శాసించేది పోలింగ్ శాతమే!
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నమోదయ్యే పోలింగ్ శాతం పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంతోపాటు ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యనూ ప్రభావితం చేస్తోంది.
కొద్ది శాతం అంతరంతో సీట్లలో భారీ తేడా
నేతలకు దడ పుట్టిస్తున్న గత ఎన్నికల గణాంకాలు
ఓట్లు పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నమోదయ్యే పోలింగ్ శాతం పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంతోపాటు ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యనూ ప్రభావితం చేస్తోంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కొద్దిశాతం ఓట్ల అంతరంతోనే ప్రధాన పార్టీలు భారీగా సీట్లు కోల్పోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీలు ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇంకా గడువు పక్షం రోజులే ఉంది. ఈసారి రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ప్రతిఓటూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతోపాటు ఓట్ల శాతాన్ని పెంచుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. గత లోక్సభ ఎన్నికలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తమకు, ప్రత్యర్థులకు లభించిన ఓట్ల లెక్కల్ని బేరీజు వేసుకుంటున్నాయి. తక్కువ ఉన్న చోట్ల అంతరాన్ని పూడ్చుకోవడంపై దృష్టి సారించాలని అభ్యర్థులకు సూచిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించుకుంటూ..హోరాహోరీ పోటీ ఉన్న చోట ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకుల్ని చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల ముగిసిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఓట్లు చేర్పించేందుకు ప్రయత్నించడం ఇందులో భాగమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఓట్లలో 2.05 శాతమే.. సీట్లలో భారీ తేడా..
ఆయా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఫలితాల్ని విశ్లేషించగా.. కొద్ది శాతం ఓట్ల తేడాతో సాధించిన సీట్లలో భారీగా అంతరం కన్పించింది. ఉదాహరణకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 39.40 శాతం ఓట్లతో 64 సీట్లు సాధిస్తే, 37.35 శాతం ఓట్లు పొందిన భారాసకు వచ్చిన సీట్లు 39 మాత్రమే. అంటే 2.05 శాతం ఓట్ల తేడాతో భారాస 25 సీట్లు కోల్పోయింది.
2014 లోక్సభ ఎన్నికల్లో 34.94 శాతం ఓట్లతో భారాస 11 ఎంపీ సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ 41.71 శాతానికి పెంచుకున్నా సాధించిన సీట్ల సంఖ్య 9కే పరిమితమైంది. 2019లో 19.65 శాతం ఓట్లతోనే భాజపా నాలుగు సీట్లు గెలుచుకోగా, 29.79 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ మూడు సీట్లే సాధించడం గమనార్హం. ‘సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం మెరుగ్గా ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 2014తో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏకంగా 6.4 తగ్గింది. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? అన్నది ఒక అంశం అయితే.. నమోదయ్యే పోలింగ్ శాతం ప్రకారం ఏ పార్టీకి ఓట్లు పెరుగుతాయి, ఏ పార్టీకి తగ్గుతాయి అనేదీ కీలకమేనని ఓ ప్రధాన పార్టీ నేత వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం