icon icon icon
icon icon icon

625 మంది నామినేషన్ల చెల్లుబాటు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లలో 625 మంది అభ్యర్థులవి సక్రమంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

Published : 28 Apr 2024 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లలో 625 మంది అభ్యర్థులవి సక్రమంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 268 మంది అభ్యర్థుల పత్రాలు నిబంధనల మేరకు లేవని గుర్తించి తిరస్కరించినట్లు ప్రకటించింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తరవాత తుది జాబితా ఖరారవుతుంది. ప్రస్తుతానికి అత్యధికంగా మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 53 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భువనగిరిలో 51 మంది, పెద్దపల్లి 49, వరంగల్‌ 48, సికింద్రాబాద్‌, చేవెళ్లలలో 46 చొప్పున, ఖమ్మం 41, హైదరాబాద్‌ 38, మల్కాజిగిరి 37, మహబూబ్‌నగర్‌ 35, కరీంనగర్‌ 33, నిజామాబాద్‌ 32, నల్గొండ 31, జహీరాబాద్‌ 26, మహబూబాబాద్‌ 25, నాగర్‌కర్నూల్‌ 21, ఆదిలాబాద్‌లో 13 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img