రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా కుట్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమనేది క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లాంటి కేసీఆర్ను ఓడించడం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్థాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం.
కార్పొరేట్ సంస్థలకు మోదీ దాసోహం
జహీరాబాద్లో భాజపా అభ్యర్థికి కేసీఆర్ సహకారం
పెద్దశంకరంపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
పాకిస్థాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమనేది క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లాంటి కేసీఆర్ను ఓడించడం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్థాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం. కాంగ్రెస్పై మోదీ, అమిత్షా, నడ్డా, భాజపా ఇతర జాతీయ నాయకులు ముప్పేట దాడి చేస్తున్నారు. రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నారు. ఈ అంశాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంపైనే ఉంది.
సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు-కామారెడ్డి, పెద్దశంకరంపేట-న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలు సాధించి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. రైతుల పోరాటానికి మోదీ ప్రభుత్వం దిగివచ్చి వాటిని రద్దు చేసింది. కర్షకులకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారు. మోదీ, అమిత్షాలకు అదానీ, అంబానీ తోడయ్యారు. రిజర్వేషన్లు ఉంటే తమ పాచికలు పారవని ఈ నలుగురూ నిర్ణయించుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చి.. వాటిని రద్దు చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు దాసోహం అంటున్న మోదీ.. దేశాన్ని అప్పులపాలు చేశారు.
భాజపాతో కేసీఆర్ కుమ్మక్కు
భారాస అధినేత కేసీఆర్ భాజపాతో కుమ్మక్కై కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్కు చెప్పాకే బీబీ పాటిల్ భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలోనే మెదక్ ఎంపీ టికెట్ అడిగిన గాలి అనిల్కుమార్కు జహీరాబాద్ టికెట్ ఇచ్చారు. ఆయనకు జహీరాబాద్పై ఎటువంటి అవగాహన లేదు. బలహీన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా భాజపా అభ్యర్థి విజయానికి కేసీఆర్ సహకరిస్తున్నారు.
భారాస హయాంలో కేసీఆర్ కుటుంబికులకే ఉద్యోగాలు
భారాస ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ కుటుంబికులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ కుమారుడికి, అల్లుడికి మంత్రి పదవులు, కుమార్తెకు ఎంపీ పదవి ఇచ్చారు. కుమార్తె ఎంపీగా పోటీచేసి ఓడిపోతే.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కేసీఆర్ బంధువులు వినోద్కుమార్, విద్యాసాగర్రావు, దయాకర్రావుకు పదవులు దక్కాయి. నిరుద్యోగుల గోస మాజీ సీఎం కేసీఆర్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన రోజు నాకు కంటినిండా నిద్ర పట్టింది.
ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రజాపాలన
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యంలోనే ప్రస్తుతం ప్రజాపాలన సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదింటిని అమలు చేశాం. మిగిలిన వాటి అమలుకు కట్టుబడి ఉన్నాం. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. భారాస ప్రభుత్వంలో నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామంటూ కేసీఆర్ మాయమాటలు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. వాటిని ఇవేం ఇళ్లంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామనే హామీని తుంగలో తొక్కారు’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌధరి, ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?