మంత్రులకు సవాల్!
లోక్సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమించిన కాంగ్రెస్.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరచడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గెలుపు బాధ్యతలను అప్పగించింది.
ఒక్కో లోక్సభ స్థానానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జి
సమన్వయం నుంచి విజయం వరకు వారిదే బాధ్యత
త్రిముఖ పోరులో గరిష్ఠ ఫలితాల కోసం కాంగ్రెస్ వ్యూహరచన
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమించిన కాంగ్రెస్.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరచడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గెలుపు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా, మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతిరోజు సభలు, రోడ్షోల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు. సగానికి పైగా స్థానాల్లో త్రిముఖపోటీ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడంపై వ్యూహరచన చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో పర్యటించినపుడు ఇదే విషయమై దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పట్టు నిలబెట్టుకునేలా..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని లోక్సభ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహరచనను అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతోపాటు, అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన నియోజకవర్గాల్లో ఆ పట్టు నిలుపుకొనేలా చూడటం కూడా కొందరు మంత్రులకు పరీక్షగా మారింది. మంత్రివర్గ విస్తరణలో పదవి కోసం ఎదురు చూస్తున్నవారు కూడా లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో కొందరు మంత్రులకు వారు ప్రాతినిధ్యం వహించేవి, మరికొందరికి ఇతర నియోజకర్గాల బాధ్యతలు అప్పగించారు. ఒకే లోక్సభ స్థానం పరిధిలో ఇద్దరు మంత్రులుంటే వారిలో ఒకరికి ఇతర నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
మహిళా మంత్రుల సమన్వయం
మహబూబాబాద్ స్థానం పరిధిలోని ములుగు నుంచి గెలిచిన మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్సభ బాధ్యత అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో కలిపి అతి తక్కువ ఓట్లు వచ్చిన వాటిలో ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఒకటి. భారాసకు 4.64 లక్షల ఓట్లు, భాజపాకు 4.47 లక్షల ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 2.51 లక్షలు మాత్రమే దక్కాయి. ఏడింటిలో ఒక స్థానం నుంచి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. అవసరమైనప్పుడల్లా తన సొంత లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూనే మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా ఆదిలాబాద్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ ఉద్యమం, హక్కుల ఉద్యమాల్లో మమేకమై నిత్యం ప్రజలతో ఉండే ఆత్రం సుగుణను అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్కు చెందిన మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్సభ సీటు బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గ పరిధిలో కూడా ఒక్క మెదక్ సెగ్మెంటులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన ఆరు చోట్ల భారాస అభ్యర్థులే విజయం సాధించారు. భారాసకు 6.68 లక్షల ఓట్లు, కాంగ్రెస్కు 4.2 లక్షలు, భాజపాకు 2.2 లక్షల ఓట్లు వచ్చాయి. పైగా భారాసకు అత్యధిక మెజార్టీ వచ్చే సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలు ఈ లోక్సభ పరిధిలోనివే. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు.
ఖమ్మం సీటుకు ముగ్గురు మంత్రుల బలం
చివరి నిమిషంలో ఖరారైన ఖమ్మం లోక్సభ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఉప ముఖ్యమంత్రి భట్టి హాజరు కాలేదని తెలిసింది. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి, పొంగులేటి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా.. పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్సభ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలో ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు చూస్తున్న ఇద్దరు మంత్రులు ఉన్నది ఖమ్మం జిల్లాలోనే కావడం బలం చేకూర్చే అంశం. మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హస్తానికే ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల్లో కొన్నింటిని అమలు చేసింది. వీటిని సానుకూలంగా మలుచుకునేలా ప్రచారం, ఇతర పార్టీల నాయకుల చేరికలతో కాంగ్రెస్ను బలోపేతం చేస్తున్న నాయకులు.. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.
ఇంటా.. బయటా గెలిచేందుకు..
ఇతర నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు తమ సొంత నియోజకవర్గాలనూ విస్మరించకుండా రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించారు. కొందరు మంత్రులు రాష్ట్రంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్న దామోదర్ రాజనరసింహ మెదక్ లోక్సభ స్థానంలోనూ సమన్వయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన భారాస కంటే కాంగ్రెస్కు 19 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన మంత్రులు కూడా తమకు అప్పగించినవాటితో పాటు.. తాము తోడ్పాటు అందించగలిగిన నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టారు. మిగిలిన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి (నల్గొండ), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), శ్రీధర్బాబు (పెద్దపల్లి), తుమ్మల నాగేశ్వరరావు (మహబూబాబాద్), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (సికింద్రాబాద్), జూపల్లి కృష్ణారావు (నాగర్ కర్నూల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్) ఇన్ఛార్జిలుగా ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి (నిజామాబాద్), ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి (వరంగల్), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (భువనగిరి) ఉన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి (చేవెళ్ల), మాజీ ఎమ్మెల్యేలు సంపత్కుమార్ (మహబూబ్నగర్), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజిగిరి) ఆయా నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఒబేదుల్లా కొత్వాల్ను ఇన్ఛార్జిగా నియమించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: సీఈవో వికాస్రాజ్
పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి: ప్రియాంక
రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులపాలయ్యింది: అమిత్ షా
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో భారాస అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. -
పోరాడే వ్యక్తులే పార్లమెంట్కు వెళ్లాలి: కేటీఆర్
గత ఐదేళ్లలో భాజపా నేత బండి సంజయ్ గల్లీలో.. దిల్లోలో ఎక్కడైనా కనిపించారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు: ఎర్రబెల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతోంది: కేసీఆర్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతోందని, ఆ పార్టీపై ప్రజల ఆగ్రహంతో ఉన్నారని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. -
రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: రేవంత్రెడ్డి
50 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే: అమిత్షా
సర్జికల్ స్ట్రైక్స్ గురించి సీఎం రేవంత్రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. -
సైనికుల త్యాగాలను అభాసుపాలు చేస్తున్నారు: బండి సంజయ్
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడామని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
‘ఎన్నికల రద్దీ’.. హైదరాబాద్లో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. -
ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. -
కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించండి: చిరంజీవి
చేవెళ్ల లోకసభ స్థానంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించాలని సినీ నటుడు చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
ఏపీకి వెళ్లే వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు వెళ్తున్నారు. -
రివర్స్గేర్లో కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్గేర్లో వెళుతోందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన భారాస కార్నర్ మీటింగ్లో శుక్రవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. -
నేను గెలిస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా?
‘‘లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ గెలుస్తారని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారు. ఆయన గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. -
హోదాను మరచి మాట్లాడుతున్న ప్రధాని: అసదుద్దీన్
కాంగ్రెస్, భారాసలు కలిసి ఎంఐఎంకు హైదరాబాద్ను లీజుకు ఇచ్చేశాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
ప్రచారానికి నేటితో తెర
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
రాజ్యాంగాన్ని భాజపా మారిస్తే రిజర్వేషన్లు మాయం: మంత్రి శ్రీధర్బాబు
రాజ్యాంగాన్ని మార్చడమే లక్ష్యంగా భాజపా ఎన్నికల ప్రచారం చేపడుతోందని, వారి ప్రయత్నం ఫలిస్తే రిజర్వేషన్లు మాయమైపోతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. -
మోదీ ఆటలు సాగనివ్వం
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
ప్రజలపై మోదీ రూ.30 లక్షల కోట్ల భారం మోపారు
‘‘శ్రీరాముడు రాజధర్మం పాటించాలని చెప్పాడు. ప్రజలందర్నీ ఒకేలా పాలించాలన్నాడు. తెలంగాణపై మోదీ సవతి ప్రేమ కనబరుస్తున్నారు. -
భాజపా విభజన రాజకీయాలు చేస్తోంది
జీవితాలు బాగుపడాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని ఆ పార్టీ జాతీయ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు శశిథరూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ రామ్మోహన్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.