267 మంది నామినేషన్ల తిరస్కరణ
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది.
అత్యధికంగా మల్కాజిగిరిలో 77..
మంద జగన్నాథం, బాబూమోహన్లకు ఖేదం
నామినేషన్ల పరిశీలన పూర్తి.. 626 మందివి ఆమోదం
ఈనాడు, హైదరాబాద్- ఈటీవీ, ఆదిలాబాద్, వరంగల్ కలెక్టరేట్, నాగర్కర్నూల్, న్యూస్టుడే: రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది నామినేషన్లు వేయగా 267 మంది అభ్యర్థుల పత్రాలను తిరస్కరించిన అధికారులు 626 మందివి నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు చేపట్టిన పరిశీలన కొన్ని నియోజకవర్గాల్లో పొద్దుపోయేంత వరకు సాగింది. నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుత ఎంపీ రాములు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడంతో రాములు డమ్మీ అభ్యర్థిగా వేశారు. బీఫాం లేకపోవడంతో తిరస్కరించారు. అదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ నుంచి వేసినా బీఫాం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫాంను సమర్పించారు. వరంగల్ స్థానానికి మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలను తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. అఫిడవిట్లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో ప్రావీణ్య తెలిపారు.
ఆదిలాబాద్ భాజపా అభ్యర్థి అఫిడవిట్పై అభ్యంతరాలు
ఆదిలాబాద్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన గోడం నగేష్ దాఖలు చేసిన అఫిడవిట్పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నామినేషన్ పత్రాల్లోని కొన్ని అంశాలను ఖాళీగా వదిలేశారని, ఆ కారణంగా తిరస్కరించాలని కాంగ్రెస్, బహుజన్ సమాజ్పార్టీ, భారాస నేతలు డిమాండ్ చేయటంతోపాటు ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులు ఫిర్యాదు స్వీకరించేందుకు అనుమతించలేదు. నగేష్ నామినేషన్ను ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. ఆర్వో వ్యవహారశైలిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, నగేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని బీఎస్పీ ఎంపీ అభ్యర్థి జంగుబాపుతోపాటు కాంగ్రెస్, భారాస నేతలు డిమాండ్ చేశారు. పరిశీలన పూర్తి కావటంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది.
అత్యల్పంగా మెదక్లో..
తిరస్కరణకు గురైన వాటిలో అత్యధికంగా మల్కాజిగిరిలో 77 ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ 25, కరీంనగర్ 20, హైదరాబాద్ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్లలో 14 చొప్పున, నాగర్కర్నూల్ 13, సికింద్రాబాద్ 11, నిజామాబాద్, భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్లలో పది చొప్పున, మహబూబ్నగర్లో ఏడు, మహబూబాబాద్లో అయిదు, ఖమ్మంలో నలుగురు, మెదక్లో ఒకరి నామినేషన్ తిరస్కరించారు.
6,366 కేసులు నమోదు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన ఫిర్యాదులపై 6,366 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా మద్యానికి సంబంధించినవి 5,967 ఉన్నాయని.. మాదక ద్రవ్యాలు, ఐపీసీ కింద, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మిగిలిన కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ