యుద్ధానికి సిద్ధం కావాలి..
‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి.
తెలంగాణ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడతా
రేవంత్ ఛోటే భాయ్.. మోదీ బడే భాయ్..
భారాసను అణగదొక్కేందుకు కాంగ్రెస్, భాజపాల కుట్ర
మహబూబ్నగర్ పోరుబాటలో కేసీఆర్
ఈనాడు, మహబూబ్నగర్: ‘నాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను. పదేళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ల ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం.. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు.. తప్ప నిద్రపోడు’ అని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట.. బస్సుయాత్ర’ శుక్రవారం మహబూబ్నగర్లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి, దేశానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రెండూ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. భారాసను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
వాళ్లకి ఓటేస్తే మీటర్లు పెడతారు
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఛోటే భాయ్.. నరేంద్ర మోదీ బడే భాయ్. ఇద్దరూ ఒక్కటే. ఇక్కడ ఛోటే భాయ్కి ఓటేస్తే.. పెద్దన్న మోదీ చెప్పారని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు. భాజపాకు ఓటేసినా అదే పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని మోదీకి చెప్పాను. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే దిల్లీలో అన్నదాతలు ధర్నా చేశారు. దాదాపు 750మంది రైతులు చనిపోయారు. నేను తెలంగాణ తరఫున పంజాబ్, చండీగఢ్ వెళ్లి.. చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం అందించాను. భాజపా దేవుడి పేరు చెప్పి జనం ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. దేవుళ్ల పేరు చెప్పి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఓట్ల రాజకీయాలు ఎవరూ నమ్మరు.
రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో..?
కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోలీలాడుకుంటా.. నీ పేగులు పీకి మెడలో వేసుకుంటా? నిన్ను చర్లపల్లి జైల్లో వేస్తా. ఇవేనా ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు? తెలంగాణ కోసం పోరాడిన నన్ను అలా మాట్లాడడం మర్యాదేనా? గత పదేళ్ల పాలన ఎలా ఉండేది? కరెంట్ ఎప్పుడైనా పోయిందా.. ఇప్పుడు వస్తోందా? ఉద్యమ సమయంలో 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా మహబూబ్నగర్కు వచ్చి ఆటోలు నడిపేవారు. అలాంటి వాళ్లని కూడా ఆదుకోవాలని రైతుబంధు పెట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు ఎకరాలు, ఐదు ఎకరాలున్న రైతులకే సాయం చేస్తామని అంటోంది. 6, 7 ఎకరాలు ఉన్నవారు ఎక్కడికి పోవాలి. వాళ్లేమైనా కోటీశ్వరులా? రైతుబంధును ఉంచుతారో.. ఊడగొడతారో నమ్మకం లేదు. రైతుబీమా కూడా ఉంటుందో లేదో చెప్పలేం. మా ప్రభుత్వంలో అంబేడ్కర్ ఓవర్సీస్ ద్వారా రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అంతా మోసం. అందుకే రైతులు, యువత అందరూ ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. భారాసకు బలం కావాలి. అది మీరే ఇవ్వాలి. ఇక్కడ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలిస్తే భారాసకు బలం వస్తుంది.
భాజపా.. అక్కరకు రాని చుట్టం
భాజపా ఈ దేశాన్ని పదేళ్లుగా పరిపాలిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని 100 ఉత్తరాలు రాశాం. ఇచ్చారా? అందుకోసం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కృషి చేశారా? మరి ఆమె ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారు? కేంద్ర చట్టం ప్రకారం.. ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా.. మనకి ఒక్కటైనా ఇచ్చారా? దేశంలో మోదీ 157 వైద్య కళాశాలలు పెట్టారు. మాకు నాలుగు ఇవ్వాలని దరఖాస్తు పెడితే.. ఒక్కటీ ఇవ్వలేదు. మోదీ ఏడు మండలాలను గుంజి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటును ఏపీకి ఇచ్చారు. భాజపా అంటే మనకు అక్కరకు రాని చుట్టం.
భారాస సెక్యులర్ పార్టీ..
మైనార్టీ మిత్రులారా.. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ భారాస, భాజపా మధ్యనే పోటీ ఉంది. మీరు కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు వేసినట్లే. రంజాన్ పండుగకు మా ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు కానుకలు ఇచ్చేది. ఈసారి ఎందుకివ్వలేదు? మేం దేశంలోనే తొలిసారిగా ఇమాంలకు జీతాలు ఇచ్చాం. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు ఏమైనా చేసిందా? మీ పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టించాను. మీరు పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే భాజపా గెలుస్తుంది. భారాస సెక్యులర్ పార్టీ. అందుకే కారు గుర్తుకే ఓటు వేయండి’ అని కేసీఆర్ కోరారు. కేసీఆర్ పర్యటనలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
భారాస ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ శుభాకాంక్షలు
ఈనాడు, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజానీకానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటాలను తమ పార్టీ గమ్యానికి చేర్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై పుట్టిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతోపాటు పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 5న కాంగ్రెస్లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి
తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పునరుద్ఘాటించారు. -
శరీర రంగుతో అవమానిస్తే సహించేది లేదు: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ మండిపాటు
మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వరంగల్ పరిధిలోని మామునూరులో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
అవినీతిలో కాంగ్రెస్, భారాసది ఫెవికాల్ బంధం: ప్రధాని మోదీ
ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. -
సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగింది
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను. -
విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు?
ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ వస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు
ఎన్నికల ప్రచారం, పోలింగ్కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది. -
అవినీతి అంతం మోదీతోనే సాధ్యం
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి భాజపాను గెలిపించాలని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ పిలుపునిచ్చారు. -
దేశ సుస్థిరతకు మోదీ నాయకత్వం అవసరం
దేశ సుస్థిరతకు, ప్రజాసంక్షేమానికి కేంద్రంలో మోదీ నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి కిషన్రెడ్డి అన్నారు. -
ఓట్ల కోసమే ‘రైతు భరోసా’ను అడ్డుకున్నాయి
రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంటే.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి భాజపా, భారాస అడ్డుకున్నాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్లు మంగళవారం విమర్శించారు. -
ప్రియాంకాగాంధీ పర్యటన 11కు వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 10న కాకుండా 11న తెలంగాణకు వస్తున్నారు. -
నేడు మోదీ, రేపు అమిత్షా సభలు
ప్రధాని మోదీ బుధవారం, కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేశారు. -
సీబీఐ విచారణకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా!
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ పార్టీ నేతలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. -
సోషల్ మీడియా ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్
లోక్సభ అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్తో చేస్తున్న ప్రచార వివరాలను సమీకరిస్తోంది. -
మోదీ మోసం.. కేసీఆర్ నమ్మక ద్రోహం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ, పదేళ్లు పాలించి యువతను మోసం చేశారని.. దళిత ముఖ్యమంత్రి, రెండు పడక గదుల ఇళ్ల హామీలను నెరవేర్చకుండా భారాస అధ్యక్షుడు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
రఘురాంరెడ్డికి ఓటేయండి
అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. అలాంటి రఘురాంరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు భాజపా యత్నం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పన్నెండు మందిని తప్పకుండా గెలిపిస్తే.. ఆర్నెల్ల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు?
‘‘పిరమైన ప్రధాని నరేంద్ర మోదీజీ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా మంగళవారం ప్రధానిని ఉద్దేశించి.. కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. -
భాజపాను మించిన అవినీతి పార్టీ లేదు
దేశంలో భాజపాను మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్ మద్దతు
రాష్ట్రంలో 57 దళిత ఉపకులాలు, వృత్తి కళాకారులు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్ అధ్యక్షుడు పశుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రిజర్వేషన్ల రద్దే భాజపా అసలు ఎజెండా
భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్, సామ రాంమోహన్రెడ్డిలతో కలసి గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఆరు గ్యారంటీల్లో అమలైంది ఒక్కటే
‘కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పిన 6 గ్యారంటీలు.. 66 హామీలు.. 400కుపైగా వాగ్దానాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరేదీ అమలు కాలేదు.
తాజా వార్తలు
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా