూములు; బేగంపేట, శేరిలింగంపల్లిల్లో వాణిజ్య భవనాలు; ఖమ్మం, హైదరాబాద్లలో నివాసగృహాలతో కలిపి మొత్తం రూ.27.19 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.9.54 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై ఒక క్రిమినల్ కేసు ఉంది.
వెలిచాల రాజేందర్రావుకు వ్యవసాయ భూములు లేవు..
నియోజకవర్గం: కరీంనగర్
పార్టీ: కాంగ్రెస్
కుటుంబ ఆస్తుల విలువ: రూ.26.58 కోట్లు
బ్యాంకుల్లో డిపాజిట్లు, పోచంపాడు కన్స్ట్రక్షన్ కంపెనీలో షేర్లు, ఇన్నోవా, ఎంజీ ఈవీ, బాలెనో, టాటానెక్సాన్ కార్లు, 1.14 కిలోల బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.8.25 కోట్లు. కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి వ్యవసాయ భూములు లేవు. కరీంనగర్ కొత్తపల్లిలో 3,818 గజాలు, మాదాపూర్లో 1,230 గజాల వ్యవసాయేతర స్థలాలు ఉన్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, కరీంనగర్ కొత్తపల్లిల్లో వాణిజ్య భవనాలు.. గచ్చిబౌలి, బంజారాహిల్స్, కరీంనగర్లలో ఆరు నివాసగృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.18.33 కోట్లు. అప్పులు రూ.4.68 కోట్లు.
బాబూమోహన్ ఆస్తులివే..
నియోజకవర్గం: వరంగల్ - స్వతంత్ర అభ్యర్థి
ఆయన వద్ద నగదు రూ.50 వేలు, ఇన్నోవా వాహనం, 50 గ్రాముల బంగారం ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.28.20 లక్షలు. ఆయన సతీమణి వద్ద బ్యాంకు ఖాతాల్లో రూ.1.70 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం కలిపి మొత్తం విలువ రూ.14.20 లక్షలు. సంగారెడ్డి జిల్లా చిమల్దారిలో ఆయన పేరిట 36 గుంటల భూమి, ఆయన సతీమణి పేరిట 1.04 ఎకరాల స్థలం, మాదాపూర్, బేగంపేటల్లో రూ.1.20 కోట్లు, రూ.50 లక్షల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి