సూటిగా చెప్పండి.. గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తారా లేదా?
‘గన్పార్కులో అమరవీరుల స్తూపం వద్దకు రాకుండా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు. నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చా.
రేవంత్ రాజీనామా పత్రం పంపితే నేనూ వెంటనే ఇస్తా
రిజర్వేషన్ల విషయంలో భారాసపై సీఎం తప్పుడు ఆరోపణలు
కొత్త జిల్లాలను తొలగిస్తే ప్రజలు ఊరుకుంటారా?
మాజీ మంత్రి హరీశ్రావు
ఈనాడు, కరీంనగర్- సిద్దిపేట, రాంపూర్, న్యూస్టుడే: ‘గన్పార్కులో అమరవీరుల స్తూపం వద్దకు రాకుండా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు. నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చా. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేయొద్దు. డొంక తిరుగుడు మాటలూ వద్దు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తారా.. చేయరా అనేది సూటిగా చెప్పాలి’ అని రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడానికి భాజపాకు భారాస సహకరిస్తుందని సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయనది మతిమరుపా? లేక అతి తెలివి మాటలా? అని ధ్వజమెత్తారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట శివారు పొన్నాల వద్ద జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో, కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, లోక్సభ అభ్యర్థి వినోద్కుమార్తో కలిసి ప్రచారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు నడుస్తోంది. నేను కొత్త డిమాండ్లు పెట్టడం లేదు. ఎన్నికల సమయంలో బాండ్ల మీద మీరు రాసిచ్చిన వాటినే అమలు చేయాలని కోరుతున్నా. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డికి రేవంత్రెడ్డి పంపిస్తే, నేనూ వెంటనే పంపించేందుకు సిద్ధం. భారాస ఎమ్మెల్యేలను రేవంత్రెడ్డి టచ్ చేయడం, పార్టీలోకి చేర్చుకోవడం మాని ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. అందులోని 13 హామీలను టచ్ చేయాలి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నన్ను తిట్టడం కాదు.. హామీలు అమలు చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్. ఆయన నాయకత్వంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తాం. పార్లమెంట్కు ఒక జిల్లా అని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాను కూడా తీసేస్తారు. ప్రజలు ఊరుకుంటారా.. కొత్త జిల్లాలన్నీ దశాబ్దాల కల. కొత్త జిల్లాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి’ అని అన్నారు.
కిషన్రెడ్డి వెన్నుచూపితే.. రేవంత్ జిరాక్సు కాగితంతో..
‘నాడు ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెన్ను చూపి పారిపోయారు. రేవంత్రెడ్డి జిరాక్సు కాగితంతో తప్పించుకుని తిరిగారు. నేను మాత్రం తెలంగాణ కోసం రెండుమార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవిని త్యజించా. రాష్ట్ర ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. రేవంత్ పదవులు పట్టుకొని పాకులాడారు. ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తి నిలబడ్డారు. 2001లో ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్లోని జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనత గులాబీ జెండా, కేసీఆర్దే. ఆకుపచ్చ, సంక్షేమ తెలంగాణగా మార్చాం. సీఎం రేవంత్రెడ్డి భాజపాతో కుమ్మక్కైన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యంగ సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఆయన మా పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్రాలకు అనుమతివ్వాలని శాసనసభలో తీర్మానం చేసింది భారాస ప్రభుత్వమనే విషయం గుర్తించాలి. కేసీఆర్ హయాంలోని మా ప్రభుత్వం అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి చేసింది.. మా ఎంపీలు కూడా పార్లమెంటులో పోరాటం చేశారు’ అని హరీశ్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ