దేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్కే
భారతదేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని.. దేశ ప్రజలంతా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు చూస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్
ఈటీవీ, ఖమ్మం: భారతదేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని.. దేశ ప్రజలంతా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు చూస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులతో ఎన్నికల బరిలో దిగుతున్న రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాలు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ... మోదీ పదేళ్ల పాలనలో పేదరికం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో భాజపా ఎదగకుండా ఉండేందుకే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్కు మద్దతిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు రఘురాంరెడ్డి నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాను డకౌట్ చేసి.. గుజరాత్ను ఓడించాలి: రేవంత్
రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. -
ఖమ్మంలో విక్టరీ వెంకటేశ్ రోడ్ షో
ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ ఖమ్మంలో రోడ్ షో నిర్వహించారు. -
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు: కేసీ వేణుగోపాల్
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. -
90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు భాజపా కుట్ర: భట్టి విక్రమార్క
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. -
మల్కాజిగిరిలో ఏ సర్వే సంస్థకూ అందని ఫలితాలు: ఈటల రాజేందర్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ప్రజలకు తెలియదని.. వాళ్లకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. -
కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు: బండి సంజయ్
కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అని భాజపా ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. -
కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి నేనే వెళ్లమన్నా: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి వెళ్లమన్నది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. -
ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆయన కోడలు, ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత పేర్కొన్నారు. -
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. -
ఓటమి భయంతోనే మోదీ వ్యాఖ్యలు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా సగానికిపైగా సీట్లలో ఓడిపోతోందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
రిజర్వేషన్ల ఎత్తివేతకు భాజపా యత్నం.. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
‘‘భాజపా రిజర్వేషన్లు ఎత్తివేయాలని, మళ్లీ మనుస్మృతిని తేవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతలు మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. -
ఆరు గ్యారంటీలు అమలైన గ్రామాల్లో ఓట్లడగం: హరీశ్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. -
దక్షిణభారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది
దేశాన్ని అఖండ భారతావనిగా ఉంచాలని ప్రధాని మోదీ చూస్తోంటే.. పాకిస్థానీయుల తరహాలో కాంగ్రెస్ ఆలోచిస్తోందని, దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించేందుకు కుట్రలు పన్నుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. -
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణన్ తెలిపారు. -
భారాస చిరునామా గల్లంతే
ఈ లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో భారాస చిరునామా గల్లంతవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
మోదీ రాజ్యంలో అత్యాచారాలు పెరిగాయి
మోదీ రాజ్యంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లలో మోదీ చెప్పిన 150 నినాదాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు. -
మోదీ అడుగుజాడల్లో రేవంత్
ఆరెస్సెస్ మనిషి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
భాజపా నేతలకు దమ్ముంటే లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. -
మత విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందేందుకు భాజపా యత్నం
మత విద్వేషాలు రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ అద్నాన్ అర్జాఫ్ విమర్శించారు. -
ఎన్నికల స్వాధీనాల విలువ రూ.269 కోట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.269.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఎన్నికల రోజు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైడ్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు.. హక్కు మాత్రమే కాదు, బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM