17 స్థానాలు.. 895 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం 348 మంది నామినేషన్లు వేశారు.
చివరి రోజు 348 మంది దాఖలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం 348 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 18న స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా మొత్తంగా 895 దాఖలు చేశారు. కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు భారీ ర్యాలీలతో కోలాహలంగా దాఖలు చేశారు. తొలి పర్వం ముగియటంతో ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది. శుక్రవారం పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఉపసంహరణకు సోమవారం చివరి రోజు. అదే రోజు సాయంత్రంలోగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అన్రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల 29న తుది ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యర్థులకు అందజేస్తారు.
టోకెన్లు ఇచ్చి..
నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు కావటంతో పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కార్యాలయానికి చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి ఆ వరుస క్రమంలో స్వీకరించారు. ప్రతిపాదించిన ఓటర్ల వివరాలను పరిశీలించిన తరవాత అభ్యర్థులతో ప్రమాణం చేయించాల్సి ఉండటంతో రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా 895 నామినేషన్లు దాఖలయ్యాయి.
మల్కాజిగిరిలో అత్యధికం
నియోజకవర్గాల వారీగా చివరిరోజు, మొత్తంగా వేసిన నామినేషన్లు వేసిన అభ్యర్థుల వివరాలివి. మల్కాజిగిరిలో 63(మొత్తం 114)మంది, హైదరాబాద్ 35(57), చేవెళ్ల 30(66), వరంగల్ 24(58), సికింద్రాబాద్ 23(57), మెదక్ 22(54), ఖమ్మం 22(45), పెద్దపల్లి 22(63), జహీరాబాద్ 19(40), నాగర్కర్నూల్ 19(34), కరీంనగర్ 16(53), భువనగిరి 16(61), నల్గొండ 11(56), నిజామాబాద్ 9(42), మహబూబ్నగర్ 8(42), మహబూబాబాద్ 7(30), ఆదిలాబాద్ 2(23) మంది అభ్యర్థుల దాఖలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్లు రద్దు కావు
కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. -
పాతవి లేవు.. కొత్త పథకాలు రావు
‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. -
భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు
ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. -
ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం
‘‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా 32,331 మంది ఓటు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్బ్యాలెట్ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రిజర్వేషన్లు విస్తరించిందే భాజపా: లక్ష్మణ్
‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
26 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ భాజపాలోకి..
లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పాత, కొత్త నాయకుల సమన్వయంపై దృష్టి పెట్టాలి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సూచించింది. -
దిల్లీ పోలీసుల పేరుతో వేధింపులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?
తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే
‘కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి. -
రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు కోల్పోతాం
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్
భారాస అధినేత కేసీఆర్ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
జిల్లాల రద్దు కాదు.. కమిషన్ ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఇండియా’ కూటమికే బీసీల మద్దతు: జాజుల
కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
సీఎం పదవికి రేవంత్ అనర్హుడు: డీకే అరుణ
సీఎం పదవికి రేవంత్రెడ్డి అనర్హుడని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతోంది: కేసీఆర్
పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్