భారాసకు ఒక్క సీటూ రాదు
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారాస ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
రెండుచోట్ల రెండో స్థానం.. మిగిలిన వాటిల్లో మూడో స్థానమే
ఎంఐఎంతో భాజపా అవగాహన.. అందుకే హైదరాబాద్లో హిందూ అభ్యర్థి
మే మొదటి వారంలో రాహుల్ సహా అగ్రనేతల పర్యటన
ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం పనులు
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారాస ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ‘‘తాజా సర్వేల్లో మెదక్లోనూ మూడో స్థానంలో ఉంది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారు. 2004 ఫలితాలే పునరావృతమవుతాయి. ఖమ్మం, నల్గొండలలో మాత్రమే భారాస రెండో స్థానంలో ఉంది. మిగిలిన అన్నిచోట్ల మూడో స్థానానికే పరిమితమవుతుంది. రాష్ట్రంలో భారాసకు 100కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పదే పదే చెప్పారు. ఫలితం ఏమైందో చూశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అలాగే చెప్పుకొంటున్నారు. ఫలితాలెలా ఉంటాయో మీరే చూస్తారు. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారు. ప్రియాంక పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అధిష్ఠానం నిర్ణయిస్తే వెళ్తాను’’ అని రేవంత్రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో శనివారం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
మతాన్ని నమ్ముకొని భాజపా రాజకీయం
‘‘భాజపా ముందు నుంచీ మతాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తోంది. ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. మూలాలపైనే దాడి చేస్తోంది. హైదరాబాద్ టికెట్ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఇచ్చాం. భాజపాకు ఎంఐఎంతో అవగాహన లేకపోతే.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందూ అభ్యర్థిని ఎలా నిలబెట్టింది? ‘ఒక్క ముస్లిం కూడా మాకు ఓటేయొద్దు.. మొత్తం ముస్లిం ఓట్లన్నీ అసదుద్దీన్ ఒవైసీకే వేయాలి’ అన్న ఉద్దేశంతోనే హిందూ అభ్యర్థిని పెట్టారు. నిజంగానే ఎంఐఎంను ఓడించాలనుకుంటే.. అక్కడ ముస్లిం అభ్యర్థిని భాజపా నిలబెట్టాలి. హిందూ ఓట్లన్నీ ఒకవేళ భాజపాకే పడతాయని అనుకున్నా.. ముస్లిం ఓట్లలో విభజన జరిగి.. ఆ ఓట్లు, ఈ ఓట్లు తోడైతే.. అసదుద్దీన్ ఓడిపోవడానికి అవకాశాలుండేవి. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలన్న వ్యూహమే భాజపాకు లేదు.
అసభ్య భాషకు ఆద్యుడు కేసీఆరే
భారత్ సమాఖ్య దేశం. ముఖ్యమంత్రులందరికీ ప్రధాని పెద్దన్న లాంటివారే. నేను మోదీని బడే భాయ్ అన్నది కాంగ్రెస్ పార్టీ వేదికపై నుంచి కాదు. ప్రభుత్వ కార్యక్రమంలో అన్నాను. ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్న సంబంధం నేపథ్యంలో అన్నాను. అసభ్య భాషకు ఆద్యుడే కేసీఆర్. నల్గొండ, సిరిసిల్ల సమావేశాల్లో ఆయన ఎలాంటి భాష మాట్లాడారో ప్రజలు వినలేదా? ఒకసారి ఆయన భాషను ఆయనకే వినిపించాలి. రైతు ఆత్మహత్యలపైనా భారాస రాజకీయం చేస్తోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుపరిపాలన అందించాం. ఇచ్చిన హామీలను అమలు చేశాం. నాలుగు నెలల్లో రూ.27 వేల కోట్లు అప్పులకు వడ్డీ కింద కట్టాం. ధనిక రాష్ట్రమంటూ అందర్నీ కేసీఆర్ మభ్యపెట్టారు. అందుకే మేము రాగానే విద్యుత్, నీరు, ఆర్థికంపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. అసెంబ్లీలో చర్చించడానికి భారాసకు అవకాశమిచ్చాం. చెప్పడానికి ఏమీ లేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నారు.
2021లోనే కాళేశ్వరంలో లోపాల గుర్తింపు
కాళేశ్వరంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) అధ్యయనం చేస్తోంది. ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. స్ట్రక్చరల్ ఇంజినీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేస్తే.. కాళేశ్వరం నడుము విరిగింది. ఆయన చేసింది కాకుండా.. మమ్మల్ని కూడా అలాగే చేయమంటున్నారు. 2021లోనే కాళేశ్వరంలో లోపాలు గుర్తించినట్లు అధికారికంగా సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు లేఖ రాశారు. దాన్ని కేసీఆర్ బయటకు రానీయకుండా తొక్కిపెట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మరమ్మతులు చేసి ఉండొచ్చు కదా! అక్టోబరు 2023న లోపాలు బయటపడినప్పుడు.. డిసెంబరు 3 వరకూ ఆయనే సీఎంగా ఉన్నారు కదా! అప్పుడెందుకు పనులు చేయలేదు? నీళ్లు మొత్తం ఎందుకు వదిలేశారు? ఏయే మరమ్మతులు చేయాలనేది ఎన్డీఎస్ఏ చెప్పాలి. తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి. భూసేకరణ తర్వాత ప్రారంభిస్తాం. గత ఏడాది ఇవే తేదీల్లో విద్యుత్, నీటి సరఫరా వివరాలు తీసుకోండి. ఇప్పటి వివరాలు తీసుకోండి. గత సంవత్సరం కంటే 50 శాతం అదనంగా విద్యుత్, నీటి సరఫరా అందిస్తున్నాం. అయినా సరిపోవడం లేదు. కారణం.. రిజర్వాయర్లలో నీళ్లు ఇంకిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వందల సంఖ్యలో బోర్లు ఎండిపోయాయి. నల్లా నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్కను ఒడిసిపట్టి.. జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాం. ఇది కేసీఆర్ తెచ్చిన కరవు’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్