భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్కే
‘‘పదేళ్లుగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని మోదీకి, భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్కు తీసుకెళ్తారు.
మోదీని ఓడించే సమయం వచ్చింది
మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చే యత్నం
వనస్థలిపురం, మల్కాజిగిరి కౌకూర్ రోడ్షోల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు-హైదరాబాద్, నాగోలు, ఆర్కేపురం, సఫిల్గూడ, బొల్లారం-న్యూస్టుడే: ‘‘పదేళ్లుగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని మోదీకి, భాజపాకు ఓటేస్తే.. పదవులు, పరిశ్రమలన్నీ గుజరాత్కు తీసుకెళ్తారు. తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోదీకి ఓటెందుకు వేయాలి? పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారు? వైద్య కళాశాలలను ఎందుకు మంజూరు చేయలేదు? ఈ ప్రశ్నలకు ఈ నెల 30న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని జవాబు చెప్పాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ వనస్థలిపురం, కౌకూర్ చౌరస్తాలలో ఆదివారం నిర్వహించిన రోడ్షోల్లో ఆయన ప్రసంగించారు. ‘‘మతాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాను, మోదీని ఓడించే సమయం వచ్చింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో నివసిస్తున్న రైల్వే అధికారులు, ఉద్యోగులు కాంగ్రెస్కు ఓటేస్తేనే ఉద్యోగ భద్రత ఉంటుంది. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రైల్వేను అదానీ, అంబానీలకు అప్పజెబుతారు.
భారాస, భాజపా చీకటి ఒప్పందం తేటతెల్లం
లోక్సభ ఎన్నికల్లో భారాస-భాజపాల మధ్య చీకటి ఒప్పందం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటల ద్వారా తేటతెల్లమైంది. ఒప్పందం కుదరకపోతే ఈటల తప్పకుండా గెలుస్తారని మల్లారెడ్డి ఎలా అంటారు. కేసీఆర్కు తెలియకుండానే మల్లారెడ్డి ఆ మాటన్నారా? నిజంగా భాజపాతో ఒప్పందం లేకపోతే మేడ్చల్ ఎమ్మెల్యేకు భారాస షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి.. ఇప్పుడు ఉద్యోగం ఊడిపోయిన కేసీఆర్కు తత్వం బోధపడింది. ఓట్ల కోసం కొంగజపం చేస్తున్నారు. కారు చెడిపోయిందని బస్సులో బయలుదేరారు. తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేకపోగా.. మరోసారి మోసం చేసేందుకు పర్యటిస్తున్నారు. కారును రిపేరు కోసం షెడ్డుకు పంపించామని కేటీఆర్ అంటున్నారు. రిపేరు కాదు.. మొత్తం ఖరాబైంది. ఆర్టీసీని వారు దివాలా తీయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మేం లాభాలబాట పట్టించాం. జీరో టికెట్లకు నెలకు రూ.349 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,359 కోట్లు చెల్లించాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు గుళ్లు, గోపురాలకు వెళ్తున్నారు. అక్కచెల్లెళ్లను గౌరవించే ఉద్దేశంతోనే పీసీసీ అధ్యక్షుడిగా ముగ్గురు మహిళలకు ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చాను. మల్కాజిగిరి ఎంపీగా సునీతా మహేందర్రెడ్డిని గెలిపిస్తే హయత్నగర్ వరకూ మెట్రోను విస్తరిస్తాం. మూసీని ప్రక్షాళన చేస్తాం. ముంపు ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి తెస్తాం. జూబ్లీ బస్స్టేషన్ నుంచి మేడ్చల్ వరకూ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయి’’ అని రేవంత్రెడ్డి వివరించారు. కార్యక్రమాల్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మధుయాస్కీ, మల్రెడ్డి రాంరెడ్డి, ఎం.రామ్మోహన్గౌడ్, జక్కిడి ప్రభాకర్రెడ్డి, హరివర్ధన్రెడ్డి, తోటకూర వజ్రేశ్యాదవ్, నక్కా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బండి రాలేదు కానీ..
‘ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం వరదల కారణంగా మనుషులు, కార్లు కొట్టుకుపోతే.. అప్పటి భాజపా అధ్యక్షుడు, నాయకులు ఆర్భాటంగా హామీలిచ్చారు. బండి పోతే బండి.. సైకిల్ పోతే సైకిల్ ఇస్తామని చెప్పారు. బండి రాలేదు గాని.. ఇప్పుడు ఓట్లడిగేందుకు ఈటల వస్తున్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్ర మంత్రిగా, ఏడాది పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్ ఎల్బీనగర్కు ఎప్పుడైనా వచ్చారా? గతంలో భారాసలో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తో పంపకాల్లో తేడా రావడంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఎవర్నీ ఆయన పలకరించబోరు. కొద్దినెలల క్రితం కురిసిన వర్షాలకు ఓ బాలిక నాలాలో పడి చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎందుకు ఓడిపోయారు? ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 11 డివిజన్లలో భాజపా కార్పొరేటర్లున్నారు. వారెప్పుడైనా ప్రజల వద్దకు వచ్చారా? మేలు చేయనివారు ఎలా ఓట్లడుగుతారు?’ అని రేవంత్ ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ