2 దశాబ్దాల తర్వాత పోటీకి దూరంగా కేసీఆర్ కుటుంబం
రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.
పార్టీ ఆవిర్భావం తర్వాత లోక్సభ ఎన్నికల బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి
ఈనాడు, హైదరాబాద్: రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. 2001లో భారాస (అప్పటి తెరాస) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో (2004లో) కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీచేసి.. రెండుచోట్లా విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీశ్రావు గెలుపొందారు. కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా కొనసాగారు. తదనంతర పరిణామాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గులాబీ సారథి 2006, 2008 సంవత్సరాల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో (2014లో) గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంటుకు కేసీఆర్ పోటీచేసి రెండింటా గెలుపు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్ ఎంపీ పదవికి భారాస అధినేత రాజీనామా చేయడంతో.. ఆ స్థానం నుంచి కొత్త ప్రభాకర్రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇవే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకపోయినా.. కవిత మాత్రం నిజామాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2022లో తెరాసను భారాసగా మార్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి పాలై, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో 2024 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్లలో నెలకొంది. నిజామాబాద్ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలను పార్టీ ముందునుంచే ఇస్తూ వచ్చింది. మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఈసారి అక్కడి నుంచి వెంకట్రామిరెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఒక దశలో మల్కాజిగిరి నుంచి కేటీఆర్ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో మరో అభ్యర్థి వైపు దృష్టి సారించిన అధిష్ఠానం చివరకు ఇక్కడ్నించి రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి: ఎంపీ అర్వింద్
మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.... -
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైంది: కేసీఆర్
రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
కేసీఆర్.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్
కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
నేను గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలుమార్గం: భారాస అభ్యర్థి వినోద్ కుమార్
ఉన్నత విద్యా సంస్థలను కరీంనగర్కు తేవాలనేది తన లక్ష్యమని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ఆదిలాబాద్ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి
ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
రాహుల్ ప్రధాని కావాలి: దీపా దాస్మున్షీ
రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్కుమార్ తెలిపారు. రాజేందర్రావు వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. -
33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రధాని కృషి
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల పక్షపాతి అని, వారికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కొనియాడారు. -
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. -
సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం
తనపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులో మాట్లాడారు. -
హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్
సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. -
భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
ఏ ప్రభుత్వం తప్పు చేసినా.. ఎర్రజెండాకు ఎదిరించే శక్తి
‘పేదల పక్షాన పోరాడుతూ.. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ ఎదిరించే శక్తి మాత్రం ఎర్రజెండాకే ఉంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాసలో చీలికలు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
నేడు దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం(నేడు) రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం ఛైర్మన్ ప్రీతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్ సెల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు