రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి
రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు మళ్లిస్తామంటున్నా.. సీఎం రేవంత్రెడ్డి, భాజపా ఎంపీలు నోరు మెదపటం లేదని విమర్శించారు.
గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ..
సీఎం, భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు?
కేంద్రంలో సంకీర్ణమే.. నామా మంత్రి అవుతారు..
ఖమ్మంలో భారాస అధినేత కేసీఆర్
ఈటీవీ, ఖమ్మం: రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు మళ్లిస్తామంటున్నా.. సీఎం రేవంత్రెడ్డి, భాజపా ఎంపీలు నోరు మెదపటం లేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి భాజపాలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోందని.. ఈ పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో భాజపాకు 370, 400 సీట్లు కాదు కదా.. 200 కూడా దాటే పరిస్థితి లేదని చెప్పారు. ఈసారి దేశంలో వచ్చేది ముమ్మాటికీ సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో తాను చేస్తున్న రోడ్షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. భారాస 12 స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రజలు భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే.. సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు, సీట్లే ముఖ్యం
‘భారాస హయాంలో పంజాబ్ను తలదన్నే స్థాయిలో తెలంగాణలో వడ్లు పండించాం. 3.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు సాధించాం. వడ్లు కొనబోమని కేంద్రం మొండికేసింది. నామా ఆధ్వర్యంలో భారాస ఎంపీలు వెళ్లి కలిస్తే.. తెలంగాణ ప్రజలు నూకలు తినండి అని కేంద్ర మంత్రి హేళన చేశారు. తెలంగాణ మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తే.. భాజపా, కాంగ్రెస్ ఎంపీలెవరూ నోరు తెరవలేదు. ఆ రెండు పార్టీలకు తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి. కానీ రైతుల సమస్య పట్టదు. గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తామని మోదీ చెబుతున్నారు. అయినా ఒక్కరూ మాట్లాడటం లేదు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా సాగునీటి సమస్యలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు చేపట్టాం. 37 టీఎంసీల ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఖమ్మం జిల్లాలోని సాగుభూమి అంతటికీ నీరు ఇవ్వొచ్చు. పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి కర్ణాటక, తమిళనాడులకు నీరు తరలిస్తామంటుంటే.. రాష్ట్రంలోని భాజపా, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రతిపాదన నా దగ్గరికి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చి.. మా వాటా మాకు ఇచ్చేదాకా.. నా తల తెగిపడ్డా ఒప్పుకొనేది లేదని చెప్పాను. ఇదీ భారాస విధానం.
సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆరే
దున్నేవానికి భూమి, తినేవానికి విస్తరాకు లాంటి ఎన్నో నినాదాలు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. కానీ వీరెవరూ చేయని సంక్షేమాన్ని కేవలం ఆనాడు మహానుభావుడు ఎన్టీఆర్ చేసి చూపించారు. సంక్షేమం ఎన్టీఆర్ హయాం నుంచే మొదలైంది. పేదలకు బుక్కెడు బువ్వ దొరికింది పుణ్యాత్ముడు ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చాకే. రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, భూమిశిస్తు రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ హయాం నుంచే మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. చరిత్ర తుడిచేస్తే పోయేది కాదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ను మించిన సంక్షేమ పథకాలను భారాస ప్రభుత్వం అమలు చేసింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు, పంటల కొనుగోళ్లు వంటి వెసులుబాట్లు రైతులకు కల్పించాం.
తులం బంగారం తుస్సు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి.. వాటిని గాలికొదిలేసింది. తులం బంగారం తుస్సుమంది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటుంది. కరెంటు ఎటోపోయింది. మొన్న మహబూబ్నగర్లో శ్రీనివాస్గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుండగా కరెంటు పోయిందని చెబితే.. అబద్ధాలు ఆడుతున్నానని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్లిచ్చే దిక్కు లేదు. విద్యార్థులు రోడ్లపైకి పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నాడు భారాస హయాంలో వరి కోతలు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి. మోసపూరిత హామీలిచ్చి అమలు చేయకుండా, ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు సీఎం రేవంత్రెడ్డి. రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను ఆగస్టు 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీశ్రావు సవాల్ విసిరితే సీఎం ఎందుకు వెళ్లలేదు? హామీలు అమలు చేసే వరకు పోరాడతాం. కాంగ్రెస్ మెడలు వంచాలంటే భారాసకు బలం ఇవ్వాలి’ అని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం శ్రేణుల ఘనస్వాగతం
అంతకుముందు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్కు భారాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నగరం గులాబీమయంగా మారింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. రోడ్షోలో ఖమ్మం లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నేతలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇంట్లో కేసీఆర్ రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. -
తెలంగాణలో 65.67శాతం పోలింగ్ : సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM