సర్కారు గర్వం దించాలి
‘నాడు అందరి అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.
తెలంగాణ భగ్గుమంటోంది.. ధర్మాన్ని గెలిపించండి
బోర్లు ఎండుతున్నాయ్.. ట్యాంకర్లు వస్తున్నాయ్..
నాగర్కర్నూల్ సభలో భారాస అధినేత కేసీఆర్
ఈనాడు, మహబూబ్నగర్: ‘నాడు అందరి అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీటి కోసం తపించిన వ్యక్తిని. నన్ను పట్టుకుని ఇన్ని మాటలు అనొచ్చా. న్యాయం, ధర్మం చెప్పండి. ఎవరికి కర్రు కాల్చి వాతలు పెట్టాలో.. ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది మీరు. ధర్మాన్ని, భారాసను గెలిపించండి’ అని ఆ పార్టీ అధినేత, కేసీఆర్ ప్రజలను కోరారు. ‘పోరుబాట బస్సుయాత్ర’లో భాగంగా శనివారం నాగర్కర్నూల్లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్షో నిర్వహించారు. బస్టాండ్ వద్ద కూడలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘నేను నమ్మకంగా చెబుతున్నా. మీకు అనుమానం అవసరం లేదు. తెలంగాణ భగ్గుమంటోంది. ఎక్కడికి వెళ్లినా నా బస్సును కదలనివ్వడంలేదు. ఊరూరా పూలు చల్లుతున్నారు. గుమ్మడికాయలు కొడుతున్నారు. గంట, అరగంట ఆలస్యంగా ప్రయాణం సాగుతోంది. ప్రజలు మారిపోయారు. భారాసకు మద్దతు ఇస్తున్నారు. వారికి అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చురక పెట్టాలి. వాళ్ల గర్వం దించాలి. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండంగా పాలమూరు పథకం పూర్తి చేసుకుందాం’ అని అన్నారు.
పిడికెడు మందితో ప్రారంభమై..
‘ఈ రోజు చాలా గొప్పది. తెలంగాణ పోరాటానికి శ్రీకారం చుట్టిన రోజు. తెలంగాణ సాధించాలని 23 ఏళ్ల క్రితం పిడికెడు మందితో, గుండె ధైర్యంతో.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బయటపడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో ఉద్యమం ప్రారంభించిన రోజు. అలా మొదలై.. మహాసముద్రం అయ్యాం. ఉప్పెనలాగా పెరిగాం. చాలాసార్లు నాగర్కర్నూల్ వచ్చాను. ఉద్యమం పూర్తయ్యే సమయంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోనని ఆమరణ దీక్ష చేపడితే, నన్ను ఖమ్మం జైల్లో వేశారు. మీరంతా ఉప్పెనలా విజృంభించారు. అది గుర్తు చేసుకుంటే బ్రహ్మాండమైన సన్నివేశం. చివరకు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. అలా పోరాడి సాధించిన తెలంగాణ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది.
కేవలం 1.50 శాతం ఓట్లతోనే..
కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి, దుష్ప్రచారాలు చేసి కేవలం 1.50 శాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పారు.. ఒక్క హామీనైనా నెరవేర్చారా? ప్రజల మధ్య నిలుచుని.. ముఖ్యమంత్రికి ప్రజల మాటగా చెబుతున్నా. గ్యారంటీ పథకాలు అమలయ్యాయా? రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. వానలు వచ్చి ధాన్యం తడిసిపోతోంది. భారాస ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 24 గంటల విద్యుత్తు ఇచ్చాం. రెప్పపాటు కాలం కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతోంది. రైతులు రాత్రి పూట బావుల వద్దకు వెళ్తున్నారు. మళ్లీ తేళ్లు, పాములు కుడుతున్నాయి. ఇప్పటి వరకు 250 మంది రైతులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ బాధ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేసీఆర్ పెట్టిందే కదా.. ఉన్నదే కదా.. కొత్తగా గడ్డపార పెట్టి తవ్విందే లేదు. నేను ఇచ్చిన కరెంటును వారు కూడా యథావిధిగా ఇవ్వొచ్చు కదా. సీఎం, మంత్రులు.. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతోంది. ఇదీ రాష్ట్రంలో పరిపాలన.
మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికీ నల్లా ఇచ్చుకున్నాం. పట్టణాల్లో రూపాయికే కనెక్షన్ ఇచ్చి ఉచితంగా మంచినీటిని సరఫరా చేశాం. ఇప్పుడు అది అమలవుతోందా? మళ్లీ బోర్లు ఎండిపోతున్నాయి. నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. బిందెలు మోస్తున్నాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇవ్వకపోయినా.. ఉన్న పథకాలైనా నడిపించొచ్చు కదా. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్కు పంచాయితీ పడింది. జనం తరఫున కొట్లాడేది ఎవరు? కేసీఆరే కదా. యుద్ధం చేద్దామా? మీరు మద్దతు ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. నాగర్కర్నూల్ భారాస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాష్ట్రంలో గురుకులాల అభివృద్ధికి కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో ఎందరో పేద విద్యార్థులు ఎవరెస్టును, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ప్రవీణ్కుమార్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు