యుద్ధానికి సిద్ధం కావాలి..
‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి.
తెలంగాణ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడతా
రేవంత్ ఛోటే భాయ్.. మోదీ బడే భాయ్..
భారాసను అణగదొక్కేందుకు కాంగ్రెస్, భాజపాల కుట్ర
మహబూబ్నగర్ పోరుబాటలో కేసీఆర్
ఈనాడు, మహబూబ్నగర్: ‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు.. తప్ప నిద్రపోడు’ అని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట.. బస్సుయాత్ర’ శుక్రవారం మహబూబ్నగర్లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి, దేశానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రెండూ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. భారాసను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
వాళ్లకి ఓటేస్తే మీటర్లు పెడతారు
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఛోటే భాయ్.. నరేంద్ర మోదీ బడే భాయ్. ఇద్దరూ ఒక్కటే. ఇక్కడ ఛోటే భాయ్కి ఓటేస్తే.. పెద్దన్న మోదీ చెప్పారని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు. భాజపాకు ఓటేసినా అదే పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని మోదీకి చెప్పాను. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే దిల్లీలో అన్నదాతలు ధర్నా చేశారు. దాదాపు 750మంది రైతులు చనిపోయారు. నేను తెలంగాణ తరఫున పంజాబ్, చండీగఢ్ వెళ్లి.. చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం అందించాను. భాజపా దేవుడి పేరు చెప్పి జనం ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. దేవుళ్ల పేరు చెప్పి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఓట్ల రాజకీయాలు ఎవరూ నమ్మరు.
రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో..?
కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోలీలాడుకుంటా.. నీ పేగులు పీకి మెడలో వేసుకుంటా? నిన్ను చర్లపల్లి జైల్లో వేస్తా. ఇవేనా ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు? తెలంగాణ కోసం పోరాడిన నన్ను అలా మాట్లాడడం మర్యాదేనా? గత పదేళ్ల పాలన ఎలా ఉండేది? కరెంట్ ఎప్పుడైనా పోయిందా.. ఇప్పుడు వస్తోందా? ఉద్యమ సమయంలో 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా మహబూబ్నగర్కు వచ్చి ఆటోలు నడిపేవారు. అలాంటి వాళ్లని కూడా ఆదుకోవాలని రైతుబంధు పెట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు ఎకరాలు, ఐదు ఎకరాలున్న రైతులకే సాయం చేస్తామని అంటోంది. 6, 7 ఎకరాలు ఉన్నవారు ఎక్కడికి పోవాలి. వాళ్లేమైనా కోటీశ్వరులా? రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో నమ్మకం లేదు. రైతుబీమా కూడా ఉంటుందో లేదో చెప్పలేం. మా ప్రభుత్వంలో అంబేడ్కర్ ఓవర్సీస్ ద్వారా రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అంతా మోసం. అందుకే రైతులు, యువత అందరూ ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. భారాసకు బలం కావాలి. అది మీరే ఇవ్వాలి. ఇక్కడ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలిస్తే భారాసకు బలం వస్తుంది.
భాజపా.. అక్కరకు రాని చుట్టం
భాజపా ఈ దేశాన్ని పదేళ్లుగా పరిపాలిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని 100 ఉత్తరాలు రాశాం. ఇచ్చారా? అందుకోసం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కృషి చేశారా? మరి ఆమె ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారు? కేంద్ర చట్టం ప్రకారం.. ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా.. మనకి ఒక్కటైనా ఇచ్చారా? దేశంలో మోదీ 157 వైద్య కళాశాలలు పెట్టారు. మాకు నాలుగు ఇవ్వాలని దరఖాస్తు పెడితే.. ఒక్కటీ ఇవ్వలేదు. మోదీ ఏడు మండలాలను గుంజి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటును ఏపీకి ఇచ్చారు. భాజపా అంటే మనకు అక్కరకు రాని చుట్టం.
భారాస సెక్యులర్ పార్టీ..
మైనార్టీ మిత్రులారా.. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ భారాస, భాజపా మధ్యనే పోటీ ఉంది. మీరు కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు వేసినట్లే. రంజాన్ పండుగకు మా ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు కానుకలు ఇచ్చేది. ఈసారి ఎందుకివ్వలేదు? మేం దేశంలోనే తొలిసారిగా ఇమాంలకు జీతాలు ఇచ్చాం. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు ఏమైనా చేసిందా? మీ పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టించాను. మీరు పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే భాజపా గెలుస్తుంది. భారాస సెక్యులర్ పార్టీ. అందుకే కారు గుర్తుకే ఓటు వేయండి’ అని కేసీఆర్ కోరారు. కేసీఆర్ పర్యటనలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
భారాస ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ శుభాకాంక్షలు
ఈనాడు, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజానీకానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటాలను తమ పార్టీ గమ్యానికి చేర్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై పుట్టిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతోపాటు పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల