లోక్సభ బరి.. 28 మందికి తొలిసారి..!
శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి.
15 మంది ఏ చట్టసభకూ పోటీ చేయని వారే..
బరిలో 31 మంది తాజా, మాజీ ప్రజాప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవడం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపాలకు అనివార్యంగా మారింది. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో ముక్కోణపు పోటీలకు తెరలేచింది. గెలుపే లక్ష్యంగా పార్టీలు అనుసరించిన వ్యూహాల ఫలితంగా అత్యధికంగా తాజా, మాజీ ప్రజాప్రతినిధులే అభ్యర్థులుగా నిలిచారు.
కాంగ్రెస్, భారాస, భాజపా ప్రకటించిన మొత్తం 51 మంది అభ్యర్థుల్లో.. 31 మంది ఏదో ఒక చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న వారే. వీరిలో తొమ్మిది మంది సిటింగ్ ఎంపీలు, ఎనిమిది మంది మాజీ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మొత్తంగా లోక్సభకు తొలిసారి పోటీ పడుతున్నవారు 28 మంది ఉన్నారు.
తాజా, మాజీ ఎంపీలే మరోమారు..
- మహబూబాబాద్ స్థానంలో సిటింగ్ ఎంపీ మాలోత్ కవిత (భారాస)కు ప్రత్యర్థులుగా ఇద్దరు మాజీ ఎంపీలు పోరిక బలరాంనాయక్ (కాంగ్రెస్), సీతారాంనాయక్ (భాజపా) పోటీ పడుతున్నారు.
- కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ స్థానం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. ఇక్కడ సిటింగ్ ఎంపీ కిషన్రెడ్డిపై ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భారాస నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ బరిలో దిగారు.
- నిజామాబాద్లో సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (భాజపా)తో తలపడుతున్న కాంగ్రెస్, భారాస అభ్యర్థులు టి.జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్.. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే.
- మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 13 మంది ఇప్పుడు లోక్సభ గోదాలోనూ దిగారు.
- మహబూబ్నగర్ బరిలో ఉన్న ముగ్గురూ పాత ప్రత్యర్థులే. 2019 లోక్సభ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్, భాజపాల తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్రెడ్డి, వంశీచంద్రెడ్డి, డీకే అరుణ.. ఇప్పుడూ అవే పార్టీల అభ్యర్థులుగా తలపడుతున్నారు.
బరిలో నలుగురు వారసులు
బలమైన అభ్యర్థులను బరిలో దించే క్రమంలో కొత్త వారికి పరిమితంగానే అవకాశాలు దక్కాయి. మూడు ప్రధాన పార్టీలు ప్రకటించిన 51 మందిలో 15 మంది చట్టసభలకు పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆత్రం సుగుణ, కడియం కావ్య, పట్నం సునీతా మహేందర్రెడ్డి, ఎం.సుధీర్కుమార్, చామల కిరణ్కుమార్రెడ్డి, భరత్ప్రసాద్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాధవీలత, వంశీకృష్ణ, తాండ్ర వినోద్రావు, కె.రఘువీర్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఆర్.రఘురాంరెడ్డి, వలీవుల్లా సమీర్లు ఎన్నికల బరిలో అరంగేట్రం చేస్తున్నారు. వీరిలో నలుగురు అభ్యర్థులు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులకు వారసులు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ.. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వివేక్ కుమారుడు. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత కె.జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నాయకుడు, ఇటీవల కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ బరిలో నిలిచారు. నాగర్కర్నూల్ నుంచి సిటింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ భాజపా తరఫున పోటీలో ఉన్నారు. ఇటీవల వరకు ఉపాధ్యాయురాలిగా ఉన్న ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉపాధ్యాయ సంఘం నేత, మానవహక్కుల ఉద్యమ నాయకురాలు కూడా.
అక్కడ గెలిచేదెవరైనా పార్లమెంటుకు కొత్తే..
ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో సిటింగ్, మాజీ ఎంపీలెవరూ బరిలో లేరు. వరంగల్, నల్గొండ, మల్కాజిగిరి, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా.. తొలిసారి లోక్సభలో అడుగుపెడతారు. అలాగే తాజా, మాజీ ఎంపీలు మినహా మిగిలిన 34 మంది అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా వారు లోక్సభకు కొత్తే.
- ఇద్దరు ఎమ్మెల్సీల్లో టి.జీవన్రెడ్డి నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉండగా.. వెంకట్రామిరెడ్డి భారాస అభ్యర్థిగా మెదక్లో పోటీచేస్తున్నారు.
- ఈసారి కాంగ్రెస్ తరఫున రాష్ట్ర అగ్రనేతలెవరూ లోక్సభ బరిలో లేకపోగా, భాజపా ముఖ్యనేతలంతా పోటీ చేస్తున్నారు. భాజపా సిటింగ్ ఎంపీలైన కిషన్రెడ్డి, బండి సంజయ్, డి.అర్వింద్లతో పాటు సీనియర్ నేతలు డి.కె.అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్రావు తదితరులు బరిలో నిలిచారు.
- భారాసకు చెందిన తొమ్మిది మంది సిటింగ్ ఎంపీల్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్) మళ్లీ భారాస అభ్యర్థులుగానే బరిలో నిలిచారు. రంజిత్రెడ్డి (చేవెళ్ల) కాంగ్రెస్లో, బీబీ పాటిల్ (జహీరాబాద్) భాజపాలో చేరి.. అవే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. నాగర్కర్నూల్ సిటింగ్ ఎంపీ రాములు భాజపాలో చేరి.. ఆ పార్టీ తరఫున తన కుమారుడు భరత్ప్రసాద్ను బరిలో దింపారు. మరో ఇద్దరు సిటింగ్ ఎంపీలు పసునూరి దయాకర్ (వరంగల్), వెంకటేష్ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్లో చేరినా, ప్రస్తుతం పోటీలో లేరు. మెదక్ సిటింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా